ఆ జిల్లాలో జాతీయ పార్టీ నాయకులు ఎక్కడికి పోయారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంద్రప్రదేశ్లో పదేళ్లపాటు అధికారం చేపట్టిన పార్టీ కాంగ్రెస్. తెలంగాణ ప్రస్తుతం కాంగ్రెస్ది ప్రతిపక్ష పాత్ర. రాజకీయ భవిష్యత్ను వెతుక్కుంటూ అనేకమంది నాయకులు ఎన్నికల సమయంలోనూ.. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత హ్యాండిచ్చేశారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ బలం పుంజుకొనే పనిలో ఉంది. అయితే రాజధాని హైదరాబాద్కు ఆనుకుని ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీ పరిస్థితి విచిత్రంగా మారింది. జిల్లాల విభజన తరువాత కొత్త జిల్లాలకు నేతలు కరువైయ్యారు. అనేక ఆటుపోట్ల మధ్య డీసీసీ అధ్యక్షులను నియమించారు. నియోజకవర్గ ఇంఛార్జిల ఎంపికలో గందరగోళమే. కాంగ్రెస్ ఇటీవల పిలుపిచ్చిన పోరాటాలకు, నిరసనలకు ఉమ్మడి జిల్లా నుంచి పెద్దగా స్పందన లేదు.
అసెంబ్లీ ఎన్నికల వరకు రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోదగ్గ నాయకులు ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికల తరువాత సీన్ మారిపోయింది. ప్రతీ జిల్లాలో పట్టుమని పదిమంది పేరుమోసిన నాయకులు లేరు. ఒకప్పుడు రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులదే హవా. అధికారంతోపాటు ప్రతిపక్ష హోదా కోల్పోవడంతో.. చివరకు నాయకులూ వెళ్లిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సబితా ఇంద్రారెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డిలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి నుంచి రేవంత్ రెడ్డి ఎంపీ అయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. ఒక ఎంపీ తప్ప.
Also Read
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Off The Record: మీనాక్షి నటరాజన్ అవకాశానికి గండి కొట్టింది ఎవరు? రాష్ట్ర నేతలు ఎవరైనా లీకులు ఇచ్చారా?
- Off The Record: దువ్వాడకు వైసీపీలోకి నో రీ ఎంట్రీ?.. రీల్స్ రాజా పొలిటికల్ కెరీర్ ఖతం అయినట్టేనా..?
- OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారు కాంగ్రెస్లో యాక్టివ్గా లేరు. కొన్ని సెగ్మెంట్లకు ఇంఛార్జిలు లేకపోవడంతో ఒక్కో నేత రెండు మూడు నియోజకవర్గాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఇన్ఛార్జులతో రాబోయే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితి కాంగ్రెస్ది. తాండూరు, మహేశ్వరం, ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కేడర్ బలంగానే ఉంది. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, చేవెళ్లకు చెందిన నాయకులు గాయబ్. ఇక్కడ పరిస్థితిపై గాందీభవన్ వర్గాల్లోనే సెటైర్లు పేలుతున్నాయి. ఒకప్పుడు పదవుల కోసం ఢిల్లీ దాకా లాబీయింగ్ చేసిన నేతలు… ఇప్పుడు పదవిస్తామంటే ధైర్యంగా ముందుకు రావడం లేదట. మరి.. కాంగ్రెస్కు పూర్వ వైభవం తెచ్చేందుకు పార్టీ పెద్దలు ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
-
Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన ‘హిందూ గ్రోత్ రేట్’ అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
-
Ravi Mohan Reunion Rumors : గర్ల్ ఫ్రెండ్ తో రవి మోహన్ ప్యాచప్… అసలేం జరుగుతోంది ?
-
2027 ODI World Cup: ఇక అంతా వారి చేతుల్లోనే.. 2027 వన్డే ప్రపంచకప్లో రో-కో ఆడతారా?
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!