Raja Singh Suspension : తెలంగాణాలో బీజేపీలో కొత్త ఫ్లోర్ లీడర్ ఎవరు..?
Raja Singh Suspension : తెలంగాణ బీజేపీలో కొత్త ఫ్లోర్ లీడర్ ఎవరు? డబుల్ Rలో.. పార్టీ ఎవరికి జైకొడుతుంది..? సారథ్య బాధ్యతలు చేప్టటేదెవరు? కాషాయ పార్టీలో జరుగుతున్న చర్చేంటి?
వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీ నుంచి MLA రాజాసింగ్ సస్పెండ్ అయ్యారు. ఈ చర్యపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతోపాటు.. అన్ని బాధ్యతల నుంచి రాజాసింగ్ను తప్పించారు. దీంతో బీజేపీ శాసనసభాపక్ష నేతగానూ రాజాసింగ్ను పక్కన పెట్టినట్టు అయ్యింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో చెప్పాలని బీజేపీ క్రమశిక్షణ కమిటీ కోరడంతో.. ఆయనపై ఇప్పట్లో సస్పెన్షన్ ఎత్తే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఈలోగా అసెంబ్లీలో బీజేపీ శాసనసభా పక్ష నేతగా మరొకరిని నియమిస్తారని టాక్. బీజేపీకి శాసనసభలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో రాజాసింగ్ కాకుండా రఘునందనరావు, ఈటల రాజేందర్ ఎమ్మెల్యేలు. ఈ ఇద్దరిలో ఒకరిని సభాపక్ష నేతగా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఆ ఒక్కరు ఎవరన్నదే ఇప్పుడు ప్రశ్న.
Also Read
- Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
- Off The Record : తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు.. స్పాట్ లోనే అధికారులు సస్పెండ్..
- Off The Record : పార్టీతో పాటు శెట్టిబలిజ సామాజికవర్గంలో మంత్రి సుభాష్ ఒంటరి అయ్యారా?
- Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?
దుబ్బాక ఉపఎన్నికలో గెలిచిన తర్వాత తనను ఫ్లోర్ లీడర్ను చేయాలని రఘునందనరావు అడిగినట్టు ప్రచారం జరిగింది. దానిపై బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉండటం.. అప్పట్లో రాజాసింగ్ను మార్చే ఉద్దేశం లేకపోవడంతో ఆ ప్రక్రియ ముందుకు వెళ్లలేదు. ఇంతలో బీజేపీలో చేరి.. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచారు ఈటల రాజేందర్. ఆ తర్వాత కూడా బీజేపీ శాసనసభా పక్ష నేతను మారుస్తారనే ప్రచారం జోరుగా సాగింది. పార్టీ దానిని పట్టించుకోలేదు. ఇప్పుడు తప్పక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. గతంలోనే ఆ పదవి ఆశించిన రఘునందనరావుకు పట్టం కడతారా? లేక.. టీఆర్ఎస్లో ఉండగా ఆ పార్టీ సభాపక్ష నేతగా పనిచేసిన ఈటలకు అవకాశం ఇస్తారా అనేది పార్టీ వర్గాల అంచనాలకు అందడం లేదట.
ఇద్దరు నేతల అనుభవాన్ని బేరీజు వేస్తే.. ఈటల వైపే బీజేపీ పెద్దలు మొగ్గు చూపొచ్చన్నది కొందరి అభిప్రాయం. అసెంబ్లీలో బీజేపీకి మాట్లాడే అవకాశం వస్తుందా..? వస్తే ఎంత టైమ్ ఇస్తారు అనేది పక్కన పెడితే.. పార్టీలో ఫ్లోర్ లీడర్కు మాత్రం ప్రొటోకాల్ ఉంటుంది. రాష్ట్ర బీజేపీ ఆఫీసులో ప్రత్యేకంగా గది కేటాయిస్తారు. పార్టీ బ్యానర్, ఫ్లెక్సీల్లో ఆయన ఫొటో తప్పనిసరి. బీజేపీ కేంద్ర కమిటీ సమావేశాలకు పార్టీ అధ్యక్షుడితోపాటు పార్టీ ఫ్లోర్ లీడర్నూ ఆహ్వానిస్తారు. అందుకే సభాపక్ష నేత పదవికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ అంశంపై ఢిల్లీ పెద్దలు ఇప్పుడే నిర్ణయం తీసుకుంటారా లేక మునుగోడు ఉపఎన్నిక ఫలితం వరకు ఆగుతారా అనే చర్చ కూడా ఉంది. మరి.. బీజేపీ జాతీయ నాయకత్వం ఏం చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: దళపతి విజయ్ అంటే చాలా ఇష్టం.. కానీ ఓటు వేసే ఛాన్స్ లేదు!
-
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో మందుపాతర పేలుడు..ముగ్గురు జవాన్లు మృతి..
-
Bengal Election Results: దీదీ కోటలో కమలం వికసిస్తుందా? ఎగ్జిట్ పోల్స్లో హోరాహోరీ పోరు!
-
Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
-
Bengal Elections 2026: తృణమూల్ గుండాల అరాచకం.. రీపోలింగ్లో హింస..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!