కీలక మీటింగ్స్లో టీ కాఫీలకే పరిమితం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టిఫినీలు తిన్నారు.. కాఫీలు తాగారు. కీలక సమావేశంలో ల్యాప్టాపుల్లో మునిగిపోయారు. ఒకరు 14 అంటే.. ఇంకొకరు 34కి తగ్గేది లేదన్నారు. ఆ మీటింగ్స్లో ఇదే జరుగుతోందా? కాలక్షేపం కబుర్లు.. వ్యూహాత్మక ఎత్తుగడలతో సమావేశాలను మమ అనిపించేస్తున్నారా?
పీఆర్సీపై ఎడతెగని చర్చలు..!
Also Read
ఏపీలో లక్షలాది మంది ఉద్యోగులకు కీలకమైన పీఆర్సీ కసరత్తు కొలిక్కి రాలేదు. ఫిట్మెంట్పై తేలుస్తారా తేల్చరా అని ఉద్యోగ సంఘాలు గట్టిగా అడగడంతో… ఆ మధ్య జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించారు అధికారులు. 13 సంఘాలకు ఆహ్వానాలు వెళ్లడంతో వారంతా సూచించిన టైమ్కు చెప్పిన లొకేషన్ బ్లాక్ నెంబర్ 2 దగ్గరకు వచ్చేశారు. సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలో ఆర్ధికశాఖ కార్యదర్శులతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉంది. ఉద్యోగ సంఘ నాయకులు కమిటి హాల్లోకి వెళ్లి కూర్చున్నారు. ఐదు కావటానికి పావుగంట ముందే సీఎస్ సచివాలయం నుంచి తాడేపల్లిలోని సీఎమ్ క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోవడంతో అంతా కంగుతిన్నారు.
టిఫిన్లు.. టీ కాఫీలతోనే సమయం గడిచిపోయిందా?
సీఎస్ లేకపోయినా ముగ్గురు ఆర్ధికశాఖ కార్యదర్శులు మీటింగ్ హాలులో ఉండటంతో ఉద్యోగ సంఘాల నేతలు సర్ది చెప్పుకొన్నారట. ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఉంది. హెచ్ఆర్ ఫైనాన్స్ కార్యదర్శి శశిభూషణ్ సమావేశానికి వచ్చిన నేతల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే.. మిగిలిన ఇద్దరు కార్యదర్శులు రావత్, సత్యనారాయణలు తమతో తెచ్చుకున్న ల్యాప్ టాపుల్లో మునిగిపోయి.. తమ సమయం వృథా కాకుండా చూసుకున్నారట. దీంతో సీఎస్ వచ్చేంత వరకు మాటలు కలుపుతా.. అసలు విషయం పెద్దాయనతోనే మాట్లాడుకోవాలని చెప్పారట శశిభూషణ్. సీఎస్ రావటం లేటవుతుందేమో.. షుగర్ పేషెంట్స్కు ఇబ్బంది లేకుండా మరోదఫా స్నాక్స్ తెప్పిస్తాను.. అని సెటైర్లు వేశారట. టిఫిన్లు తిని, చల్లటి ఏసీ రూమ్లో వేడి వేడిగా టీ కాఫీలు తాగి.. నాయకులంతా పాత రీల్ మళ్లీ రీప్లే చేయడంతో అక్కడున్నవాళ్లకు సౌండ్ లేదట.
లెక్కలు మళ్లీ వెరిఫై చేస్తామన్న సీఎస్
ఉస్సూరుమంటూ బయటకొచ్చిన ఉద్యోగులు
రాత్రి 8 గంటలకు సీఎస్ సమీర్ శర్మ సచివాలయానికి వచ్చారు. అప్పటికే వెయింటింగ్లో ఉన్న JAC నేతలు అలిసిపోయి ఉంటారని భావించారో ఏమో.. 14 శాతం ఫిట్మెంట్తో సరిపెట్టేద్దాం అని సీఎస్ చెబితే.. ఉద్యోగ సంఘాల నాయకులు 34కి తగ్గేది లేదని సమాధానం ఇచ్చారు. 14 శాతం ఫిట్మెంట్ నివేదిక తప్పుల తడకగా కొట్టిపారేశారు JAC నేతలు. ఇలా పావు గంట గడిచాక.. అధికారులు చాణక్యం ప్రదర్శించారు. మా లెక్కలు తప్పంటున్నారు కదా.. మళ్లీ లెక్కలు వెరిఫై చేస్తాం అని బదులివ్వడంతో… మీటింగ్లో ఏదో తేలిపోతుందని అనుకున్న ఉద్యోగులకు ఆ సమాధానం మింగుడుపడలేదు. ఇదంతా కాదు సీఎం దగ్గరే తేల్చుకుంటా అని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పడంతో.. చిరునవ్వులు చిందించారట అధికారులు. అయితే ఓకే.. ఇప్పుడు సీఎం ఉండరు. మళ్లీ వచ్చే వారమే అని మీటింగ్కు క్లోజ్ చేశారట. ఎంతో ఉత్సాహంతో మీటింగ్కు వెళ్లిన ఉద్యోగ సంఘాల నేతల ఉస్సూరు మంటూ బయటకొచ్చారు. ఏమైంది అని మీడియా ప్రశ్నిస్తే.. ఏముందీ ఈ మీటింగ్ కూడా మమ అనిపించారని నిట్టూర్పులిడిచారు. అదండీ.. పీఆర్సీపై మీటింగ్లో టీ కాఫీలకు, టిఫిన్లకు ఇస్తున్న ప్రాధాన్యం.. సమస్య పరిష్కారనికి ఇవ్వడం లేదని సచివాలయ వర్గాల్లో ఒక్కటే సణుగుడు.
తాజావార్తలు
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Sanae Takaichi: ఢిల్లీ చేరుకున్న జపాన్ ప్రధాని సనే తకైచి.. 3 రోజులు పర్యటన
-
Trump: ఇరాన్తో చర్చలు బాగున్నాయి.. ఖతార్ భేటీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Ramayan Leak: రణబీర్ కపూర్ ‘రామాయణం’ లీక్? ఆ 11 సెకన్ల క్లిప్ చూసి తలబాదుకుంటున్న ఫ్యాన్స్!
ట్రెండింగ్
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!