Congress : చింతన్ శిబిర్ తో ఒరిగిందేంటి ? నిర్ణయాలు గాలికొదిలేశారా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AICC ఉదయ్పూర్లో నిర్వహించిన జాతీయస్థాయి చింతన్ శిబిర్ తర్వాత.. తెలంగాణలోనూ కాంగ్రెస్ చింతన్ శిబిర్ సమావేశాలను ఘనంగా ముగించారు రాష్ట్ర పార్టీ నాయకులు. కాకపోతే ఈ చింతన్ శిబిర్తో పార్టీ ఏం చెప్పాలని అనుకుంది? ఏం చెప్పింది అనేది పార్టీ కేడర్కు కూడా అంతుచిక్కడం లేదట. ఆ సమావేశాల్లో కాంగ్రెస్ నాయకులంతా ఓపెన్ అయ్యారు. వాటిలో పార్టీ తీసుకున్న నిర్ణయాలేంటన్నదే స్పష్టత కరువైనట్టు కేడర్ చెవులు కొరుక్కుంటోంది. అమలు చేయాల్సిన నిర్ణయాలేంటో కూడా శ్రేణులకు అర్ధం కాలేదని సమాచారం. పైగా సమావేశాల్లో తీసుకున్న రాజకీయ తీర్మానాలను కూడా పూర్తిగా ప్రకటించలేదు.
AICC ఆదేశాల మేరకు మేధోమథన సదస్సు జరిగింది తప్పితే.. రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ రోల్ ఏంటి అనేది ఒక్కరూ స్పష్టత ఇవ్వలేదని గాంధీభవన్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. సామాజిక న్యాయం చేస్తాం.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యంపై గంభీరంగానే ఉపన్యాసాలు ఇచ్చారు. అయితే అంతర్గత ప్రజాస్వామ్యం.. లాబీయింగ్ ఎక్కువైన కాంగ్రెస్లో అవి సాధ్యమయ్యే పనేనా అని ప్రశ్నిస్తే.. దానికి సమాధానం లేదట. అంతెందుకు.. AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ సైతం సమావేశాలు పూర్తిస్థాయిలో ముగియకుండానే ఢిల్లీ ఫ్లయిట్ ఎక్కేశారు. చింతన్ శిబిర్లో తీసుకున్న నిర్ణయాలను ఎలా అమలు చేయాలో సమీక్షించాల్సిన ఆయనే లైట్ తీసుకున్నారని కాంగ్రెస్ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.
Also Read
- Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
- Off The Record : మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయంగా ఎందుకు యాక్టివ్ అవ్వలేదు ?
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
కాంగ్రెస్ సమావేశాల్లో రాజకీయ తీర్మానాలే కీలకం. వాటిని పూర్తిగా బహిర్గతం చేయలేదు అని కమిటీ సభ్యులే చెబుతున్నారు. చింతన్ శిబిర్లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేందుకు పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్టు పార్టీ నేతలు చెప్పారు. చింతన్ శిబిర్ ముగిసి వారం అవుతున్నా.. ఇంత వరకు PAC ఊసే లేదు. జిల్లా స్థాయిలో సమావేశాలు ఉంటాయని చెప్పినా.. అవి ఎప్పుడో.. ఎక్కడ నిర్వహిస్తారో.. ఎవరు బాధ్యతలు తీసుకుంటారో చెప్పడం లేదు. వాస్తవానికి ఈ నెల 11 నుంచి 14లోపే జిల్లాలో సమావేశాలు పెట్టాలన్నది నిర్ణయం. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు కాంగ్రెస్ నాయకులు.
రాష్ట్రంలో ఘనంగా చింతన్ శిబిర్ నిర్వహించినా.. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి లేరు. మరి.. ఆయన గైర్హాజరీలో జరిగిన సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు అమలు చేస్తారో లేదో అనే చర్చ మొదలైంది. చింతన్ శిబిర్లో తీసుకున్న నిర్ణయాలపై పార్టీ వ్యూహకర్త సునీల్ టీమ్ ఆరా తీస్తున్నట్టు సమాచారం. అయినప్పటికీ ఎవరికీ చీమ కుట్టినట్టు అయినా లేదట. దీంతో సమావేశాలు పూర్తి కాగానే వాటిని అలా వదిలేశారని చెవులు కొరుకుడు ఎక్కువైంది.
తాజావార్తలు
-
Snowfall: దేశమంతా ఎండలు భగభగలు.. లడఖ్లో మాత్రం భారీ హిమపాతం.. వీడియోలు వైరల్
-
SIR Phase-3 : దేశవ్యాప్తంగా ‘SIR ఫేజ్-3’ షెడ్యూల్ విడుదల, అక్టోబర్ 1న తుది జాబితా..!
-
AP: ఏపీ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన కమిటీ నియామకం..
-
Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!