అడిగేవారు లేరనే ఫీలింగ్లో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికారం మనదే.. అడిగేవారే లేరు.. అంటూ ఇష్టం వచ్చినట్టు చేస్తున్న ఆ ఎమ్మెల్యేలపై వేటు తప్పదా? నిఘావర్గాల నివేదికలతో ఆ ఎమ్మెల్యేల జాతకాలు మారబోతున్నాయా? అన్నీ చూస్తున్న హైకమాండ్… వారిని వదిలించుకోవాలనే నిర్ణయానికి వచ్చిందా?
జగన్ గాలిలో అనామకులు సైతం ఎమ్మెల్యేలుగా గెలుపు..!
Also Read
2014లో ఓడిన వైసీపీ 2019లో 151 సీట్లతో ఘన విజయం సాధించింది. టీడీపీకి కంచుకోటలు వంటి నియోజకవర్గాల్లో సైతం వైసీపీ విజయబావుటా ఎగుర వేసింది. ఏ మాత్రం రాజకీయ అనుభవం లేకుండా ఇతర వృత్తుల్లో ఉంటూ సీటు రాగానే వచ్చి పోటీ చేసిన అనామకులను సైతం గెలిపించేసింది జగన్ గాలి.
నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేపై సీఎం జగన్కు ఫిర్యాదు చేసిన ఎంపీ..?
అయితే ప్రతి జిల్లాల్లో కొంతమంది ఎమ్మెల్యేల తీరుపై పుంఖాను పుంఖాలుగా హైకమాండ్కు ఫిర్యాదులు అందుతున్నాయి. ఆ జిల్లాలు, నియోజకవర్గాల్లో ఆ ఎమ్మెల్యేల అక్రమ కార్యకలాపాల గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అడిగేవారు ఎవరూ లేరన్నట్టు ఇష్టారీతిన కలెక్షన్లు చేసేస్తున్నారు కొంత మంది ఎమ్మెల్యేలు. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే దందాలను ఈ మధ్య ఓ రాజ్యసభ సభ్యుడు సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారట. ఆ ఎమ్మెల్యే చేస్తున్న వసూళ్లు, అక్రమదందాల వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తోందని జగన్కు చెప్పారట.. ఆ ఎంపీ. అతన్ని పిలిచి మాట్లాడాలని, హెచ్చరించాలని ఎంపీ సూచించారట. అంతా విన్న సీఎం జగన్… అతన్ని మనం తీసేస్తాం కదన్నా…. సీటు కూడా ఇవ్వం… ఇంకేం అవుతుంది అన్నారట.
కేడర్తో గొడవ పడిన ఆ ఎమ్మెల్యేకి ఈసారి సీట్ కట్..?
గుంటూరు జిల్లా పల్నాడులో ఓ ఎమ్మెల్యే నెల ఆదాయం మూడు కోట్లు అని ప్రచారం జరుగుతోంది. అదంతా టార్గెట్లు పెట్టిమరీ వసూలు చేస్తున్నదేనట. ఇంకో ఎమ్మెల్యే ఏకంగా దుకాణం తెరిచారట. వెంచర్ వేసినా.. అపార్ట్మెంట్ కట్టినా ఎమ్మెల్యే ఫిక్స్ చేసినంత ఇచ్చుకోవాల్సిందేనట. అలా ఇచ్చిన బిల్డర్లు… కొనుగోలుదారుల నుంచి ఆ డబ్బును వసూలు చేస్తుండటంతో వారి మీద అదనపు భారం పడుతోందట. అదే జిల్లాలో ఓ ఎమ్మెల్యే పని తీరుపై మొదటి సంవత్సరంలోనే హైకమాండ్ పూర్తి అసంతృప్తికి వచ్చేసిందట. ఏకంగా పేకాట శిబిరాలు నడిపించడమేకాక.. పార్టీ కేడర్తో గొడవపడిన ఆ ఎమ్మెల్యేకి ఈసారి సీట్ కట్ అనే చర్చ పార్టీలో జరుగుతోంది.
ప్రకాశం జిల్లాలో సీఐ బదిలీ కోసం ఇన్నోవా తీసుకున్న ఎమ్మెల్యే..?
కాంట్రాక్టు పనుల్లో కమీషన్లు కొట్టేస్తున్న ఎమ్మెల్యేపై ఓ మంత్రి ఫిర్యాదు..?
