తెరాసలో పెద్దల సభకు వెళ్ళేది ఎవరు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో అధికారపార్టీ టీఆర్ఎస్లో ఒక్కసారిగా వేడి పుట్టింది. దీనికి కారణం రాజ్యసభ ఉపఎన్నిక షెడ్యూల్ రావడమే. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాష్ను రాజీనామా చేయించి.. ఎమ్మెల్సీని చేశారు. దీంతో ఆ రాజ్యసభ స్థానానికి 2024 ఏప్రిల్ వరకు పదవీకాలం ఉండిపోయింది. ఆ భర్తీ ప్రక్రియలో భాగంగానే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. దాంతో టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థి ఎవరు అనే అంశం చుట్టూ చర్చ ఊపందుకుంటోంది.
రెండేళ్లే పదవీకాలం ఉన్నప్పటికీ చాలామంది టీఆర్ఎస్ నేతలు ఈ రాజ్యసభ సీటును ఆశిస్తున్నారు. ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్లో చేరిన వారితోపాటు.. పార్టీలో ముందు నుంచి ఉంటున్న నాయకులు.. పార్టీ అధినేత నుంచి హామీలు పొందినవాళ్లూ చాలామంది ప్రగతిభవన్ నుంచి వచ్చే పిలుపు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే గులాబీ శిబిరంలో రకరకాల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. బీసీ సామాజికవర్గానికి చెందిన బండ ప్రకాష్ రాజీనామా చేయడంతో.. ఆ సామాజికవర్గానికి చెందిన వారికే ఛాన్స్ ఇస్తారని కొందరి వాదన. కాదూ.. కొత్త సమీకరణాలు తెరపైకి వస్తాయనేది మరికొందరి అభిప్రాయం. అయితే మారే సమీకరణాలు ఎలా ఉంటాయన్నది ఉత్కంఠగా మారింది.
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
ప్రస్తుతం టీఆర్ఎస్ వర్గాల్లో చర్చల్లో ఉన్నవారిలో ఒక ఫార్మా కంపెనీ అధినేత పేరు నలుగుతోందట. అలాగే సీఎం కేసీఆర్కు మద్దతుగా ఉన్న ఒక సినీ నటుడి పేరు కూడా టాక్స్లో ఉంది. బీసీ, దళిత సామాజికవర్గాలకు చెందిన కీలక నాయకులు… తమకున్న ప్లస్సులు.. మైనస్సులతో లెక్కలేస్తున్నారు. పనిలో పనిగా పార్టీ పరిశీలనలో ఉన్న అంశాలపై ఆరా తీస్తున్నారట కొందరు నాయకులు. అయితే చివరి క్షణంలో తెరపైకి కొత్త పేర్లు రావొచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టింది. పలు ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నారు గులాబీ బాస్. ఇదే సమయంలో ఢిల్లీలో ఆయా పార్టీలతో మాట్లాడే నాయకుడికి ఈ ఉపఎన్నికలో ఛాన్స్ ఇవ్వొచ్చని అనుకుంటున్నారు. ఈ కోణంలోనూ కొందరు సీనియర్ టీఆర్ఎస్ నేతల పేర్లు చర్చల్లో ఉన్నాయి.
ఇప్పటికే పార్టీ అధినాయకత్వం అభ్యర్థి ఎంపికపై కొంత కసరత్తు పూర్తి చేసిందని.. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థి ప్రకటన ఉంటుందని సమాచారం. వచ్చే నెలలో తెలంగాణలో మరో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అక్కడ ఎంపిక చేసే అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుని.. ఉపఎన్నికలో క్యాండిడేట్ను ప్రకటిస్తారని తెలుస్తోంది. మరి.. గులాబీ శిబిరం నుంచి పెద్దల సభలకు వెళ్లే నాయకుడు ఎవరో వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Supreme Court: గొడవలు జరిగితే భర్త ఉద్యాగాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సుప్రీంకోర్టు ఆందోళన!
-
Arthritis Pain in Monsoon: వర్షాకాలంలో కీళ్ల నొప్పితో ఇబ్బందా..? నిపుణులు సూచించిన 5 చిట్కాలు మీ కోసం..
-
Balkampet Yellamma: నేడు “బల్కంపేట ఎల్లమ్మ తల్లి” వార్షిక కళ్యాణ మహోత్సవం..!
-
Team India: టీమిండియాలో కీలక మార్పులకు శ్రీకారం.. అప్పుడే ఒక వికెట్ డౌన్!
-
Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో సంచలనం.. డీజీపీ, సీపీ పేర్లు చేర్చాలంటూ..!
ట్రెండింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!