టీడీపీ ఇంచార్జ్ పై మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మంత్రి కుమారుడు ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి తప్పలేదు. ఓడాక.. పార్టీని, కేడర్ను ఆయన పట్టించుకోవడం లేదట. పైగా అధికారపక్షానికి దగ్గరవుతున్నారని గుర్రుగా ఉన్నారట తెలుగు తమ్ముళ్లు. ఇంకేముందీ.. ఆయన్ని పక్కన పెట్టేయాలని గట్టిగానే డిమాండ్ చేస్తున్నారట. ఆ రగడేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఓటమి తర్వాత హరికృష్ణ కనిపించలేదని కేడర్ ఆరోపణ!
Also Read
- OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
- OTR : అమరావతిపై మంత్రి నారాయణ స్పీడ్ తగ్గిందా? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది?
- Off The Record : ఆకునూరి మురళి రాజీనామా వెనుక అసలు కథ ఏంటి? విద్యా కమిషన్లో ఏం జరిగింది?
- OTR : Congress లిస్ట్లో ఆ రెండు జిల్లాలదే సస్పెన్స్.. రంగారెడ్డి, సంగారెడ్డి డీసీసీ రేసు..!
చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు. ఈ నియోజకవర్గంలో టీడీపీకి బలమైన కేడర్ ఉంది. నాయకత్వ లేమి కారణంగా ఇక్కడ పార్టీకి ఓటమి తప్పడం లేదు. గతంలో వేపంజరిలో వరసగా నాలుగుసార్లు గెలిచారు మాజీ మంత్రి కుతూహులమ్మ. 2009లో వేపంజరి రద్దయి జీడీ నెల్లూరు కొత్త నియోజకవర్గం వచ్చింది. జీడీ నెల్లూరు నుంచి కుతూహులమ్మ ఒకసారి గెలిచారు.
2014లో కాంగ్రెస్ను వీడి టీడీపీలో చేరినప్పటికీ ఆమెకు ఓటమి తప్పలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి కుతూహలమ్మను కాదని 2019లో ఆమె కుమారుడు హరికృష్ణకు ఏరికోరి టికెట్ ఇచ్చారు చంద్రబాబు. కానీ.. ఆ ప్రయోగం ఫలించలేదు. వైసీపీ నుంచి నారాయణస్వామి గెలిచి ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యారు. ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత జీడీ నెల్లూరులో హరికృష్ణ కనిపించలేదన్నది టీడీపీ శ్రేణుల ఆరోపణ.
డాక్టర్ అనితా రాణి విషయంలో స్పందన లేదా?
జీడీ నెల్లూరు టీడీపీ ఇంఛార్జ్గా హరికృష్ణే ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు ఆయన హాజరు కావడం లేదట. దీంతో హరికృష్ణ టీడీపీలో ఉన్నారో లేరో తెలియదంటున్నారు తమ్ముళ్లు. నియోజకవర్గంలో డాక్టర్ అనితా రాణి వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఇలాంటి ఘటనలు జరిగినా ఆయన మాత్రం ఎక్కడా కనిపించలేదట. అనితా రాణి వివాదంలో నారా లోకేష్ ట్విట్టర్లో స్పందించారు. చంద్రబాబు మాట్లాడారు. హరికృష్ణ ఏమయ్యారో ఏమో తెలియదన్నది కేడర్ చెప్పేమాట.
హరికృష్ణపై టీడీపీ దళిత నాయకులు ఫైర్!
పంచాయతీ ఎన్నికల్లో నడిపించే నాయకుడు లేక పార్టీ పరిస్థితి మరింత దిగజారిందనే మాటలు కేడర్ నుండి వినపిస్తున్నాయి. వరసగా జరుగుతున్న ఘటనలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇకలాభం లేదని తమ్ముళ్లు తమకు నాయకుడు కావాలంటూ.. మీడియా ముందు వచ్చి తమ గోడు వెళ్లగక్కారు. పార్టీ పెద్దలు.. జిల్లా నాయకత్వానికి చెప్పినా ప్రయోజనం లేకపోవడంతోనే బయటకు వచ్చినట్టు సమాచారం. ఎస్ఆర్ పురం మండలంలోని టీడీపీ ఆఫీస్లోనే నియోజకవర్గ దళిత నాయకులు హరికృష్ణపై ఫైర్ అయ్యారు.
వైసీపీ నేతలతో కుమ్మక్కు అయ్యారని ఆరోపణ!
టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా ఇంఛార్జ్ హరికృష్ణ మాట్లాడటం లేదన్నది శ్రేణుల ప్రధాన ఆరోపణ. అందుకే టీడీపీ ఇంచార్జ్గా ఆయన వద్దని చెబుతున్నారట. తమను పట్టించుకోకపోగా అధికారపార్టీకి హరికృష్ణ దగ్గరయ్యారని తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. ఇంఛార్జ్ వ్యక్తిగత పనుల కోసం.. వైసీపీ నేతలతో కుమ్మక్కు అయ్యారనే టాక్ ఓ రేంజ్లో వినిపిస్తోంది. అందుకే తమ్ముళ్లు ఈ విధంగా రియాక్ట్ అయ్యారని సమాచారం. పార్టీ కేడర్కు కొందరు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. జీడీ నెల్లూరు తెలుగు తమ్ముళ్లు శాంతించడం లేదట. మరి.. రానున్న రోజుల్లో పార్టీ శ్రేణులు ఇంకేవిధంగా ఓపెన్ అవుతాయో చూడాలి.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?