Dussehra: దసరా స్పెషల్.. అమ్మవారి గొప్పదనం తప్పక తెలుసుకోవాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dussehra: ఈ సృష్టిని నడిపిస్తున్నది త్రిమూర్తులు. ఆ త్రిమూర్తులను కన్న మూర్తి ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆదిపరాశక్తి. ప్రేమను పంచడంలో అమ్మ, తప్పును సరిద్దిద్దడంలో గురువు, ఈ సృష్టిని కనుసైగలతో శాసించగల ఆదిపరాశక్తికి తారతమ్యాలు లేవు. అందరిని ఒకే తీరుగా చూస్తుంది. అమ్మకి ఆగ్రహం అనుకుంటున్నారు చాలంది. కానీ బిడ్డలను అనుగ్రహించడం వాళ్ళకి అనురాగం పంచడం మాత్రమే తెలుసు ఆ మహాశక్తికి. అందుకే జగజనని అంటారు ఆ తల్లిని. అంటే ఈ జగత్తు అంతటికి అమ్మ ఆదిపరాశక్తి. ఆమె ఈ విశ్వంలోని ప్రతి జీవిని తన బిడ్డగానే చూస్తుంది, అమ్మకి పక్షపాతం ఉండదు. అనడానికి ఈ కథనే ఉదాహరణ. పూర్వం భోజ మహారాజు ఆస్థానంలో దండి, భవభూతి, కాళిదాసు అనే ముగ్గురు దిగ్గజ కవులు ఉండేవారు. ఆ ముగ్గురు కవులు పాడిత్యంలో ఒకరిని మించిన వారు ఇంకొకరు. అయితే ఒకనాడు భోజ మహారాజుకు వారిలో ఎవర్ని ‘మహాకవి’ అని సంబోధించాలి? అనే సందేహం కలిగింది.
Read also:Skanda : అనుకున్న సమయం కంటే ముందుగానే ఓటీటీ రిలీజ్ కాబోతున్న స్కంద…?
Also Read
- Chanakya Niti: విజయం మీ బానిస కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఈ 'సీక్రెట్స్' పాటించాల్సిందే!
- Mark Zuckerberg: ఫేస్బుక్ను సృష్టించిన ‘డ్రాపౌట్’.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన జుకర్బర్గ్కు డిగ్రీ లేదు తెలుసా!
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Titanic Life Jacket: 114 ఏళ్ల కిందటి విషాదానికి సాక్ష్యం.. వేలంలో రూ.8 కోట్లు పలికిన టైటానిక్ లైఫ్ జాకెట్!
ఈ చిక్కు ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్తారు. ఈ ముగ్గురు పాండిత్యాన్ని పరీక్షించి బేరీజు వేయగల ఉద్దండులు ఎవరు లేరు. కనుక ఈ సందేహాన్ని ఆ ఉజ్జయినీ మహంకాళినే తీర్చాలి అని ఆ తల్లి పైనే భాధ్యతను ఉంచాడు. ఆ తల్లినే నా సందేహాన్ని నివృతి చెయ్యాలని ముగ్గురినీ వెంటబెట్టుకుని ఆలయానికి వెళ్లాడు. తన సందేహాన్ని మూల మూర్తికి నివేదించాడు. కొద్దిసేపటికి ‘కవిర్దండి’ అనే పలుకులు వినిపించాయి. నిజమే, కవి అంటే.. దండే! అనంతరం ‘భవభూతిస్తు పండితః’.. పాండిత్యమంటే భవభూతిదే అనే పలుకూ వెలువడింది. అయితే తన గురించి ఎం చెప్పలేదని కాళిదాసుకు కోపం కట్టలు తెంచుకుంది. పట్టరాని ఆవేశంతో భరించలేని వేదన దుఃఖంగా మారగా వస్తున్న ఏడుపును ఆపుకోవడం వల్ల స్వరం దగ్ధంగా మారింది. అయిన తీవ్ర స్వరంతో మరి మరి నేనెవర్నే? అని ఆ తల్లిని నిలదీసాడు.
Read also:Cyclone Tej: పెరగనున్న తేజ్ తుఫాను తీవ్రత.. ఈ రాష్ట్రానికి ముప్పు
మాట్లాడితే అమ్మ వారి మీద లాలాజలం తుంపర్లు ఎక్కడ పడతాయో అని ఆ గంగా జనుకుడు సైతం చేయి అడ్డుపెట్టుకుని మాట్లాడతారు. అమ్మతో మాట్లాడడానికి అందరూ భయపడతారు. కానీ కాళిదాసు అమ్మని ఏకవచనమ్ తో పిలిచినా అమ్మ శాంత మూర్తి కనుక బిడ్డ తప్పుగా మాట్లాడిన ఓర్పుగా.. నువ్వే నేను నేనే నువ్వు ఇందులో నీకు ఎలాంటి సందేహం వద్దు అని ఒక్క మాటలో సమాధానం ఇచ్చింది. ‘నీ అక్షరం.. బీజాక్షరం’ అని చెప్పకనే చెప్పింది. ఆ మాటకు కాళిదాసు హృదయం ద్రవించింది. కన్నీళ్లతో ఆ తల్లి పాదాల పైన పాడ్డారు. ఎదుటి మనిషి చేసిన తప్పును తప్పు అని నొప్పించకుండా చెప్పే శక్తి ఒక ప్రేమకే ఉంది. ఆ ప్రేమకి నిదర్శనం ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ ఆదిపరాశక్తి. ఆర్తి తో అమ్మ అంటే చాలు పలుకుతుంది ఆ పరమేశ్వరి.
తాజావార్తలు
-
GT vs SRH Playing 11: మొదట ప్లే-ఆఫ్ చేరేది ఎవరో.!
-
Anjanadri Temple: బంగారం కాదు రాగి?.. ఆంజనాద్రి అంజన్న ఆలయంలో ఆభరణాల విరాళ వివాదం!
-
Gayatri Gupta:“హగ్గులు లేకపోతే నిద్ర పట్టదు”.. గాయత్రీ గుప్తా ఓపెన్ కామెంట్స్!
-
AIADMK MLAs Support Vijay: అన్నాడీఎంకేలో భారీ చీలిక.. విజయ్ గూటికి 30 మంది ఎమ్మెల్యేలు..
-
Madhav Tiwari: నేను 4 ఓవర్లు బౌలింగ్ చేశా, ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. డీసీ ప్లేయర్ ఆనందం!
ట్రెండింగ్
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!