పోరస్ కంపెనీ ప్రమాదంపై స్పందించాల్సిన కీలక వ్యక్తి ఎక్కడ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి గారూ…ఏమిటిది అని ప్రశ్నిస్తున్నారు..ఇంతకంటే పెద్దఘటనేం కావాలి.. స్పందించటానికైనా, పరామర్శించటానికైనా… అంటున్నారు..సంబంధం ఉన్నవారు లేని వారిలో కూడా కదలిక వచ్చింది కానీ, స్వయంగా ఆ శాఖ మంత్రి మాత్రం సైలెంట్ గా ఉన్నారనే విమర్శలు పెరుగుతున్నాయట.
పోరస్ కంపెనీ అగ్ని ప్రమాదం తో రాష్ట్రం మొత్తం ఉలిక్కి పడింది. నాటి ఎల్జీ పాలిమర్స్ సంఘటనను గుర్తుకు తెచ్చేలా అగ్ని ప్రమాదం జరగడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనిపై అధికార యంత్రాంగం.. ప్రభుత్వంలోని పెద్దలు వెంటనే స్పందించారు. చాలా మందిలో క్విక్ రియాక్షన్ కన్పించింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన స్పందించాల్సిన కీలక వ్యక్తిలో మాత్రం క్విక్ రియాక్షన్ సంగతి దేవుడెరుగు, కనీసం రియాక్షనే లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గుమ్మనూరు జయరాం. ఈ సంఘటన జరిగిన వెంటనే స్పందించాల్సిన పెద్ద మనిషి ఎవరన్నా ఉన్నారంటే గుమ్మనూరు జయరామే. జయరాం కార్మిక శాఖ మంత్రి. ప్రమాదం జరిగి ఆరుగురు కార్మికులు చనిపోతే కార్మిక శాఖ మంత్రి అయిన జయరాం.. గమ్మున ఉండిపోయారు. తనకి సంబంధించిన వ్యవహరం కాదులే అన్నట్టు ఉండిపోయారు.
Also Read
- Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
- Off The Record: ఖమ్మంలో కలకలం.. గాయత్రి రవి కంపెనీలపై వరుస దాడులు ఎందుకు?
- Off The Record: నల్గొండ కాంగ్రెస్లో ఓపెన్ వార్.. ఫ్లెక్సీల చించివేతతో రచ్చ రచ్చ!
- Off The Record: మళ్లీ యాక్టివ్ అయిన చెవిరెడ్డి.. జగన్ కొత్త వ్యూహమా?
ఇప్పుడు గుమ్మనూరు తీరు మీదే ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆరుగురు కార్మికులు చనిపోతే అసలు తనకేం పట్టనట్టు గుమ్మనూరు జయరాం ఎలా ఉన్నారో అర్థం కావడం లేదనే చర్చ జరుగుతోంది. పైగా క్షతగాత్రుల్లో చాలా మంది తీవ్రగాయాలతో డెత్ బెడ్ మీద ఉన్నారు. ఇంతటి ఘోర ప్రమాదం జరిగితే జయరాం అలా ఉండడం ఎంత వరకు కరెక్ట్ అంటున్నారు. మంత్రి వర్గ విస్తరణ పూర్తయి, తిరిగి కార్మిక శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్న జయరామ్కు తన పదవి మీద ఉన్నంత కాన్సన్ ట్రేషన్ తనకు శాఖకు సంబంధించిన వ్యవహరాలు మీద ఉండనక్కర్లేదా..? అనే చర్చ జరుగుతోందట. ఓ ఘటనపై స్పందించడానికి ఇంత కంటే పెద్ద ఇష్యూ ఏదైనా జరగాలా..? అంటూ చర్చించుకుంటున్నారట.
జగన్ మొదటి కెబినెట్లో మంత్రిగా కొనసాగిన గుమ్మనూరు జయరాం.. కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈఎస్ ఐ మందుల కొనుగోలు వ్యవహారంలో అవినీతి ఆరోపణలను మూట గట్టుకున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం మీద.. ఓ మంత్రి మీద తొలి అవినీతి ఆరోపణ వచ్చింది గుమ్మనూరు జయరామ్ మీదే. అప్పట్లోనే జగన్ టూ పాయింట్ వోలో జయరాం ఉంటారా లేదా అనే చర్చ జరిగింది. అయితే, సామాజిక సమీకరణాల్లో భాగంగా మంత్రి పదవి జయరామ్ని వదల్లేదు. విజయవంతంగా జగన్ రెండో కెబినెట్లో కూడా కొనసాగుతున్నారు. అయితే గతానుభవాల నుంచి గుమ్మనూరు జయరామ్ ఏమీ పాఠాలు నేర్చుకోలేదని పోరస్ ఘటన ద్వారా అర్థమవుతోందనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. ఇంతటి పెద్ద ఘటన జరిగితే హోం మంత్రిగా ఉన్న తానేటి వనిత ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. అలాగే మరో మంత్రి జోగి రమేష్ కూడా బాధితులను ఓదార్చారు. కానీ.. అసలు స్పందించాల్సిన మంత్రి గుమ్మనూరు మాత్రం గమ్మున ఉండిపోయారు. ఇదేం తీరు అని అందరూ చర్చించుకుంటున్నారట.
Watch Here : https://youtu.be/txkK7iaJ9E4
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!