గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎంపికలో మళ్లీ ట్విస్ట్…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎంపికలో మళ్లీ ట్విస్ట్ నెలకొందా? రోజులు గడుస్తున్నా ఈ అంశంపై ఉలుకు లేదు.. పలుకు లేదు. కౌశిక్రెడ్డి ఎపిసోడ్ ఉత్కంఠ రేకెత్తించడంతో.. ఇప్పుడేం జరుగుతుందా అని టీఆర్ఎస్ వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.
మధుసూదనాచారి ఎమ్మెల్సీ ఫైల్పై కబురు లేదా?
Also Read
- OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
- Off The Record: రొటీన్కు భిన్నంగా ఆ మౌనవ్రతం ఎందుకు?.. కోలగట్ల వైఖరిపై వైసీపీలో చర్చ
గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ నియామకం తెలంగాణలో మళ్లీ చర్చగా మారుతోందా? గతంలో కేబినెట్ ఆమోదించి పంపిన కౌశిక్రెడ్డి ఫైల్ను అనుమానాల నివృత్తికోసం గవర్నర్ పెండింగ్లో పెట్టారు. సోషల్ సర్వీస్ కింద కౌశిక్రెడ్డి పేరును నాడు నామినేట్ చేసింది ప్రభుత్వం. అయితే మరికొంత స్టడీ చేయాల్సి ఉందని చెబుతూ ఆ ఫైల్ను పక్కన పెట్టారు గవర్నర్. ఇంతలో ఎమ్మెల్యే కోటాలో కౌశిక్రెడ్డి ఎమ్మెల్సీ అయ్యారు. దాంతో పాత ప్రతిపాదనను విత్డ్రా చేసుకున్న సర్కార్.. గవర్నర్ కోటాలో కొత్తగా మాజీ స్పీకర్ మధుసూదనాచారి పేరును కేబినెట్లో ఆమోదించి రాజ్భవన్కు పంపించింది. ఆ ఫైల్ వెళ్లింది కానీ.. అక్కడిని కబురు లేదని చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు.
గవర్నర్ దగ్గరే ఫైల్ పెండింగ్?
మధుసూదనాచారి పేరును నామినేట్ చేసి వారం అవుతున్నా ఇంకా అధికారికంగా గెజిట్ విడుదల కాలేదు. దాంతో మళ్లీ ఏమైంది అనే చర్చ జరుగుతోంది. కౌశిక్రెడ్డి ఫైల్ తరహాలోనే మాజీ స్పీకర్ ఫైల్పైనా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫైల్ గవర్నర్ దగ్గరే పెండింగ్లో ఉందా? ఎక్కడ ఆగిపోయింది? అని పార్టీ వర్గాలు ఆరా తీస్తున్నాయట.
ఎన్నికల కోడ్ కారణంగా గెజిట్ విడుదల కాలేదా?
కోడ్ ముగిశాక గెజిట్ విడుదలవుతుందా?
రాజ్భవన్ వర్గాల సమాచారం ప్రకారం.. మధుసూదనాచారి ఫైల్ను గవర్నర్ క్లియర్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం తెలిపారని టాక్. అయితే గెజిట్ విడుదల కాకపోవడంతో ప్రశ్నలు.. అనుమానాలు తెరపైకి వస్తున్నాయట. గెజిట్ విడుదల కాకపోవడానికి తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడే కారణమన్నది రాజ్భవన్ వర్గాల వాదన. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రాష్ట్రంలో అమలులో ఉంది. అందుకే ఎన్నికల కమిషన్ వివరణ కోసం ఫైల్ను పంపించారని తెలుస్తోంది. ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే గెజిట్ విడుదలవుతుందని టాక్. ఒకవేళ ఎన్నికల కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేస్తే.. ఎన్నికల కోడ్ ముగిశాక గెజిట్ విడుదల అవుతుందని చెబుతున్నారు. ఈ విషయం తెలియక.. కౌశిక్రెడ్డి ఎపిసోడ్ను తలచుకుని కలవర పడుతున్నాయి పార్టీ వర్గాలు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!