Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Will Ycp Play Safe Game There

అక్కడ వైసీపీ సేఫ్ గేమ్ ఆడుతుందా.? అందుకేనా ఆ ఏర్పాట్లు..? l

Published Date :May 3, 2022 , 1:58 pm
By Premchand Chowdary
అక్కడ వైసీపీ సేఫ్ గేమ్ ఆడుతుందా.? అందుకేనా ఆ ఏర్పాట్లు..? l
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

లావు శ్రీకృష్ణదేవరాయులు. నరసరావుపేట వైసీపీ ఎంపీ. ఇదే ప్రాంతానికి చెందిన మరో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతల చుట్టూ నరసరావుపేట వైసీపీ రాజకీయం ఆసక్తిగా మారుతోంది. ఒకరు ఎగ్జిట్‌ అయ్యి.. ఇంకొకరు ఎంట్రీ ఇస్తారనే చర్చ అధికారపార్టీ వర్గాల్లో ఊపందుకుంది. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు కేంద్రంగా జరుగుతున్న ప్రచారం.. చర్చలు మరెంతో ఉత్కంఠ రేపుతోంది.

మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి 2009లో నరసరావుపేట టీడీపీ ఎంపీ. 2014కు వచ్చేసరికి గుంటూరు పశ్చిమ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సమయంలో టీడీపీలో ఉన్న కొందరు నాయకులతో విభేదాలు వచ్చి వైసీపీలో చేరారు మోదుగుల. 2019లో గుంటూరు నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా బరిలో నిలిచినా సక్సెస్‌ కాలేదు. ఎన్నికల మేనేజ్‌మెంట్‌ సరిగా చేసుకోలేక మోదుగుల ఓడిపోయారని పార్టీ వర్గాల్లో ఒక అభిప్రాయం ఉంది. ఆ ఎన్నికల్లో వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం.. తాను ఓడిపోవడంతో కొన్నాళ్లు సైలెంట్‌ అయ్యారు. వైసీపీ కార్యక్రమాల్లో అరుదుగా కనిపించేవారు. కానీ.. ఇటీవల కాలంలో పొలిటికల్‌గా యాక్టివ్‌ అయ్యారు మోదుగుల. పార్టీ కార్యక్రమాలతోపాటు అన్నిచోట్లా ఆయన కనిపిస్తున్నారు. ఇదంతా పార్టీ అధినేత జగన్‌ను కలిసిన తర్వాత వచ్చిన మార్పుగా వైసీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ.

Also Read

  • Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
  • Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
  • Off The Record : ఎన్టీఆర్ జిల్లాలో బలమైన కాపు నేతల కోసం వైసీపీ వెదుకులాట
  • Off The Record : టేకాఫ్ ఉంటుందా? లేదా పర్మినెంట్ ల్యాండిగేనా?
Add as a preferred
source on google

వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి మోదుగుల పోటీ చేస్తారని టాక్‌ నడుస్తోంది. ఇక్కడ పార్టీ సిట్టింగ్‌ ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు ఉండగా.. మోదుగులకు ఎందుకు టికెట్‌ ఇస్తారో కూడా పార్టీ వర్గాలు ప్రచారంలో పెట్టేస్తున్నాయి. శ్రీకృష్ణదేవరాయులకు లోక్‌సభ పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలతో పడటం లేదు. ఒకరిద్దరు మినహా ఆయన్ని నియోజకవర్గానికి పిలిచే ఎమ్మెల్యేలు లేరు. ఆ మధ్య వినుకొండ పరిధిలో ఒక రైతు కామెంట్స్‌ విషయంలో రచ్చ రచ్చ అయింది. అక్కడ ఎమ్మెల్యే బొల్లాను కాకుండా మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున్‌ను ప్రోత్సహిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో వినుకొండలో MPకి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు బొల్లా. ఇక మంత్రి రజనీతో కూడా ఎంపీకి విభేదాలు ఉన్నాయి. పైగా శ్రీకృష్ణదేవరాయులు పార్టీ మారిపోతారని ఆయన వైరి వర్గం గట్టిగా ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారాన్ని ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు ఎప్పటికప్పుడు ఖండిస్తున్నా.. వైసీపీ వర్గాల్లో అనుమానాలు ఉన్నాయని కొందరి వాదన. అందుకే అధికారపార్టీ సేఫ్‌ గేమ్‌ ఆడుతోందని అభిప్రాయపడుతున్నారట.

నరసరావుపేటలో మోదుగుల ఎంట్రీకి చెబుతున్న ఇతర కారణాలు కూడా మరెంతో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఆయన గతంలో ఇక్కడ ఎంపీగా పోటీ చేసి ఉండటంతో.. ఆ పరిచయాలు కలిసి వస్తాయని మరోవర్గం ప్రచారం మొదలు పెట్టేసింది. పైగా పార్టీ నాయకత్వం ఆశీసులు పూర్తిగా ఉన్నాయని చెబుతున్నారట. గత ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభ బరిలో వైసీపీ నుంచి కిలారు రోశయ్యను పోటీకి దించాలని చూశారు. కానీ.. చివరిక్షణంలో జరిగిన మార్పులు చేర్పుల్లో రోశయ్యను పొన్నూరు అసెంబ్లీకి పంపి.. మోదుగులను ఎంపీగా బరిలో నిలిపారు. ఆ ఎన్నికలు కలిసిరాకపోవడంతో మోదుగుల మళ్లీ నరసరావుపేటనే నమ్ముకున్నట్టు తెలుస్తోంది. దీనికి ప్రస్తుత పరిణామాలు కూడా అనుకూలంగా ఉండటంతో గేర్‌ మార్చేస్తున్నారట ఈ మాజీ ఎంపీ. ఇంకో ప్రచారం కూడా ఇక్కడ నడుస్తోంది. శ్రీకృష్ణదేవరాయులు పార్టీలోనే ఉంటే ఆయన్ని గుంటూరు పంపి.. మోదుగులకు నరసరావుపేట ఎంపీ టికెట్‌ ఇస్తారని చెవులు కొరుక్కుంటున్నారు. మరి.. ఎంపీ, మాజీ ఎంపీల రాజకీయ భవిష్యత్‌ ఏంటో కాలమే చెప్పాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • andhra politics
  • Politics
  • tdp
  • ycp

తాజావార్తలు

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions