Plane Crashes: విమాన ప్రమాదాల నుంచి ప్రాణాలతో బయటపడిన నాయకులు వీరే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Plane Crashes: విమాన ప్రయాణం అనేది రాజకీయ నాయకులకు సౌలభ్యాన్ని, సమయాన్ని ఆదా చేస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో ప్రాణాలను కూడా తీస్తుందని ఇప్పటికే పలు సందర్భాల్లో నిరూపించింది. ఇప్పటి వరకు ఈ విమాన ప్రమాదాలలో చనిపోయిన చాలా మంది ప్రముఖులు గురించి మనకు తెలుసు. కానీ కొంత మంది ప్రముఖ నాయకులు ఈ ఘోర విమాన ప్రమాదం నుంచి బయటపడినట్లు చరిత్ర చెబుతుంది. నిజానికి విమాన ప్రమాదాల నుంచి బయటపడిన ఆ నాయకుల ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Ajit Pawar : అజిత్ పవార్ విమానాన్ని నడిపిన పైలట్లు వీరే.. కెప్టెన్ సుమిత్ , శాంభవి పాఠక్..!
Also Read
- 116 Year Old Woman: తిరుపతిలో నమ్మశక్యం కాని దృశ్యం.. 3550 మెట్లు ఎక్కిన 116 ఏళ్ల బామ్మ! వీడియో వైరల్..
- Siva Narayana Reddy: ప్రేమకు గుర్తుగా షాజహాన్ తాజ్ మహల్ కడితే.. ఏపీలో ఒక భర్త తన భార్య కోసం ఏం చేశాడో చూడండి!
- Success Story: అదృష్టం అంటే నీదే గురు.. రూ.4 లక్షల జీతం.. బోనస్గా థాయ్లాండ్ ట్రిప్! ఏం చేశాడో తెలుసా?
- Amazon Mystery: ప్రపంచానికి దూరంగా మరో ప్రపంచం.. అమెజాన్ అడవిలో ఇప్పటికీ రహస్యంగా జీవిస్తున్న తెగలు
తృటిలో తప్పించుకున్న మాజీ ప్రధాని ..
ఈ సంఘటన 1977లో మాజీ ప్రధానమంత్రి పర్యటనలో వెలుగు చూసింది. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ప్రయాణిస్తున్న విమానం అస్సాంలో కూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. కానీ అప్పటి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పి.కె. తుంగోన్ ఈ ప్రమాదం కారణంగా తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ఎడమ కాలుకు ఫ్రాక్చర్, ఇతర గాయాలయ్యాయి.
* 2001లో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ హెలికాప్టర్లో ప్రయాణిస్తుండగా, చురు జిల్లాలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ చెట్టును ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదం నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు.
* 2004లో గుజరాత్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్, కేంద్ర మాజీ మంత్రులు పృథ్వీరాజ్ చవాన్, కుమారి సెల్జా అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు.
* 2007లో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, ఆయన మంత్రివర్గ సహచరుడు పి.ఎస్.బజ్వా ప్రయాణిస్తున్న ఒక హెలికాప్టర్ గురుదాస్పూర్లో విద్యుత్ తీగలలో చిక్కుకుంది. ఈ ప్రమాదం నుంచి వారు తృటిలో తప్పించుకున్నారు.
* 2009 ఆగస్టు 30న పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రయాణిస్తున్న చార్టర్డ్ హెలికాప్టర్.. ఫిరోజ్పూర్లో అత్యవసరంగా ల్యాండ్ అవుతున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు.
* 2010లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్, ఉపాధ్యక్షుడు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ రాంపూర్ (ఉత్తరప్రదేశ్) కు వెళ్తుండగా, వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎండిన గడ్డి కుప్ప దగ్గర దిగడంతో మంటలు చెలరేగాయి. కానీ వెంటనే పైలట్ టేకాఫ్ చేసి మరొక చోట సురక్షితంగా ల్యాండ్ చేశారు.
* మే 9, 2012న జార్ఖండ్ ముఖ్యమంత్రి అర్జున్ ముండా హెలికాప్టర్ రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయంలో కూలిపోయినప్పుడు ఆయన ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన భార్య మీరా ముండాతో సహా మరో ఐదుగురు ఈ ఘోర ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు.
* మే 25, 2017న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా హెలికాప్టర్ ప్రమాదం నుంచి అద్భుతంగా బయటపడ్డారు. ఆ టైంలో ఆయన ప్రయాణిస్తున్న సికోర్స్కీ హెలికాప్టర్ లాతూర్ జిల్లాలోని నీలాంగా హెలిప్యాడ్ వద్ద దాదాపు 80 అడుగుల ఎత్తు నుంచి కూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి ఆయన, ముగ్గురు అధికారులు, పైలట్, కో-పైలట్ ఎటువంటి తీవ్రమైన గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు.
READ ALSO: Ajit Pawar: అజిత్ తర్వాత ‘పవర్’ ఎవరికి? పార్టీ పగ్గాల కోసం తెర వెనుక పావులు
తాజావార్తలు
-
Nara Lokesh : ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే..
-
Kishan Reddy : మజ్లిస్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం
-
Kapil Dev: విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు.. 37 ఏళ్ల వయసులో ఆ రేంజ్ ఫామ్ పెట్టుకుని ఏంటా నిర్ణయం?
-
Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
-
Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!