బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుపై టీఆర్ఎస్లో చర్చ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల కాలంలో ఆ అధికార పార్టీ ఎమ్మెల్యేకు అన్నీ తలనొప్పులే. కనీసం కంటి నిండా నిద్ర కూడా పడటం లేదట. లేఖలు పరేషాన్ చేస్తున్నాయట. ఇక నిరసనలు, ధర్నాలు సరేసరి. అవి ఎవరు చేశారో.. ