టీఆర్ఎస్ అధినేత ఏపీలో పార్టీ పెడతారా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ చీఫ్.. ఏపీలో పార్టీ పెడతారో లేదో కానీ.. ప్లీనరీలో ఆయన చేసిన ప్రకటన ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. అధికార వైసీపీ కౌంటర్లపై కౌంటర్లు వేస్తోంది. రాజకీయ లబ్ధికోసం నేతలు చేస్తున్న ప్రయత్నాలు.. ఈ రగడను అనేక మలుపులు తిప్పుతోంది. మాటల దాడి ఇక్కడితో ఆగుతుందా? మరింత ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో పార్టీలు ఉన్నాయా?
రెండు రాష్ట్రాలను కలిపేస్తే సమస్యే ఉండబోదన్న పేర్ని నాని..!
Also Read
టీఆర్ఎస్ ప్లీనరీలో గులాబీ బాస్.. సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ, తెలంగాణలో మాటల మంటలు రాజేస్తున్నాయి. ఏపీలోనూ పార్టీ పెట్టాలని కోరుతున్నారని కేసీఆర్ చేసిన ప్రకటన.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. వైసీపీ నేతలు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందించారు. కేసీఆర్ వస్తానంటే ఎవరైనా వద్దన్నారా అని బదులిచ్చారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మంత్రి పేర్ని నాని మాత్రం మరో అడుగు ముందుకేసి.. సమైక్యాంధ్ర పల్లవి అందుకున్నారు. రెండు రాష్ట్రాలను కలిపేస్తే.. ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీలో కేసీఆర్ పార్టీ పెట్టడం కంటే.. రెండు రాష్ట్రాలను కలిపేస్తే అసలు సమస్యే ఉండదని వాదించారు పేర్నినాని. ఇప్పుడీ కామెంట్సే రెండు రాష్ట్రాల్లో చర్చగా మారాయి.
తెలంగాణాను బలిచ్చే కుట్ర జరుగుతోందన్న రేవంత్..!
రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికారపార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సమయంలోనే తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఈ ఎపిసోడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. రాజ్య విస్తరణకాంక్షకు తెలంగాణాను బలిచ్చే కుట్ర జరుగుతోందని తన ట్వీట్లో బలమైన పదాలను ప్రయోగించారు రేవంత్రెడ్డి. టీఆర్ఎస్ ప్లీనరీలో తెలుగుతల్లి విగ్రహం ప్రత్యక్షం.. ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ల ఉమ్మడి కుట్రగా ఆయన ఆరోపించారు. మంత్రి పేర్ని నాని సమైక్యాంధ్ర ప్రతిపాదన ఆ కుట్రలో భాగంగా విమర్శించారు రేవంత్రెడ్డి.
టీఆర్ఎస్ రియాక్షన్పై ఆసక్తి..!
ఏపీలో పోటీ.. పార్టీ పెట్టడం అనే మాటలు టీఆర్ఎస్ నుంచి కొత్తగా వచ్చినవేమీ కావు. గతంలోనూ పలు సందర్భాలలో అన్నవే. అప్పట్లో ఏపీ నుంచి పెద్దగా రియాక్షన్ లేదు. ఇప్పుడు ఏపీలోని అధికారపార్టీ వేసిన కౌంటర్లే పొలిటికల్ సర్కిళ్లలో చర్చగా మారాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హుజురాబాద్, బద్వేల్లోఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు వాటిపై ఫోకస్ పెట్టినవాళ్లకు.. కొత్త ఎపిసోడ్ ఆకట్టుకుంది. కీలక బాణం వదిలిన టీఆర్ఎస్ నుంచి రియాక్షన్స్ లేవు. కానీ.. ప్లీనరీలో విడిచిపెట్టిన అస్త్రం మాత్రం ఇతర పార్టీలను కుదురుగా ఉండనివ్వడం లేదు. ఈ రగడ ఉభయ రాష్ట్రాల్లోని పార్టీలకు రాజకీయంగా ఏ మేరకు కలిసి వస్తుందో.. వారి ఆలోచనలేంటో కాలమే చెప్పాలి. అందుకే ఈ మాటల యుద్ధం ఇక్కడితో ఆగుతుందో.. మరింత ముందుకెళ్తుందో అన్న ఆసక్తి అయితే రెండు రాష్ట్రాల్లోనూ నెలకొంది.
- Tags
- Andhra Pradesh
- cm kcr
- telangana
- TRS
తాజావార్తలు
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
T20 World Cup: ఆమె భర్త కోసం ప్రాక్టీస్ ఎగ్గొట్టింది.. చివరకు డ్రెస్సింగ్ రూమ్లో పరువు పోయింది..
-
Golconda Hostel Incident : గోల్కొండ హాస్టల్లో షాక్.. బాత్రూంలో ప్రసవం, శిశువు మృతి!
-
Off The Record: ఉదయగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు? ఆయనపై అసంతృప్తి పెరుగుతోందా?
-
Indian Railway: ఇండియన్ రైల్వేలో సరికొత్త విప్లవం.. టెక్నాలజీ వాడకంలో భారత్ నెక్స్ట్ లెవెల్..
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!