ఇంద్రవెల్లి సభ తర్వాత ఆ పార్టీ ఆలోచన మారిందా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంద్రవెల్లి సభ తర్వాత కాంగ్రెస్ ఆలోచన మారిందా? పార్టీతో కలిసి ప్రయాణం చేయకపోతే.. కాంగ్రెస్లో ఉన్నా లేకపోయినా ఒకటే అన్న సంకేతాలు పంపుతోందా? మారిన వైఖరిపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న చర్చ ఏంటి?
ఇంద్రవెల్లి సభకు రాని నేతలపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చర్చ!
Also Read
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
- Off The Record : BRSలో సభ్యత్వాల నమోదు విషయంలో కేసీఆర్ సూచనలు పై అనుమానాలు?
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట. సీనియర్ నాయకులకు కేరాఫ్ అడ్రస్. అలాంటిది పదేళ్ల కాలంలో ఎన్నో పరిణామాలు జరిగాయి. ముఖ్యులు అనుకున్నవారు తమకు భవిష్యత్ బాగుంటుంది అనుకున్న చోటుకు వెళ్లిపోయారు. మిగిలిన కొద్దిమంది కీలక నేతల మధ్య సఖ్యత లేదు. ఇంద్రవెల్లి సభకు ముందు కాంగ్రెస్లో ఆ ఎపిసోడే హీటెక్కించింది. సభ తర్వాత కార్యక్రమానికి రానివారిపై ఫోకస్ మళ్లింది.
సభకు ముందు కొందరు నేతలతో మాట్లాడిన పీసీసీ చీఫ్!
ఇటీవల కాలంలో కాంగ్రెస్ రాష్ట్రంలో చేపట్టిన పెద్ద కార్యక్రమం ఇంద్రవెల్లి సభ. కొందరు సీనియర్లు డుమ్మా కొట్టినా.. తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి కేడర్తోపాటు లీడర్స్ తరలివెళ్లారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నాయకులు తప్పకుండా సభకు వస్తారని లెక్కలు వేసుకున్నారట. ఆ మధ్య జిల్లా పర్యటనకు వచ్చిన పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సైతం.. సైలెంట్గా ఉన్న కాంగ్రెస్ నేతలతో టచ్లోకి వెళ్లారట. ఇదే మంచి అవకాశం.. బద్దకం వీడి రోడ్డెక్కితేనే భవిష్యత్ ఉంటుందని చెప్పారట. గతంలోఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారు.. మాజీ ఎమ్మెల్యేలు.. సీనియర్ నాయకులతో రేవంత్ మాట్లాడినట్టు చెబుతున్నారు. ఇంత హోంవర్క్ చేసినా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఇంద్రవెల్లి సభకు రాలేదట. వారిపైనే ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతోంది.
ఇంద్రవెల్లి సభకు రాని యూత్ నేత!
ఒకప్పుడు NSUI రాష్ట్ర అధ్యక్షుడిగా.. యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన భార్గవ్ దేశ్పాండే ఇంద్రవెల్లి సభలో కనిపించలేదు. ఆయన 2014 ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. 2018లో పార్టీ టికెట్ రాలేదు. కానీ.. ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో తన వర్గంవారిని కొన్నిచోట్ల గెలిపించుకున్నారు. దేశ్పాండేతో రేవంత్ మాట్లాడినట్టు చెబుతున్నారు. అయితే టీఆర్ఎస్ నాయకులతోనూ దేశ్పాండేకు సన్నిహిత సంబంధాలున్నాయట. ఆ కారణంగానే ఇంద్రవెల్లి సభకు వెళ్లలేదని అనుకుంటున్నారు.
నేతలతో సఖ్యత లేక కొందరు రాలేదా?
దేశ్పాండే తరహా నాయకులు జిల్లాలో చాలామంది ఉన్నట్టు అనుమానిస్తున్నారు. కాంగ్రెస్లో కొనసాగుతూనే వేరేపార్టీలో కర్చీఫ్లు వేశారట. మరికొందరు ఉన్న నేతలతో పడక దూరంగా ఉంటున్నారట. రానున్న రోజుల్లో ఇలాంటి వారిపట్ల కాంగ్రెస్ అనుసరించే వైఖరిపై ఉత్కంఠ నెలకొంది.
తాజావార్తలు
-
LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
-
Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!