Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record That Is How The Alliance With The Janasena Tdp Leaders Worried

TDP :జనసేనతో పొత్తు కుదిరితే ఎలా అని ఆ.. టీడీపీ నేతల ఆందోళన!

Published Date :June 20, 2022 , 11:02 am
By Premchand Chowdary
TDP :జనసేనతో పొత్తు కుదిరితే ఎలా అని ఆ.. టీడీపీ నేతల ఆందోళన!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. పొత్తులు ఎత్తులు.. జిత్తులపై రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన రెండు కలిసి పోటీ చేస్తాయని అనుకుంటున్నారు. ఆ మధ్య కుప్పం పర్యటనలో చంద్రబాబు… జనసేనకు వన్‌సైడ్‌ లవ్‌ అని కన్నుగీటారు. ఆ తర్వాత జనసేన ఆవిర్భావ సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. ఈ మాటలు.. ప్రకటనలతో రెండు పార్టీలు దగ్గరవుతున్నట్టు భావించారు. కానీ.. ఇటీవల నిర్వహించిన మహానాడు తర్వాత టీడీపీ శిబిరం నుంచి వస్తున్న స్వరం మారిపోయింది. ఎలాంటి పొత్తులు అక్కర్లేకుండా ఒంటరిగా వెళ్దామనే చర్చ పసుపు శిబిరంలో జరుగుతోంది. అయితే ఆ అంశంపై చంద్రబాబు ఎక్కడా మాట్లాడటం లేదు. అలా అని జనసేనను వదులుకునే స్థితిలో లేరని టాక్‌. ఈ అంశం తెలిసినప్పటి నుంచి టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారట. ఆ ఆందోళన చుట్టూనే జిల్లాల్లో చర్చ ఆసక్తిగా మారుతోంది.

టీడీపీ, జనసేన పొత్తు కుదిరితే సీట్ల సర్దుబాటు తప్పదు. జనసేనకు కొన్ని సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కాపు సామాజికవర్గం ఓట్లను బేస్‌ చేసుకుని జనసేనను దువ్వే పనిలో ఉంది టీడీపీ. జనసేన కావాలి. కాపుల్ని వదులుకోలేం. అలాగని జనసేన ఎక్కువ సీట్లు డిమాండ్‌ చేస్తే ఏమిటి పరిస్థితి అనే ప్రశ్నలు ఉన్నాయి. అయితే జనసేన అడిగిన అన్ని సీట్లు టీడీపీ ఇస్తుందా అనేది మరో ప్రశ్న. ఏతావాతా చర్చలు కొలిక్కి వచ్చాక కొన్ని సీట్లు అయితే జనసేనకు ఇవ్వాల్సిందే. అక్కడ టీడీపీ నేతలు సీట్లను వదులుకుని మిత్రపక్షానికి మద్దతు తెలిపాల్సిందే. అయితే జనసేన అడిగే సీట్లు ఏంటన్నదే ప్రస్తుతం టీడీపీ నేతలను కలవర పెడుతోందట. ముఖ్యంగా ఉభయ గోదావర జిల్లాల్లోని టీడీపీ నేతలు పొత్తు అంశం ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారీ ఉలిక్కి పడుతున్నట్టు తెలుస్తోంది.

Also Read

  • Off The Record: రచ్చ రచ్చ అవుతున్న గజ్వేల్ కాంగ్రెస్ గొడవ
  • Off The Record: విభేదాలకు చెక్ పెట్టబోతున్న పవన్ కల్యాణ్‌..!
  • Off The Record: ఆ జిల్లా కలెక్టర్ ని చూసి ఎమ్మెల్యేలు భయపడుతున్నారా..?
  • Off The Record: కలిసిరాని నియోజకవర్గాన్ని టీడీపీ పూర్తిగా సైడ్ చేసేసినట్టేనా?
Add as a preferred
source on google

ఉమ్మడి తూర్పుగోదారి జిల్లాలో ప్రస్తుతం 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత లెక్కలను చూస్తే 2009లో పీఆర్పీ నాలుగు సీట్లు గెలుచుకుంది. కాపు సామాజికవర్గం ప్రభావం ఎక్కువ. ప్రస్తుతం ఉన్న 19 నియోజకవర్గాల్లో 9 చోట్ల మాత్రం టీడీపీ శిబిరంలో గట్టిగా చర్చ జరుగుతోంది. కాకినాడ రూరల్‌, కాకినాడ సిటీ, తుని, కొత్తపేట, పిఠాపురం, రాజమండ్రి రూరల్‌, ముమ్మిడివర్గం, రాజోలు, జగ్గంపేట సీట్ల చుట్టూ ఆ చర్చ హీటెక్కుతోంది. 2019 ఎన్నికల్లో రాజోలులో జనసేన గెలిచింది. ప్రస్తుతం చర్చ జరుగుతున్న సీట్లలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ గట్టిగా పోరాడి టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు అవ్వాలని చూస్తున్నారు కొందరు నాయకులు. జనసేనతో పొత్తు ఓకే అయితే ఈ నియోజకవర్గాల్లో టీడీపీ నేతల పరిస్థితి ఏంటన్నది పెద్ద ప్రశ్న. మూడేళ్లుగా పడిన కష్టం గంగలో కలిసిపోతుందని ఆవేదన చెందుతున్నారట.

పొత్తులో భాగంగా ఉభయగోదారి జిల్లాల నుంచే ఎక్కువ సీట్లు అడగాలని జనసేన చూస్తోందట. గెలుపోటములను కాపులు ప్రభావితం చేసే నియోజకవర్గాలనే అడిగే అవకాశం ఉండటంతో చర్చ హీటెక్కుతోంది. జనసేన, టీడీపీ కలిస్తే.. కాపుల ఓట్లు పడటంతోపాటు.. టీడీపీ ఓటు బ్యాంక్‌ కూడా కలిసి వస్తుందని జనసైనికులు భావిస్తున్నారు. అయితే సీటు వదులుకోవాలేమోనని ఆందోళన చెందుతున్న టీడీపీ నేతలకు ఎక్కడా ఊరట దక్కడం లేదట. తరచూ అనుచరులతో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. పిఠాపురంలో టీడీపీని వర్మ, కొత్తపేటలో బండారు సత్యానందం, జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ.. తునిలో యనమల తదితరులు లీడ్‌ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న ఆందోళనను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లే పనిలో ఉన్నారట అక్కడి నాయకులు. అంతా ఒక టీమ్‌గా ఏర్పడుతున్నట్టు సమాచారం. మొత్తానికి పొత్తు కుదరకముందే ప్రకంపనలు వస్తున్నాయి. ఒకవేళ పొత్తు ఖరారైతే.. ఈ సమస్యను రెండు పార్టీల అగ్రనేతలు ఎలా డీల్‌ చేస్తారో చూడాలి.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Chandra babu
  • janasena
  • pawan kalyan
  • tdp

తాజావార్తలు

  • Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు

  • US: ‘‘ఇది ఇండియా కాదు’’.. టెక్సాస్ గవర్నర్ అభ్యర్థిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు

  • Kalki Part 2: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘కల్కి 2’ రిలీజ్ డేట్ అప్పుడేనా? నాగ్ అశ్విన్ ప్లాన్ మామూలుగా లేదుగా!

  • Mamata Banerjee: “మాజీ సీఎం కాదు”.. మమతా ఎక్స్ బయోలో పొలిటికల్ మెసేజ్..

  • NADA Notice: క్రికెట్ ప్రపంచంలో డోపింగ్ కలకలం.. ఆ ఇద్దరు స్టార్లకు నోటీసులు!

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions