Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News It Employees 22 Lakh Indians Likely To Leave Jobs By 2025

IT Employees: మరిన్ని రోజులు ఉండం.. మళ్లీ ఇటువైపు రాం.

Published Date :October 22, 2022 , 11:53 am
By Akkirala Kondala Rao
IT Employees: మరిన్ని రోజులు ఉండం.. మళ్లీ ఇటువైపు రాం.
  • Follow Us :
  • google news
  • dailyhunt

IT Employees: వచ్చే మూడేళ్లలో ఏకంగా 22 లక్షల మంది ఐటీ ప్రొఫెషనల్స్ జాబులు వదులుకోనున్నారని ఓ రిపోర్ట్ వెల్లడించింది. దీన్నిబట్టి మన దేశంలోని ఐటీ-బీపీఎం రంగంలో ఉద్యోగ క్షీణత ఏ రేంజులో ఉండనుందో అర్థంచేసుకోవచ్చు. దీంతోపాటు.. 57 శాతం మంది ఐటీ నిపుణులు మళ్లీ ఈ సర్వీసుల సెక్టారులోకి రావాలనుకోవట్లేదని కూడా ఆ నివేదిక పేర్కొంది. ‘ట్యాలెంట్ ఎక్సోడస్ రిపోర్ట్’ పేరుతో ఈ నివేదికను ‘‘టీమ్ లీజ్ డిజిటల్’’ అనే సంస్థ రూపొందించింది. దీని ప్రకారం 2022 ఆర్థిక సంవత్సరంలో 49 శాతంగానే ఉన్న కాంట్రాక్ట్ సిబ్బంది తొలగింపు 2023 ఆర్థిక సంవత్సరంలో 55 శాతానికి చేరుకోనుందని అంచనా వేసింది.

క్యాండేట్ మార్కెట్లో సెంటిమెంటుకు సంబంధించి భారీ అపోహ నెలకొంది. శాలరీ పెంచితే ఉద్యోగి పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుందని, జాబ్ శాటిసిఫ్యాక్షన్‌కి బూస్ట్ మాదిరిగా పనిచేస్తుందనుకోవటం సరికాదు. ఈ మధ్య కొన్ని సంస్థలు శాలరీలు పెంచుతున్నా ఉద్యోగ వలసలను ఆపలేకపోతున్నాయని, 2025 నాటికి 22 లక్షల మంది కొలువులకు గుడ్ బై చెబుతారని అంచనా. ‘‘ఇండియన్ ఐటీ సెక్టార్ గత దశాబ్ద కాలంలో అద్భుతమైన ప్రగతిని సాధించింది. 15.5 శాతం గ్రోత్‌ను నమోదు చేసింది. తద్వారా 227 బిలియన్ డాలర్ల టర్నోవర్‌కి చేరింది. ఫలితంగా గత ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ఐదున్నర లక్షల మందికి ఉద్యోగాలను కల్పించింది.

ఈ స్థాయిలో అభివృద్ధి చెందాలంటే మామూలుగైతే పదేళ్లకు పైగా టైమ్ పడుతుంది. అలాంటిది ఆ లోపే లక్ష్యం సాకారమైందంటే ఎంత శరవేగంగా సాగిందో అర్థంచేసుకోవచ్చు’’ అని టీమ్ లీజ్ డిజిటల్ సీఈఓ సునిల్ అన్నారు. ఐటీ రంగంలో నియామకాల ప్రక్రియకు కరోనా మహమ్మారి ఆటంకం కలిగించటంతో అప్పటివరకు కొనసాగిన ఈ పాజిటివ్ ట్రెండ్ కాస్తా రివర్స్ అయింది. బిజినెస్-క్రిటికల్ ట్యాలెంట్ పీపుల్ వెళ్లిపోకుండా ఆపటం కష్టసాధ్యమైంది. దీనికితోడు కొవిడ్ తర్వాతి రెండేళ్లలో ఐటీ హైరింగ్ చైన్‌లో చాలా మార్పులు వచ్చాయి అని సునిల్ చెప్పారు.

కొత్త ఉద్యోగాల్లోకి వెళ్లేవారు శాలరీ హైక్‌తోపాటు ఇతర బెనెఫిట్స్ కూడా చూసుకుంటారు. వర్క్ మరియు లైఫ్‌కి సంబంధించి ఎంప్లాయీస్ ఫీలింగ్స్‌లో చెప్పుకోదగ్గ మార్పులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో యజమానులు తమ ఇంటర్నల్ పాలసీలతోపాటు ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ పట్ల సైతం పునరాలోచన చేయాల్సిన అవసరం నెలకొందని టీమ్ లీజ్ డిజిటల్ సీఈఓ సునిల్ అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల అవసరాలు, ప్రాధాన్యతలు మారాయి. ఫ్లెక్సిబిలిటీ, కెరీర్ గ్రోత్, ఎంప్లాయ్ వ్యాల్యూ పొజిషన్ తదితర అంశాల ఆధారంగా వాళ్లు తమ కెరీర్‌ని రీ-ఎవాల్యుయేషన్ చేసుకుంటున్నారు.

ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం కన్నా మంచిది దొరికితే దీన్ని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోతున్నారు. అన్నింటికీ మించి ఉద్యోగంలో సౌకర్యానికే ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ గణాంకాలను బట్టి వెల్లడవుతోంది. సంస్థల వ్యూహాత్మక నియామక ప్రణాళికలు తమ ఉద్యోగుల కోణంలో, వాళ్ల అభివృద్ధి లక్ష్యంగా ఉండాలి. అప్పుడు మాత్రమే సరైన ఉద్యోగుల ఎంపిక జరుగుతుంది. పని పట్ల విలువ, గౌరవం ఉన్నోళ్లు దొరుకుతారు. అలాంటివాళ్ల వల్లే కంపెనీ ఔట్‌పుట్ పెరుగుతుంది. దాని ద్వారా మరో పది మందికి ప్రయోజనం కలుగుతుంది.

2021లో ఐటీ సేవల రంగంలో క్షీణత వల్లే నవతరం సంస్థలు తమ వర్క్ ఫోర్సును పెంచుకుంటున్నాయి. ఇప్పుడు చేసే ఉద్యోగంలో బెటర్ కంపెన్సేషన్ మరియు బెనెఫిట్స్ లోపించటం వల్లే ట్యాలెంటెడ్‌ పీపుల్ కొత్త కొలువులోకి వెళ్లిపోతున్నారని స్టడీలో పాల్గొన్న దాదాపు 50 శాతం మంది అన్నారు. కెరీర్ గ్రోత్ లేకపోవటం వల్లే స్వస్తి చెబుతున్నామని 25 శాతం మంది తెలిపారు. అత్యధిక శాలరీలు తీసుకునే బెస్ట్ ఎంప్లాయీస్ స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదులుకొని అర్ధంతరంగా వెళ్లిపోతే ఆయా సంస్థలకు టర్నోవర్ పరంగా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ట్యాలెంట్ ఎక్సోడస్ రిపోర్ట్ పేర్కొంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • business special stories
  • IT employees
  • Talent Exodus Report
  • Team Lease Digital

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : కుప్పకూలిన అమెరికా ఫైటర్ జెట్..

  • US Iran War: వ్యూహం మార్చిన ఇరాన్.. ఆ దేశాలే టార్గెట్.. భారతీయులకు పొంచి ఉన్న ముప్పు!

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • IND vs AFG Schedule 2026: భారత్-అఫ్గానిస్థాన్‌ షెడ్యూల్ విడుదల.. మ్యాచ్‌లు ఎప్పుడు, ఎక్కడంటే?

  • Shoaib Akhtar-India: అదృష్టం వల్లే విజయాలు.. వరల్డ్‌ కప్ గెలిచే అర్హత భారత్‌కు లేదు!

  • TG Govt: విదేశాల్లో చిక్కుకున్న తెలంగాణ ప్రజలకు అండగా ప్రభుత్వం.. 24×7 కంట్రోల్ రూమ్ నంబర్స్ ఇవే

ట్రెండింగ్‌

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • Sanju Samson Comeback: అవకాశాల్లేవు, ఛీకొట్టారు, రిటైర్మెంట్ అన్నారు.. కట్ చేస్తే ‘జెనరేషన్ నాక్’తో నోళ్లు మూయించాడు!

  • Sanju Samson Record: సంజు శాంసన్‌ రేర్ రికార్డు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions