TRS : టీఆర్ఎస్ లో వాళ్లకు పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచన లేదా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోషామహల్. హైదరాబాద్లోని కీలక నియోజకవర్గాల్లో రాజకీయ వేడి ఎక్కువగా ఉన్న సెగ్మెంట్. గత ఎన్నికల్లో బిజెపి నుంచి రాజాసింగ్ గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ గెలిచిన ఒకే ఒక్క సీటు ఇదే. అక్కడ ఓడిన టీఆర్ఎస్లో మాత్రం ఇప్పటికీ సీన్ మారలేదట. ఆ ఎన్నికల్లో నాయకులు ఏవిధంగా అయితే తన్నుకున్నారో.. ఇప్పుడూ అదే పరిస్థితి ఉందట. నేతలు ఎక్కువైపోయారు. కేడర్ను పట్టించుకోవడం లేదు. పైగా ఎవరికి వారు వచ్చే ఎన్నికల్లో టికెట్ తెచ్చుకోవాలని చూస్తున్నారే తప్ప పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనలో లేరట.
బిజెపి మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ రాష్ట్ర విభజన తర్వాత టీఆర్ఎస్లో చేరారు. వయసు మీదపడటంతో సైలెంట్ అయ్యారని కేడర్ అనుకుంటున్నా.. ఆయన మాత్రం నేనున్నాను అని అప్పుడప్పుడూ బయటకొచ్చి హడావిడి చేస్తున్నారు. గోషామహల్లో టీఆర్ఎస్ను బలోపేతం చేస్తారనే ఉద్దేశంతో రాథోడ్ను రాష్ట్రస్థాయి కార్పొరేషన్ ఛైర్మన్గా నియమించింది టీఆర్ఎస్. కానీ.. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి పెద్దగా మారలేదన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట.
Also Read
గోషామహల్లో మరో టీఆర్ఎస్ నేత నంద బిలాల్ హాడివిడి చేస్తుంటారు. మొన్నటి GHMC ఎన్నికల్లో కుమార్తెకు కార్పొరేటర్ సీటు ఇప్పించుకున్నారు. బేగంబజారు నుంచి పోటీ చేయించి డిపాజిట్ కోల్పోయేరు. ఆ ఎన్నికల్లో నందబిలాల్ సత్తా చూసిన తర్వాత ఆయన పై పార్టీ ఆశలు వదులు కుందనే చర్చ జరుగుతోంది. పైగా ప్రేమ్సింగ్ రాథోడ్, నందబిలాల్ మధ్య వర్గపోరు నడుస్తుందనే వాదన ఉంది. ఆ కారణంగానే పార్టీ శ్రేణులు కూడా చీలిపోయి.. చెరో శిబిరంలో చేరిపోయాయట. నియోజకవర్గంలో పార్టీ బలహీన పడటానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు నేతలు.
గోషామహల్లో తాజాగా ఆశిష్ కుమార్ యాదవ్ అనే మరో నేత సందడి మొదలైంది. రాథోడ్, బిలాల్కు పోటీగా పర్యటనలు చేస్తున్నారట ఆశిష్. ఈ యువనేతకు కూడా రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉంది. గతంలో ఆశిష్ కుటుంబం నుంచి ఒకరు ఆఫ్జల్గంజ్ కార్పొరేటర్గా ఉన్నారు. పైగా స్థానికత కూడా కలిసి వస్తుందని లెక్కలేస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో తనకే టీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరుతున్నారట. గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆశిష్ యాక్టివ్గా ఉండేవారు. అది కూడా టీఆర్ఎస్లో అక్కరకు వస్తుందని అనుకుంటున్నారట. ఇలా ఎవరికి వారు టికెట్ రేస్లో ఉండటంతో పార్టీ ఎవరికి పట్టం కడుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.
ఇక్కడో గమ్మత్తు ఉంది రాథోడ్, బిలాల్ ఇద్దరికీ బీజేపీ మూలాలు ఉన్నాయి. గోషామహల్లో బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయని టీఆర్ఎస్ పెద్దలు అనుమానిస్తున్నారట. అందుకే క్షేత్రస్థాయి అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారట. మరి.. టీఆర్ఎస్ పెద్దలు గోషామహల్పై పట్టుకోసం ఎలాంటి వ్యూహం రచిస్తారో.. ఎవరికి పట్టం కడతారో చూడాలి.
- Tags
- bjp
- Goshamahal
- raja singh
- telangana
- TRS
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!