జోగి రమేష్ దూకుడు వెనుక కారణం ఏంటి ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైలెట్ అవ్వాలంటే హడావిడి చేయాలన్నదే ఆ ఎమ్మెల్యే ఫిలాసఫీనా? అధినేత దృష్టిలో పడి పదవి పొందాలనుకుంటున్నారా? అందరి కంటే ముందుండాలని అనుకున్నారా? తాజా రచ్చ వెనక కారణం అదేనా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే?
జోగి రమేష్ దూకుడు వెనక కారణం వేరే ఉందా?
Also Read
- OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
- OTR : Thopudurthi Prakash Reddy ఉక్కిరి బిక్కిర అవుతున్నారా? దిక్కుతోచల స్థితిలో ఉన్నారా..?
- OTR : సడన్ గా ఆగిపోయిన గాంధీభవన్ ముఖాముఖి.. కాంగ్రెస్లో మంత్రులపై అధిష్టానం సీరియస్?
- OTR : రెంటికి చెడ్డ రేవడిలా యనమల కృష్ణుడు రాజకీయ జీవితం?
మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు చేసిన కామెంట్స్ ఏపీలో రాజకీయ దుమారం రేపాయి. సీఎంను పట్టుకుని అంత మాట అంటావా అని ఏకంగా చంద్రబాబు ఇంటి దగ్గర రభస చేశారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్. అక్కడ ఆయన రేపిన సెగ రాష్ట్రమంతా రాజుకుంది. ఇదే సమయంలో జోగి దూకుడు వెనక అసలు కారణం అదే అని పార్టీ వర్గాల్లో చర్చ మొదలైందట.
నిరసనపై పార్టీకి సమాచారం ఇవ్వకుండా గోప్యత పాటించారా?
ఎమ్మెల్యే జోగి రమేష్ హడావిడి చూశాకా.. ‘నాకు కొంచెం తిక్కుంది. దానికో లెక్కుంది’ అనే సినిమా డైలాగ్ను గుర్తు చేసుకుంటున్నారట కొందరు నేతలు. సీఎంపైన, హోంమంత్రి సుచరితపైనా అయ్యన్న చేసిన కామెంట్స్ను వైసీపీ శ్రేణులు ఖండించాయి. అంతా ఒక లైన్లో వెళ్తే.. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ మాత్రం మాటలకు పరిమితం కాకుండా ఫీల్డ్ ఎంట్రీ ఇచ్చారు. పార్టీకి, పార్టీలోని ఇతర నేతలకు సమాచారం ఇవ్వకుండా తన నిరసనపై గోప్యత పాటించారట. చివరకు చంద్రబాబు ఇంటికి జోగి చేరుకోవడం.. అక్కడ టీడీపీ నేతలు అడ్డుకోవడం.. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకోవడం.. పోలీసులకు పోటాపోటీ ఫిర్యాదులు.. ఒకరోజంతా మీడియాలో హడావిడి సాగింది. పార్టీ సర్కిళ్లలోనూ జోగి పేరు బాగా నానింది కూడా.
మోపిదేవి, పిల్లి బోస్లు రాజ్యసభకు వెళ్లినప్పుడూ హడావిడి!
ఈ హడావిడి వెనక జోగి రమేష్ మంత్రి పదవి రేస్లో ఉండటమే కారణమని సీరియస్ టాక్ నడుస్తోంది. ఆ మధ్య అసెంబ్లీ వేదికగా కూడా ఆయన అదుపుతప్పి మాట్లాడారు. వెంటనే అలర్ట్ అయిన సీఎం జగన్.. వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని జోగికి చిట్టీ రాసి పంపాల్సి వచ్చింది. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాస్ చంద్రబోస్లను రాజ్యసభకు పంపినప్పుడు కేబినెట్లో ఆ రెండుబెర్తులు ఖాళీ అయ్యాయి. ఇద్దరు బీసీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు వరించే అవకాశం ఏర్పడినప్పుడు సైతం జోగి విపరీతంగా లాబీ చేశారని టాక్. అప్పుడూ ఇలానే ప్రతి కార్యక్రమంలో ఆయన హడావిడి కనిపించేది.
కేబినెట్లో చోటు కోసం జోరు పెంచారా?
రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్ ప్రక్షాళన ఉంటుందని.. నాడు సీఎం జగన్ చెప్పారు. కొత్త వారికి అవకాశం ఇస్తానని తెలిపారు. తాజాగా జరిగిన మంత్రి మండలి సమావేశంలో రెండున్నర ఏళ్ల గడువును మూడేళ్లకు పెంచుతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. పైగా 80 శాతం మంత్రులను ఎన్నికల టీమ్గా ఉపయోగించుకోనున్నట్టు హింట్ ఇచ్చారు సీఎం. ఆ విషయం తెలుసుకున్న జోగి రమేష్.. జోరు పెంచినట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈసారి బీసీ కోటాలో మంత్రి పదవి ఖాయమని జోగివర్గం లెక్కలేసుకుంటోంది.
జోగి ట్రిక్కులను సీఎం జగన్ పరిగణనలోకి తీసుకుంటారా?
ఎమ్మెల్యే జోగి రమేష్ తాజా హడావిడి ఎలా ఉన్నా.. ఇటువంటి ట్రిక్కులను సీఎం జగన్ పరిగణనలోకి తీసుకుంటారా అన్నదే ప్రశ్న. ఆయనకు మంత్రి పదవి ఇస్తారా? అదే జరిగితే..అధినేత దృష్టిలో పడేందుకు మరికొందరు నాయకులు.. జోగి రమేష్లా రచ్చ చేస్తే అసలుకే ఎసరు రాదా? అనే మరికొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సమాధానం కోసం కేబినెట్ ప్రక్షాళన వరకు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Mental Health: 120కోట్ల మందిని పట్టి పీడిస్తోన్న శాపం.. ఇది క్యాన్సర్ కంటే డేంజర్ భయ్యా!
-
OG Satellite Rights: ఓజీ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న టాప్ ఛానల్!
-
Boman Irani: పెద్ది ట్రైలర్లోని ఆ సీన్ వెనుక ఎంత కథ ఉందో తెలుసా? ఆ ఒక్క డైలాగ్ కోసం 78 టేక్స్ తీసుకున్నాడట!
-
Lashkar-e-Taiba: ఇజ్రాయెల్తో సంబంధం పెట్టుకుంటే చంపేస్తాం.. షరీఫ్, మునీర్కు లష్కరే వార్నింగ్
-
Bhatti Vikramarka : కాంగ్రెస్ పాలనలోనే మహిళల అభ్యున్నతి
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!