Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Ysrcp Mp Vanga Geetha Mla Pandem Dorababu

YCP : పిఠాపురం వైసీపీలో కొత్త రగడ.

Published Date :June 1, 2022 , 11:50 am
By Premchand Chowdary
YCP : పిఠాపురం వైసీపీలో కొత్త రగడ.
  • Follow Us :
  • google news
  • dailyhunt

కాకినాడ జిల్లాలోని పిఠాపురం వైసీపీలో కొత్త సెగలు రేగుతున్నాయి. ఎంపీ వంగాగీత, ఎమ్మెల్యే పెండెం దొరబాబు మధ్య రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఇద్దరూ పిఠాపురం కేంద్రంగా పొలిటికల్‌ ఎత్తుగడలు వేస్తున్నారు. రోజులు గడిచేకొద్దీ అవి కాకరేపుతున్నాయి. ఎంపీ, ఎమ్మెల్యేలు వేసే ఎత్తుగడలు.. రాజకీయ వ్యూహాలు ఆసక్తిగా మారుతున్నాయి.

వంగా గీత కాకినాడ వైసీపీ ఎంపీగా ఉన్నారు. అంతకుముందు టీడీపీ తరఫున జడ్పీ ఛైర్‌పర్సన్‌గా.. రాజ్యసభ సభ్యురాలిగా పని చేశారు. వంగా గీత సొంత నియోజకవర్గం పిఠాపురం. కాకినాడ పార్లమెంట్ పరిధిలోనే ఉంటుంది. 2009లో పీఆర్పీ తరఫున పిఠాపురం నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కాంగ్రెస్‌లో కొనసాగారు. 2019 ఎన్నికల వరకు సైలెంట్‌గా ఉన్న ఆమెకు.. అప్పటి వరకు కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న చెలమలశెట్టి సునీల్‌ టీడీపీలోకి వెళ్లిపోవడంతో రాజకీయంగా కలిసి వచ్చింది. వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేయడం గెలవడం చకచకా జరిగిపోయింది.

పెండెం దొరబాబు 2004లో బీజేపీ నుంచి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత వైసీపీలో చేరిపోయారు. 2014 ఎన్నికల్లో ఓడినా.. 2019లో గెలిచారు. వంగా గీత, దొరబాబు ఇద్దరూ ఒకే సామాజికవర్గం. ప్రస్తుతం ఒకే పార్టీ. అయినప్పటికీ ఇద్దరికీ అస్సలు పడదు. ఇటీవల కాలంలో పిఠాపురంపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు వంగా గీత. ఇది ఎమ్మెల్యే దొరబాబుకు చిర్రెత్తుకు వస్తోందట. నియోజకవర్గంలో ఎవరి గ్రూప్ వారిదే. పార్టీ నాయకులు ఒకరితో సఖ్యతగా ఉంటే మరొకరికి శత్రువు కావడం ఖాయం అనే చర్చ ఉంది. పార్టీ ఒక్కటే అయినా వర్గాలు వేర్వేరు.

తన పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంపీగా పర్యటిస్తే తప్పేంటి అనేది గీత వేస్తున్న ప్రశ్న. కానీ, ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇష్టపడటం లేదు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో హాజరైనా నోటితో నవ్వుకుని నొసటితో వెక్కిరించుకుంటున్న పరిస్థితి ఉంది. ఒకే పనికి చెరొక ఆర్డర్ ఇస్తుండటంతో అధికారులు సైతం తల పట్టుకుంటున్నారట. ఏదైనా ఉంటే మీరూ మీరూ తెల్చుకోవాలి కానీ.. మధ్యలో మమ్మల్ని డోలక్ వాయించినట్టు వాయిస్తే ఎలా మహాప్రభో అని గగ్గోలు పెడుతున్నారట అధికారులు. వైపీపీ కేడర్‌కి సైతం చుక్కలు కనిపిస్తున్నాయట.

నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే బాస్‌ అని పార్టీ స్పష్టం చేసిందని.. మధ్యలో ఈ గూడు పుఠాణీ ఏంటన్నది ఎమ్మెల్యే దొరబాబు వాదన. అయితే వైసీపీలో చేరినప్పుడే అసెంబ్లీకి పోటీ చేయాలని వంగా గీత చూశారట. సామాజిక సమీకరణాల వల్ల ఆమెను కాకినాడ ఎంపీగా పోటీ చేయించింది పార్టీ. చెలమలశెట్టి సునీల్‌ తిరిగి వైసీపీలోకి రావడవంతో.. వంగా గీత పిఠాపురం అసెంబ్లీ సీటుపై కన్నేసినట్టు చెవులు కొరుక్కుంటున్నారు. వైసీపీలో మొదటి నుంచి ఉన్న తమను కాదని వేరెవరికో ఎలా టికెట్‌ ఇస్తారని దొరబాబు వర్గం కౌంటర్‌ ఇస్తోందట. ఈ క్రమంలోనే ఎంపీ దగ్గరకు వెళ్లిన వారికి ఎమ్మెల్యే దగ్గర పనులు కావని.. ఆయనకి టచ్‌లో ఉంటే ఆమె దగ్గర నోఎంట్రీ అని జోకులు పేలుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, ద్వితీయశ్రేణి నేతలు సైతం ఇరువురు నేతల వ్యవహార శైలికి నొచ్చుకుంటున్నారట. ఎవరికి వారు తమ ఆధిపత్యం కోసం తమని బలి చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారట. ఈ విషయం పార్టీ పెద్దలు దృష్టికి తీసుకుని వెళ్లాలని ప్రయత్నం చేసినా అవి ఆచరణలోకి రాలేదట.. ఈ లోపు రోజు రోజుకి నియోజకవర్గం ఫ్యాన్ పార్టీ లీడర్లకి హీట్ పెరిగిపోతోంది. మరి.. ఈ ఆధిపత్యపోరులో ఎవరు పైచెయ్యి సాధిస్తారో చూడాలి.
.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap politics
  • Kakinada
  • MLA Pandem Dorababu
  • MP Vanga Geetha
  • YSRCP

తాజావార్తలు

  • డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో David Warner అరెస్ట్.. కోర్టు విచారణకు ఆదేశం.!

  • Turkey: టర్కీలోని ఇజ్రాయెల్ కాన్సులేట్‌పై కాల్పులు.. ముగ్గురు దుండగులు హతం

  • Congress vs TMC: బెంగాల్‌లో మమతకు ముచ్చెమటలు పట్టిస్తున్న కాంగ్రెస్ వ్యూహం..

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • Dragon : ఎన్టీఆర్ కారణంగా నిలిచిన షూట్?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions