Atchannaidu : అచ్చెన్నాయుడును కలవరపెడుతున్న విషయమేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atchannaidu : సిక్కోలు టీడీపీలో ఆయన చెప్పిందే వేదమన్నది నిన్నటి మాట. ఏదో తేడా కొడుతోందన్నది తాజా టాక్. ముప్పు పొంచి ఉందని అనుకున్నారో ఏమో.. దిద్దుబాటు చర్యలకు దిగారట. ఎన్నికలకు రెండేళ్ల ముందే కేడర్కు క్లాస్ తీసుకుంటున్నారట ఆ నాయకుడు. ఇంతకీ ఎవరా నేత? ఏమా అలజడి? లెట్స్ వాచ్..!
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో రాజకీయ వేడి రగులుతోంది. ఇక్కడ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే. టీడీపీకి బలమైన కేడర్ కూడా ఉంది. వైసీపీలో అంతర్గత విభేదాలు.. అధికారపార్టీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువ. నేతలకు అస్సలు పొసగదు. అలాంటిది ఈ మధ్య కాలంలో వైసీపీ నేతలు ఐక్యతారాగం టీడీపీ శిబిరాన్ని కలవర పెడుతోందట. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ ఉప్పు నిప్పులా నాయకుల మధ్య మంత్రి బొత్స సత్యనారాయణ సయోధ్య కుదిర్చినట్టు టాక్. బొత్స ఇంఛార్జ్గా వచ్చాక.. చాలా మార్పు కనిపిస్తోందట. ఆ మార్పే అచ్చెన్న అండ్ టీమ్ను ఉలిక్కి పడేలా చేస్తోందట. రిపేర్ వర్క్ స్టార్ట్ చేసినట్టు సమాచారం.
Also Read
కేడర్ నిస్తేజంగా ఉండటంతోపాటు.. తన కాళ్ల కిందకే నీళ్లు వస్తున్నాయని అచ్చెన్న కలవర పడుతున్నారట. ఏపీ టీడీపీ అధ్యక్షుడైన తర్వాత టెక్కలిలో పార్టీ వ్యవహారాలను ద్వితీయశ్రేణి లీడర్స్కు అప్పగించారట. ఆయన విజయవాడలోనే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో లీడర్ దూరమై.. కేడర్ కూడా కార్యక్రమాలను లైట్ తీసుకుంది. స్థానిక సమస్యలపై స్పందించేవారే కరువయ్యారు. పైగా అచ్చెన్నకు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం ఎక్కువైంది. దీంతో అందరినీ పిలిచి క్లాస్ తీసుకున్నారట అచ్చెన్న.
1983 నుంచి కింజరాపు ఫ్యామిలీదే టెక్కలిలో హవా. అప్పట్లో హరిశ్చంద్రపురం నియోజకవర్గంగా ఉన్నప్పటి నుంచీ ఎర్రన్నాయుడు మొదలుకొని.. ఇప్పుడు అచ్చెన్నాయుడు వరకు గెలుస్తూ వస్తున్నారు. ఒకటి రెండు సందర్భాలలో మినహా మిగతాసార్లు టీడీపీదే గెలుపు. అలాంటిచోట పార్టీ కార్యక్రమాల నిర్వహణకు తెలుగు తమ్ముళ్లు వెనకడుగు వేయడం.. అచ్చెన్న బృందానికి మింగుడు పడటం లేదట. టెక్కలి టౌన్ సహా మండలంలోనూ నాయకత్వం లోపం ఉందని గుర్తించారట. నియోజకవర్గంలో టీడీపీ నేతలు నాలుగు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం మొదలుపెట్టారు. అటు వైసీపీ ఐక్యత రాగం..ఇటు టీడీపీలో విభేదాలు ఏపీ టీడీపీ చీఫ్కు నిద్ర లేకుండా చేస్తున్నాయట.
సమస్యను ఆలస్యంగా గ్రహించిన అచ్చెన్నాయుడు.. దిద్దుబాటు చర్యలైతే ప్రారంభించారు. మండలాల వారీగా పార్టీ నేతలను పిలిచి మాట్లాడుతున్నారు. చెప్పాల్సిన వారికి సుతిమెత్తంగా చెబుతున్నారు.. మందలించాల్సిన వాళ్లకు అదే టోన్లో హెచ్చరికలు పంపుతున్నారట. ఇన్నాళ్లుగా ఒక టీమ్లా పనిచేసిన టీడీపీ నేతలకు ఏమైంది అన్నది పెద్ద ప్రశ్న. అందుకే అచ్చెన్న ప్రయత్నాలు వర్కవుట్ అవుతాయా? లేక వైసీపీ నేతల ఐక్యత పైచెయ్యి సాధిస్తుందా అన్నది చర్చ. మరి.. రానున్న రోజుల్లో టెక్కలి రాజకీయం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!