Congress : చింతన్ శిబిర్ తో ఒరిగిందేంటి ? నిర్ణయాలు గాలికొదిలేశారా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AICC ఉదయ్పూర్లో నిర్వహించిన జాతీయస్థాయి చింతన్ శిబిర్ తర్వాత.. తెలంగాణలోనూ కాంగ్రెస్ చింతన్ శిబిర్ సమావేశాలను ఘనంగా ముగించారు రాష్ట్ర పార్టీ నాయకులు. కాకపోతే ఈ చింతన్ శిబిర్తో పార్టీ ఏం చెప్పాలని అనుకుంది? ఏం చెప్పింది అనేది పార్టీ కేడర్కు కూడా అంతుచిక్కడం లేదట. ఆ సమావేశాల్లో కాంగ్రెస్ నాయకులంతా ఓపెన్ అయ్యారు. వాటిలో పార్టీ తీసుకున్న నిర్ణయాలేంటన్నదే స్పష్టత కరువైనట్టు కేడర్ చెవులు కొరుక్కుంటోంది. అమలు చేయాల్సిన నిర్ణయాలేంటో కూడా శ్రేణులకు అర్ధం కాలేదని సమాచారం. పైగా సమావేశాల్లో తీసుకున్న రాజకీయ తీర్మానాలను కూడా పూర్తిగా ప్రకటించలేదు.
AICC ఆదేశాల మేరకు మేధోమథన సదస్సు జరిగింది తప్పితే.. రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ రోల్ ఏంటి అనేది ఒక్కరూ స్పష్టత ఇవ్వలేదని గాంధీభవన్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. సామాజిక న్యాయం చేస్తాం.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యంపై గంభీరంగానే ఉపన్యాసాలు ఇచ్చారు. అయితే అంతర్గత ప్రజాస్వామ్యం.. లాబీయింగ్ ఎక్కువైన కాంగ్రెస్లో అవి సాధ్యమయ్యే పనేనా అని ప్రశ్నిస్తే.. దానికి సమాధానం లేదట. అంతెందుకు.. AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ సైతం సమావేశాలు పూర్తిస్థాయిలో ముగియకుండానే ఢిల్లీ ఫ్లయిట్ ఎక్కేశారు. చింతన్ శిబిర్లో తీసుకున్న నిర్ణయాలను ఎలా అమలు చేయాలో సమీక్షించాల్సిన ఆయనే లైట్ తీసుకున్నారని కాంగ్రెస్ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.
Also Read
కాంగ్రెస్ సమావేశాల్లో రాజకీయ తీర్మానాలే కీలకం. వాటిని పూర్తిగా బహిర్గతం చేయలేదు అని కమిటీ సభ్యులే చెబుతున్నారు. చింతన్ శిబిర్లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేందుకు పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్టు పార్టీ నేతలు చెప్పారు. చింతన్ శిబిర్ ముగిసి వారం అవుతున్నా.. ఇంత వరకు PAC ఊసే లేదు. జిల్లా స్థాయిలో సమావేశాలు ఉంటాయని చెప్పినా.. అవి ఎప్పుడో.. ఎక్కడ నిర్వహిస్తారో.. ఎవరు బాధ్యతలు తీసుకుంటారో చెప్పడం లేదు. వాస్తవానికి ఈ నెల 11 నుంచి 14లోపే జిల్లాలో సమావేశాలు పెట్టాలన్నది నిర్ణయం. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు కాంగ్రెస్ నాయకులు.
రాష్ట్రంలో ఘనంగా చింతన్ శిబిర్ నిర్వహించినా.. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి లేరు. మరి.. ఆయన గైర్హాజరీలో జరిగిన సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు అమలు చేస్తారో లేదో అనే చర్చ మొదలైంది. చింతన్ శిబిర్లో తీసుకున్న నిర్ణయాలపై పార్టీ వ్యూహకర్త సునీల్ టీమ్ ఆరా తీస్తున్నట్టు సమాచారం. అయినప్పటికీ ఎవరికీ చీమ కుట్టినట్టు అయినా లేదట. దీంతో సమావేశాలు పూర్తి కాగానే వాటిని అలా వదిలేశారని చెవులు కొరుకుడు ఎక్కువైంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : యువతే గేమ్చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్పై స్పందిస్తాము..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!