Rice Shortage: ప్రపంచవ్యాప్తంగా బియ్యం కొరత. గడచిన 20 ఏళ్లలో ఎన్నడూ లేనంత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rice Shortage: ఈ సంవత్సరం.. ప్రపంచవ్యాప్తంగా బియ్యం కొరత నెలకొననుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. గడచిన 20 ఏళ్లలో ఎన్నడూలేనంతగా ఈసారి గ్లోబల్ రైస్ మార్కెట్లో షార్టేజ్ ఏర్పడనుందని ఫిచ్ సొల్యూషన్స్ సంస్థ పేర్కొంది. 2003-04 సంవత్సరంలో 18 పాయింట్ 6 మిలియన్ టన్నుల బియ్యం కొరత తలెత్తగా 2022-23లో 8 పాయింట్ 7 మిలియన్ టన్నుల లోటు నమోదుకానుందని ఒక ఇంగ్లిష్ మీడియా సంస్థ తెలిపింది.
Birla returns: మళ్లీ వచ్చిన బిర్లా. నష్టాల నుంచి వీఐ గట్టెక్కెనా?
Also Read
- Origin of Telangana: ‘తెలంగాణ’ పేరు ఎప్పడిదో తెలుసా? వందల ఏండ్ల కిందటి ఈ సీక్రెట్ హిస్టరీ సూస్తే మైండ్ పోవాల్సిందే!
- IRCTC Jyotirlinga Darshan Yatra: శివభక్తులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్.. ఒకే టూర్లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. పూర్తి వివరాలు ఇవే!
- Adhika Masa Purnima: ఈ రోజే అధిక మాస పౌర్ణమి.. పవిత్ర స్నానాలకు, దానాలకు ఏ సమయం శుభప్రదమో తెలుసుకోండి!
- Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
అమెరికా, చైనాతోపాటు ఐరోపా సమాఖ్యలో వరి పంట దిగుబడి పడిపోనుండటమే బియ్యం కొరతకి కారణం కానుందని విశ్లేషకులు చెబుతున్నారు. బియ్యం కొరత వల్ల.. డిమాండ్ పెరిగి.. రేట్లు ఆకాశాన్నంటుతాయి. ఫలితంగా మూడున్నర కోట్ల మందికి పైగా ప్రజల పైన ప్రభావం పడనుంది. మరీ ముఖ్యంగా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని జనం తీవ్ర ఇబ్బందులకు గురికానున్నారు.
ఎందుకంటే.. ప్రపంచం మొత్తమ్మీద చూస్తే.. 90 శాతం బియ్యాన్ని ఈ రీజియన్ ప్రజలే వినియోగిస్తున్నారు. ప్రపంచంలో అత్యధికంగా పండించే పంటల్లో ఒకటైన వరి దిగుబడి పడిపోతే బియ్యాన్ని దిగుమతి చేసుకునే దేశాలకు కష్టాలు తప్పవు. నిజం చెప్పాలంటే.. అంతర్జాతీయ మార్కెట్ని ఇప్పటికే బియ్యం కొరత వేధిస్తోంది.
అందుకే.. ప్రస్తుతం.. పదేళ్లలో ఎన్నడూ లేనంతగా బియ్యం ధరలు మండిపోతున్నాయని ఫిచ్ సొల్యూషన్స్కి చెందిన
ఛార్లెస్ హార్డ్ అనే కమోడిటీ ఎక్స్పర్ట్ తెలిపారు. ఇవే ధరలు వచ్చే సంవత్సరం కూడా కొనసాగుతాయని ఈ సంస్థ రూపొందించిన కంట్రీ రిస్క్ అండ్ ఇండస్ట్రీ రీసెర్చ్ రిపోర్ట్ హెచ్చరించింది. ఆసియాలోని అన్ని మార్కెట్లలోనూ బియ్యమే ప్రధాన ఆహార వస్తువు.
కాబట్టి.. బియ్యం రేట్లు పెరిగితే.. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం పెరుగుతుంది. తద్వారా.. ఆహార భద్రతకు భంగం కలుగుతుంది. ఈ పరిణామం.. పేద కుటుంబాల్లో భయాందోళనలకు దారితీస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే.. ఇండియా.. ఇటీవల బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించింది.
ప్రపంచంలో బియ్యాన్ని ఎక్కువగా ఎగుమతి చేసే దేశమైన ఇండియా ఈ నిర్ణయం తీసుకోవటం పలు దేశాలను పునరాలోచనలో పడేసింది. వర్షపాతం సగటు కన్నా తక్కువగా నమోదవుతుందనే హెచ్చరికల నేపథ్యంలో ఇండియా.. బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించటంతోపాటు కొన్ని రకాల బియ్యం ఎగుమతులపై 20 శాతం పన్ను విధించింది.
అయినప్పటికీ ఎగుమతులు మూడున్నర శాతం పెరిగి 22 పాయింట్ రెండు ఆరు మిలియన్ టన్నులకు చేరాయి. ఈ ఎగుమతులు.. థాయ్ల్యాండ్, వియత్నాం, పాకిస్థాన్ మరియు అమెరికా ఉమ్మడి ఎగుమతుల కన్నా కూడా ఎక్కువ కావటం విశేషం. దీన్నిబట్టి ప్రపంచవ్యాప్తంగా బియ్యానికి ఎంత గిరాకీ నెలకొందో అర్థంచేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!