కీలక మీటింగ్స్లో టీ కాఫీలకే పరిమితం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టిఫినీలు తిన్నారు.. కాఫీలు తాగారు. కీలక సమావేశంలో ల్యాప్టాపుల్లో మునిగిపోయారు. ఒకరు 14 అంటే.. ఇంకొకరు 34కి తగ్గేది లేదన్నారు. ఆ మీటింగ్స్లో ఇదే జరుగుతోందా? కాలక్షేపం కబుర్లు.. వ్యూహాత్మక ఎత్తుగడలతో సమావేశాలను మమ అనిపించేస్తున్నారా?
పీఆర్సీపై ఎడతెగని చర్చలు..!
Also Read
ఏపీలో లక్షలాది మంది ఉద్యోగులకు కీలకమైన పీఆర్సీ కసరత్తు కొలిక్కి రాలేదు. ఫిట్మెంట్పై తేలుస్తారా తేల్చరా అని ఉద్యోగ సంఘాలు గట్టిగా అడగడంతో… ఆ మధ్య జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించారు అధికారులు. 13 సంఘాలకు ఆహ్వానాలు వెళ్లడంతో వారంతా సూచించిన టైమ్కు చెప్పిన లొకేషన్ బ్లాక్ నెంబర్ 2 దగ్గరకు వచ్చేశారు. సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలో ఆర్ధికశాఖ కార్యదర్శులతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉంది. ఉద్యోగ సంఘ నాయకులు కమిటి హాల్లోకి వెళ్లి కూర్చున్నారు. ఐదు కావటానికి పావుగంట ముందే సీఎస్ సచివాలయం నుంచి తాడేపల్లిలోని సీఎమ్ క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోవడంతో అంతా కంగుతిన్నారు.
టిఫిన్లు.. టీ కాఫీలతోనే సమయం గడిచిపోయిందా?
సీఎస్ లేకపోయినా ముగ్గురు ఆర్ధికశాఖ కార్యదర్శులు మీటింగ్ హాలులో ఉండటంతో ఉద్యోగ సంఘాల నేతలు సర్ది చెప్పుకొన్నారట. ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఉంది. హెచ్ఆర్ ఫైనాన్స్ కార్యదర్శి శశిభూషణ్ సమావేశానికి వచ్చిన నేతల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే.. మిగిలిన ఇద్దరు కార్యదర్శులు రావత్, సత్యనారాయణలు తమతో తెచ్చుకున్న ల్యాప్ టాపుల్లో మునిగిపోయి.. తమ సమయం వృథా కాకుండా చూసుకున్నారట. దీంతో సీఎస్ వచ్చేంత వరకు మాటలు కలుపుతా.. అసలు విషయం పెద్దాయనతోనే మాట్లాడుకోవాలని చెప్పారట శశిభూషణ్. సీఎస్ రావటం లేటవుతుందేమో.. షుగర్ పేషెంట్స్కు ఇబ్బంది లేకుండా మరోదఫా స్నాక్స్ తెప్పిస్తాను.. అని సెటైర్లు వేశారట. టిఫిన్లు తిని, చల్లటి ఏసీ రూమ్లో వేడి వేడిగా టీ కాఫీలు తాగి.. నాయకులంతా పాత రీల్ మళ్లీ రీప్లే చేయడంతో అక్కడున్నవాళ్లకు సౌండ్ లేదట.
లెక్కలు మళ్లీ వెరిఫై చేస్తామన్న సీఎస్
ఉస్సూరుమంటూ బయటకొచ్చిన ఉద్యోగులు
రాత్రి 8 గంటలకు సీఎస్ సమీర్ శర్మ సచివాలయానికి వచ్చారు. అప్పటికే వెయింటింగ్లో ఉన్న JAC నేతలు అలిసిపోయి ఉంటారని భావించారో ఏమో.. 14 శాతం ఫిట్మెంట్తో సరిపెట్టేద్దాం అని సీఎస్ చెబితే.. ఉద్యోగ సంఘాల నాయకులు 34కి తగ్గేది లేదని సమాధానం ఇచ్చారు. 14 శాతం ఫిట్మెంట్ నివేదిక తప్పుల తడకగా కొట్టిపారేశారు JAC నేతలు. ఇలా పావు గంట గడిచాక.. అధికారులు చాణక్యం ప్రదర్శించారు. మా లెక్కలు తప్పంటున్నారు కదా.. మళ్లీ లెక్కలు వెరిఫై చేస్తాం అని బదులివ్వడంతో… మీటింగ్లో ఏదో తేలిపోతుందని అనుకున్న ఉద్యోగులకు ఆ సమాధానం మింగుడుపడలేదు. ఇదంతా కాదు సీఎం దగ్గరే తేల్చుకుంటా అని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పడంతో.. చిరునవ్వులు చిందించారట అధికారులు. అయితే ఓకే.. ఇప్పుడు సీఎం ఉండరు. మళ్లీ వచ్చే వారమే అని మీటింగ్కు క్లోజ్ చేశారట. ఎంతో ఉత్సాహంతో మీటింగ్కు వెళ్లిన ఉద్యోగ సంఘాల నేతల ఉస్సూరు మంటూ బయటకొచ్చారు. ఏమైంది అని మీడియా ప్రశ్నిస్తే.. ఏముందీ ఈ మీటింగ్ కూడా మమ అనిపించారని నిట్టూర్పులిడిచారు. అదండీ.. పీఆర్సీపై మీటింగ్లో టీ కాఫీలకు, టిఫిన్లకు ఇస్తున్న ప్రాధాన్యం.. సమస్య పరిష్కారనికి ఇవ్వడం లేదని సచివాలయ వర్గాల్లో ఒక్కటే సణుగుడు.
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!