అనంతపురం, కడప జిల్లాల్లోనూ ఒకరిద్దరు ఎమ్మెల్యేల తీరు ఇదేనట. కొంతమంది అయితే మూడు నెల్లకు, నాలుగు నెల్లకు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలను బదిలీ చేయిస్తూ… కొత్త వారిని తెచ్చకుంటూ బాగా వెనుకేసుకుంటున్నారట. ప్రకాశం జిల్లాలో ఓ ఎమ్మెల్యే ఓ సీఐ బదిలీ కోసం ఇన్నోవా తీసుకున్నారట. ఆ విషయం హైకమాండ్ దృష్టికి రావడంతో ఆ డబ్బు వెనక్కి ఇప్పించారట. అదే జిల్లాలో పక్క జిల్లా నుంచి వెళ్లి మరీ ఎమ్మెల్యే అయిన వ్యక్తి కాంట్రాక్టు పనుల్లో కమీషన్ కొట్టేస్తున్నారని ఓ మంత్రే స్వయంగా సీఎంకు కంప్లైంట్ చేశారట. పార్టీ నేతలకు పనులు ఇస్తే కమిషన్ అడగటం ప్రాబ్లం అవుతుందని… పక్క పార్టీల నుంచి చేరిన, చేర్చుకున్న వారికి కాంట్రాక్టులు ఇప్పించి మరీ కమీషన్ తీసుకుంటున్నారట. ఇలాంటి వారిని ఏం చేయాలో అర్ధం కావడం లేదని… ఆ మంత్రి జగన్ దగ్గర వాపోయారట.
డబ్బు పెట్టి గెలిచాం.. కార్యకర్తలతో పని లేదన్నట్టుగా కొందరు ఎమ్మెల్యేల తీరు..?
అవినీతి ఆరోపణలు.. జనామోదం లేనివారికి సీట్లు ఇవ్వరా..?
ఇలాంటి వాళ్లు జిల్లాకు ఇద్దరు ముగ్గురు ఉన్నారట. కొంత మంది అక్రమ వసూళ్లు, సంపాదనకు తెర తీస్తే… ఇంకొందరు కేడర్ తో సత్సంబంధాలు నెరపడంలో, వారితో సఖ్యతగా ఉండటంలో విఫలం అవుతున్నారట. డబ్బు పెట్టాం గెలిచాం… ఇక కార్యకర్తలతో మనకేం పని అన్నట్టుగా ఇంకొందరు ఉంటున్నారట. ఇలాంటి వాళ్ల జాబితా ఇంకొకటి కూడా హైకమాండ్ చేతిలో ఉందట. వచ్చే ఏడాది జనవరి నుంచి పీకే టీం వస్తుందని…. సర్వే చేస్తుందని ఇంతకు ముందు జగన్ కేబినెట్ లో చెప్పారు. ఆ టీం వచ్చాక…. ఈ తరహా ఎమ్మెల్యేలకు సంబంధించిన పూర్తి చిట్టాలతోపాటు అక్కడ జనం ఏం అనుకుంటున్నారు? ఎవరిని కోరుకుంటున్నారు? అనే సమాచారం సేకరించాలని పార్టీ నిర్ణయించింది. అటు కార్యకర్తల నుంచి వ్యతిరేకత…. ఇటు అవినీతి అరోపణలతో జనామోదంలేని వాళ్లకు తిరిగి సీట్లు ఇవ్వకపోవచ్చని అంటున్నారు. భారీ సంఖ్యలో సీట్లు సాధించిన పార్టీలో మళ్లీ గెలవడానికి కనీసం మూడో వంతు మందిని మార్చేస్తుంటాయి. కొత్త వారికి సీట్లు ఇస్తుంటాయి. ఏపీలో కూడా అలాగే జరగవచ్చని అంటున్నారు. అదే జరిగితే 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలలో ఎంతమందికి సీట్లు లేకుండాపోతాయో.
తాజావార్తలు
-
International Yoga Day: 12 ఏళ్లు పూర్తి.. అసలు జూన్ 21నే యోగా డే ఎందుకు జరుపుకుంటారు? చరిత్ర ఇదే!
-
CM Chandrababu Naidu: యోగాతో హెల్తీ, వెల్తీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం.!
-
NEET UG Re Exam 2026: నేడు నీట్-యూజీ రీ-ఎగ్జామ్.. 1.3 లక్షల సీసీటీవీ కెమెరాలు, 51 వేల జామ్మర్లతో భద్రతా ఏర్పాట్లు
-
Prasidh Krishna: బుమ్రా, భువికి కూడా సాధ్యంకాలేదు.. చెపాక్ లో కిట్టు గాడి కాకరేపే రికార్డు!
-
IND W vs SA W: టీ20 ప్రపంచకప్లో భారత్కు కీలక పోరు.. దక్షిణాఫ్రికాపై హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి.!
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!