TDP : ఆ మాజీమంత్రి మహానాడుకు వెళ్తే ఆదరించరని సందేహం కలిగిందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగుదేశం పార్టీకి మహానాడు కీలకం. ఆ వేడుక ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు పార్టీ నాయకులు… కార్యకర్తలు. అంతటి కీలకమైన కార్యక్రమానికి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు డుమ్మా కొట్టేశారు. టీడీపీ హైకమాండ్తో గంటాకు సఖ్యత లేదన్నది ఇటీవల చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చినప్పుడు బహిర్గతమైంది. చంద్రబాబును ఆహ్వానించేందుకు ఎయిర్పోర్టుకు వెళ్తే ముఖస్తుతి పలకరింపులే దక్కాయట. దాంతో పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్షకు హాజరుకాలేదు గంటా. మరో రెండేళ్లలో ఎన్నికలు ఉండటంతో యాక్టివ్ పాలిటిక్స్ ఉండేందుకు పావులు కదుపుతున్నారు మాజీ మంత్రి. టీడీపీ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తరచూ టీడీపీ ఆఫీసుకు వెళ్తున్నారు. ఈక్రమంలోనే మహానాడుకు కూడా గంటా హాజరవుతారని భావించారు పార్టీ నేతలు. పైగా రాష్ట్ర భవిష్యత్ బాగుపడాలంటే చంద్రబాబు వల్లే సాధ్యమని.. టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమైని కీలక వ్యాఖ్యలు చేశారు గంటా.
మహానాడు అట్టహాసంగా జరిగింది. కానీ.. అందులో గంటా శ్రీనివాసరావు కనిపించలేదు. మహానాడుకు గంటా వెళ్లకపోవడంపై మళ్లీ కథ మొదటికి వచ్చిందనే కామెంట్స్ జోరందుకున్నాయి. మాజీ మంత్రి ఎందుకు వెళ్లలేదు అనే ఆరాలు మొదలయ్యాయి. వ్యక్తిగత కారణాలతోనే గంటా మహానాడుకు వెళ్లలేదని సన్నిహిత వర్గాల సమాచారం. అయితే పార్టీలో మరో చర్చా జరుగుతోందట. మహానాడుకు టీడీపీ ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానాలు వెళ్లాయి. వారి హోదాలు ఆధారంగా గ్యాలరీలను కేటాయించారు. వేదికపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, పొలిట్బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు మాత్రమే కూర్చునే విధంగా ఏర్పాట్లు జరిగాయి. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్లకు A గ్యాలరీని కేటాయించారు. ఎమ్మెల్యే హోదాలోనే గంటాను ఆహ్వానించారట. మినహాయింపులు ఇస్తే గంటాను వ్యతిరేకిస్తున్న టీడీపీలోని సీనియర్లతో ఇబ్బందులు వస్తాయని హైకమాండ్ ఆ నిర్ణయం తీసుకుందట. ఈ చర్యను అవమానంగా భావించే మాజీ మంత్రి మహానాడుకు వెళ్లలేదని చర్చ జరుగుతోంది.
Also Read
అయితే మహానాడులో ముందు అనుకున్న నిబంధనలేవీ అమలు కాలేదు. జిల్లా స్థాయి టీడీపీ నాయకులు సైతం వేదికపై కనిపించారు. అలాగే నలుగురితో వెళ్లడం కంటే.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోరుకుంటారు గంటా. అయితే మాజీ మంత్రికి ప్రాధాన్యం ఇవ్వొద్దని టీడీపీలోని బలమైనవర్గం చంద్రబాబుపై ఒత్తిడి తెస్తోందట. మరో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడితో గంటాకు రాజకీయ వైరం ఉంది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడితోనూ సన్నిహిత సంబంధాలు లేవన్నట్టు వినికిడి. ఈ మూడేళ్ల కాలంలో గంటా పార్టీ మారిపోతారని రకరకాలుగా ప్రచారం జరిగింది. అలాగే టీడీపీ హైకమాండ్ నిర్ణయాలతో సంబంధం లేకుండా వ్యవహరించడం కూడా ప్రతికూలంగా మారిందని టాక్. ప్రస్తుతానికి టీడీపీలోనే ఉండాలని నిశ్చయించుకున్నప్పటికీ పార్టీ అధిష్ఠానంతో ఉన్న గ్యాప్ను తగ్గించుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు గంటా. చంద్రబాబును కలిసి మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. స్థానిక నాయకత్వం అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని అవకాశం ఇవ్వడం లేదని తెలుస్తోంది. మరి.. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఏం చేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..