ఇంద్రవెల్లి సభ తర్వాత ఆ పార్టీ ఆలోచన మారిందా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంద్రవెల్లి సభ తర్వాత కాంగ్రెస్ ఆలోచన మారిందా? పార్టీతో కలిసి ప్రయాణం చేయకపోతే.. కాంగ్రెస్లో ఉన్నా లేకపోయినా ఒకటే అన్న సంకేతాలు పంపుతోందా? మారిన వైఖరిపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న చర్చ ఏంటి?
ఇంద్రవెల్లి సభకు రాని నేతలపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చర్చ!
Also Read
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట. సీనియర్ నాయకులకు కేరాఫ్ అడ్రస్. అలాంటిది పదేళ్ల కాలంలో ఎన్నో పరిణామాలు జరిగాయి. ముఖ్యులు అనుకున్నవారు తమకు భవిష్యత్ బాగుంటుంది అనుకున్న చోటుకు వెళ్లిపోయారు. మిగిలిన కొద్దిమంది కీలక నేతల మధ్య సఖ్యత లేదు. ఇంద్రవెల్లి సభకు ముందు కాంగ్రెస్లో ఆ ఎపిసోడే హీటెక్కించింది. సభ తర్వాత కార్యక్రమానికి రానివారిపై ఫోకస్ మళ్లింది.
సభకు ముందు కొందరు నేతలతో మాట్లాడిన పీసీసీ చీఫ్!
ఇటీవల కాలంలో కాంగ్రెస్ రాష్ట్రంలో చేపట్టిన పెద్ద కార్యక్రమం ఇంద్రవెల్లి సభ. కొందరు సీనియర్లు డుమ్మా కొట్టినా.. తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి కేడర్తోపాటు లీడర్స్ తరలివెళ్లారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నాయకులు తప్పకుండా సభకు వస్తారని లెక్కలు వేసుకున్నారట. ఆ మధ్య జిల్లా పర్యటనకు వచ్చిన పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సైతం.. సైలెంట్గా ఉన్న కాంగ్రెస్ నేతలతో టచ్లోకి వెళ్లారట. ఇదే మంచి అవకాశం.. బద్దకం వీడి రోడ్డెక్కితేనే భవిష్యత్ ఉంటుందని చెప్పారట. గతంలోఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారు.. మాజీ ఎమ్మెల్యేలు.. సీనియర్ నాయకులతో రేవంత్ మాట్లాడినట్టు చెబుతున్నారు. ఇంత హోంవర్క్ చేసినా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఇంద్రవెల్లి సభకు రాలేదట. వారిపైనే ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతోంది.
ఇంద్రవెల్లి సభకు రాని యూత్ నేత!
ఒకప్పుడు NSUI రాష్ట్ర అధ్యక్షుడిగా.. యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన భార్గవ్ దేశ్పాండే ఇంద్రవెల్లి సభలో కనిపించలేదు. ఆయన 2014 ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. 2018లో పార్టీ టికెట్ రాలేదు. కానీ.. ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో తన వర్గంవారిని కొన్నిచోట్ల గెలిపించుకున్నారు. దేశ్పాండేతో రేవంత్ మాట్లాడినట్టు చెబుతున్నారు. అయితే టీఆర్ఎస్ నాయకులతోనూ దేశ్పాండేకు సన్నిహిత సంబంధాలున్నాయట. ఆ కారణంగానే ఇంద్రవెల్లి సభకు వెళ్లలేదని అనుకుంటున్నారు.
నేతలతో సఖ్యత లేక కొందరు రాలేదా?
దేశ్పాండే తరహా నాయకులు జిల్లాలో చాలామంది ఉన్నట్టు అనుమానిస్తున్నారు. కాంగ్రెస్లో కొనసాగుతూనే వేరేపార్టీలో కర్చీఫ్లు వేశారట. మరికొందరు ఉన్న నేతలతో పడక దూరంగా ఉంటున్నారట. రానున్న రోజుల్లో ఇలాంటి వారిపట్ల కాంగ్రెస్ అనుసరించే వైఖరిపై ఉత్కంఠ నెలకొంది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!