TRS : సేఫ్ గేమ్ ఆడే నాయకులు ఆ జిల్లాలో యాక్టివ్ అయ్యారా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్లోని కొందరు నేతలకు సీటు భయం పట్టుకుంది. పార్టీ ఫిరాయించేందుకు ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారు నాయకులు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిన నేతలు ప్రస్తుతం టీఆర్ఎస్లోనే ఉండిపోయారు. అలాంటి వారంతా భవిష్యత్పై బెంగ పెట్టుకుని పక్క పార్టీలో బిస్తర్ వేసుకుంటున్నారు.
గతంలో అశ్వారావుపేట నుంచి పోటీ చేసిన ఓడిన తాటి వెంకటేశ్వరరావు టీఆర్ఎస్కు గుడ్బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. ఇదే బాటలో మరికొందరు ఉన్నట్టు సమాచారం. పినపాకలో ఓడిన టీఆర్ఎస్ నేత పాయం వెంకటేశ్వరరావు పరిస్థితి ఏంటన్నది ప్రశ్న. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉన్నా.. అక్కడ రేగా కాంతారావు పాగా వేసేశారు. పాయానికి టీఆర్ఎస్ టికెట్ ఇస్తుందో లేదో తెలియదు. ఆయన అనుచరులు ఇదే గందరగోళంలో ఉన్నారట. పైగా పాయం మాజీ ఎంపీ పొంగులేటికి ముఖ్య అనుచరుల్లో ఒకరు. దీంతో పాయం టీఆర్ఎస్లోనే ఉంటారా.. లేక సీటు కన్ఫామ్ చేసే పార్టీలోకి జంప్ చేస్తారా అనేది పినపాకలో పెద్ద చర్చగా ఉంది.
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
ఇల్లెందులో ఓడిన టీఆర్ఎస్ నేత కోరం కనయ్యది కూడా ఇలాంటి సంకటి స్థితే. కాకపోతే ఎన్నికల్లో ఓడిన కనకయ్యను పార్టీ జడ్పీ ఛైర్మన్ను చేసింది. అయినప్పటికీ కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్కు కనకయ్యకు ఇల్లెందులో అస్సలు పడటం లేదు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కనకయ్య చూస్తున్నారు. గతంలో ఆయన కాంగ్రెస్లో ఉన్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే జంప్ చేస్తారా లేదా అనేది స్పష్టత లేదు. ఈ మధ్య మాజీ ఎంపీ పొంగులేటితో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారు కోరం.
గతంలో సత్తుపల్లి నుంచి పోటీ చేసి ఓడి.. ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్న మట్టా దయానంద్ సైతం పోటీకి తహతహలాడుతున్నారు. వచ్చే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని సెంటిమెంట్ పండిస్తున్నారు కూడా. టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్లో చేరొచ్చని సత్తుపల్లిలో ప్రచారం జోరందుకుంది. వైరాలో ఎమ్మెల్యే రాములు నాయక్ను కాదని మాజీ ఎమ్మెల్యే మదన్లాల్కు టీఆర్ఎస్ టికెట్ ఇస్తుందా? మదన్లాల్ మాత్రం పోటీ చేయాల్సిందే అని అనుచరులకు చెబుతున్నారట. దాంతో ఈ మాజీ ఎమ్మెల్యే ఏం చేస్తారనేది కేడర్కు అంతుచిక్కడం లేదు. ఇలా జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న నాయకులు సేఫ్ ప్లేస్ కోసం జంప్ జిలానీలుగా మారే పనిలో ఉన్నారట. మరి.. తాటి తర్వాత క్యూ కట్టే నాయకులు ఎవరో కాలమే చెప్పాలి.
తాజావార్తలు
-
Anil Ravipudi: దళపతి విజయ్ నుంచి అనిల్ రావిపూడికి స్పెషల్ కాల్.. ఆ సినిమానే కారణం!
-
ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ విడుదల.. టాప్లోకి దూసుకొచ్చిన రోహిత్ శర్మ..
-
IMD Alert: బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో వాయుగుండాలు.. దేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం
-
Uttar Pradesh: నా భార్య, ఆమె ప్రియుడు నన్ను చంపేస్తారు.. ప్రేమ పెళ్లి, ఇప్పుడు ప్రాణభయం..
-
Meher Ramesh: మొన్ననే కూతురి పెళ్లి.. ఇప్పుడు తీవ్ర విషాదంలో డైరెక్టర్ మెహర్ రమేష్ ఫ్యామిలీ!
ట్రెండింగ్
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!