Smart Phones: డిమాండ్ తగ్గిన ‘లో-వ్యాల్యూ’ స్మార్ట్ మొబైల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smart Phones: ఇండియన్స్ సహజంగా రెండేళ్లకోసారి స్మార్ట్ఫోన్ మారుస్తుంటారు. కిందపడి పగిలిపోవటం వల్ల గానీ.. పాతబడి సరిగా పనిచేయకపోవటం వల్ల గానీ.. వాడుతున్న ఫోన్ను పక్కన పెట్టి కొత్తది కొంటుంటారు. కానీ.. ఇప్పుడు.. అలా.. ఈజీగా కొత్త ఫోన్ కొందామంటే ప్రజల దగ్గర పైసల్లేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా.. ద్రవ్యోల్బణం వల్ల ఇండియాలో తక్కువ రేటు స్మార్ట్ఫోన్లకి డిమాండ్ పడిపోయింది.
ఉపాధి స్థాయిలు బలహీనంగా మారుతుండటం, ఆదాయాలు తగ్గుతుండటం వల్ల గతంలో మాదిరిగా ఇష్టంవచ్చినట్లు ఖర్చుపెట్టడానికి జనం చేతిలో డబ్బులేకుండాపోతోంది. ఇన్ఫ్లేషన్ ఇన్క్రీజ్ అవుతుండటం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల సరఫరా వ్యవస్థలో ఆటంకాలు రావటం, ఎలక్ట్రానిక్ విడి భాగాల కొరత ఏర్పడటం, చైనాలో జీరో కొవిడ్ పాలసీ తదితర కారణాలు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఫోన్ల గిరాకీపై ప్రతికూల ప్రభావం చూపాయి.
Also Read
- Chanakya Niti: ఓర్వలేని చుట్టాలకు చెక్ పెట్టే చాణక్య నీతి.. రాబంధువుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండిలా!
- Anand Mahindra: మనుషులకు ప్రకృతి నేర్పే 'డెడ్లీ' లెసన్.. బిలియనీర్ చెప్పిన పవర్ఫుల్ మెసేజ్!
- SuperShe Island: పురుషులు లేని ప్రపంచం.. మహిళలకు మాత్రమే ఎంట్రీ! సూపర్ షీ ఐలాండ్ విశేషాలు ఇవే..
- Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
read more: Adani FPO: ఇప్పుడున్న పరిస్థితుల్లో అదానీ ‘ఆఫర్’ సక్సెస్ అవుతుందా?
ఈ విషయాన్ని కౌంటర్పాయింట్ రీసెర్చ్ అనే మార్కెట్ ఇంటలిజెన్స్ సంస్థ గత నెలలో ప్రచురించిన నివేదికలో వెల్లడించింది. ప్రీమియం సెగ్మెంట్లో విక్రయాల పెరుగుదల కొనసాగుతుండగా ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో డిమాండ్ తగ్గటం సేల్స్ని దెబ్బతీసిందని పేర్కొంది. సెప్టెంబర్ చివరి వారంలో పండగ సీజన్ నేపథ్యంలో కస్టమర్ల నుంచి భారీగా గిరాకీ నెలకొందని, దీంతో స్మార్ట్ఫోన్ల డిమాండ్ పీక్ లెవల్కి చేరుకున్నట్లు ఇంతకుముందు తెలిపిన ఇదే సంస్థ ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా చెబుతుండటం గమనార్హం.
ప్రస్తుతం ఎంట్రీ టయర్ మరియు బడ్జెట్ సెగ్మెంట్లలో దాదాపు అన్ని బ్రాండ్లదీ ఇదే పరిస్థితి అని కౌంటర్పాయింట్ రిపోర్ట్ వివరించింది. 2021లో కొవిడ్-19 మహమ్మారి విజృంభించటంతో ప్రజల ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయని బీబీసీ రిపోర్ట్ పేర్కొంది. ద్రవ్యోల్బణం దిగిరాకపోవటం మరియు యువతలో ఉద్యోగ భద్రత కొరవడటం స్మార్ట్ఫోన్ బిజినెస్ ఎదుగుదలకు ప్రతిబంధకంగా మారిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
మొబైల్ ఫోన్లను ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకునే విషయంలో యువత ముందుంటారు. కానీ.. వాళ్లకు ఆర్థిక పరిస్థితులు కలిసిరాకపోవటం స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దీనికితోడు.. ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్ల రేట్లు సైతం భారీగా పెరిగాయి. రెండేళ్ల కిందట 10 వేల రూపాయలు పలికిన ఫోన్ ఖరీరు 2022లో ఏకంగా 16 వేల రూపాయలకు పైగా చేరుకుంది.
ఇండియాలో.. ఎంట్రీ లెవల్ హ్యాండ్ సెట్లను ఎక్కువ శాతం దిగువ మధ్యతరగతి ప్రజలే వాడుతుంటారు. వాటి తయారీ కూడా మన దేశంలోనే జరుగుతుంటుంది. భారతదేశంలో సుమారు 450 మిలియన్ల మంది ఈ ఫీచర్ ఫోన్లను వినియోగిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి. ఈ బేసిక్ హ్యాండ్సెట్ల ధరలు 15 వందల రూపాయల లోపే ఉంటాయి.
దిగువ మధ్యతరగతివాళ్లు ఈ తక్కువ రేటు స్మార్ట్ఫోన్లను కొందామన్నా వాళ్ల చేతిలో సొమ్ములు ఉండట్లేదు. ఎకానమీ ఓవరాల్గా నెమ్మదించటం మరియు అధిక నిరుద్యోగం ఎన్నో కుటుంబాల ఆదాయానికి గండిపెట్టాయి.ప్రైవసీ కారణంగా ఫీచర్ ఫోన్ల వాడకం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. మరో వైపు.. స్మార్ట్ఫోన్లను నిఘా పరికరాలుగా కూడా మార్చుకోవచ్చని సూచిస్తున్నారు.
మొబైల్ ఫోన్లను సర్వైలెన్స్ డివైజ్లుగా మార్చటం వల్ల వాటి పనితీరు మీద ప్రభావం పడదని స్పష్టం చేస్తున్నారు. వీటన్నింటికీ తోడు ఇప్పుడు ఆర్థిక మాంద్యం భయాలు వ్యాపిస్తున్నాయి. ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయి. కొత్తవి దొరికేసరికి ఎన్నాళ్లు పడుతుందో తెలియదు. కావున.. ఇండియాలో ‘‘లో-లెవల్’’ స్మార్ట్ఫోన్లకు డిమాండ్ మరింత డౌన్ కావొచ్చని అంటున్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!