Warangal Police: ఆ జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగిపోయిందా..? పోలీసులు తలపట్టుకున్నారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal Police: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టుగా ఉందట ఆ జిల్లాలో పోలీసుల పరిస్థితి. పొలిటికల్ హీట్ పెరిగి.. మద్దెలదరువు ఎక్కువైందట. ఎవరు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో.. ఏ వైపు నుంచి విమర్శలు వస్తాయో అర్థం కావడం లేదట. అధికార విపక్షాలకు ఏకకాలంలో టార్గెట్ కావడంతో తల పట్టుకుంటున్నారట ఖాకీ బాస్లు.
కరవమంటే కప్పకు.. విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా తమ డ్యూటీలు మారిపోయాయని వరంగల్ జిల్లా పోలీసులు వాపోతున్నారు. టీఆర్ఎస్, బీజేపీ నేతల రాజకీయ వైరంలో తాము లక్ష్యంగా మారుతున్నట్టు ఆవేదన చెందుతున్నారట. రెండు పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకోవడం.. ఆపై పోలీసులపై విరుచుకుపడటం సాధారణమైపోయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా రగిలిన అగ్గి ఏకంగా ఐపీఎస్ అధికారి లక్ష్యంగా మాటల తూటాలు పేలాయి. వరంగల్ పోలీస్ కమిషనర్పై తీవ్ర వ్యాఖ్యలే చేశారు సంజయ్.
Also Read
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
- Off The Record : BRSలో సభ్యత్వాల నమోదు విషయంలో కేసీఆర్ సూచనలు పై అనుమానాలు?
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
పాదయాత్ర దేవరుప్పల చేరుకున్న సమయంలో జరిగిన దాడి.. పాలకుర్తిలో ముందుస్తుగా దుకాణాలు మూయించి వేయడంపై బండి ఫైర్ అయ్యారు. ఇందులో పోలీసుల పాత్ర ఉందని అనుమానించిన ఆయన ఖాకీలపై పదునైన విమర్శలు చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎంతోకాలం అధికారంలో ఉండబోదని.. బీజేపీ అధికారంలోకి వచ్చాక మీ అంతు చూస్తామన్నట్టుగా సంజయ్ నిప్పులు చెరగడం చర్చగా మారింది.
దేవరుప్పల ఘటనలో పోలీసుల లాఠీచార్జిపై టీఆర్ఎస్ నేతలూ భగ్గుమన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నేరుగా పోలీసుల తీరును తప్పుపట్టారు. టీఆర్ఎస్ శ్రేణులపై బీజేపీ నేతలు దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల స్వరం కూడా ఇంతే స్థాయిలో ఉండటంతో కంగుతిన్నారు ఖాకీలు. ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తున్నా.. పార్టీల వైరంలో తాము సమిధలుగా మారుతున్నామని కొందరు అధికారులు వాపోతున్నారట. అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు గతంలో వినిపించేవని.. ఇప్పుడు మాత్రం నేరుగా పేరు.. హోదాలను ప్రస్తావిస్తూ వార్నింగ్ ఇస్తున్నారని అభిప్రాయ పడుతున్నారట.
ఖిలా షాపూర్లో బండి సంజయ్ మాట్లాడుతున్న సమయంలో టీఆర్ఎస్ కార్యకర్త ఒకరు నిలదీసే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు అప్రమత్తం అయ్యి.. పరిస్థితిని నియంత్రణలోకి తెచ్చారు. ఇంతోలోనే బీజేపీ నేత ఒకరు టీఆర్ఎస్ కార్యకర్తపై చెయ్యి చేసుకున్నారట. ఆ సమస్య పెద్దది కాకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. అయినప్పటికీ రెండు పార్టీలు తమనే టార్గెట్ చేయడం చర్చగా మారింది. వరంగల్ పోలీసులను తప్పు పడుతూ.. వారి పేర్లు నమోదు చేసుకుని పోలీస్ ఉన్నతాధికారులకు కొందరు ఫిర్యాదు చేస్తున్నారట. దాంతో కింది స్థాయి సిబ్బందికి చీవాట్లు పడుతున్నాయట. రానున్న రోజుల్లోనూ ఇలాగే ఉంటే.. సమస్యను ఎలా అధిగమించాలా అని ఆలోచనలు చేస్తున్నారట పోలీసు అధికారులు.
తాజావార్తలు
-
Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
-
Virat Kohli: కెప్టెన్గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
-
CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
-
Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!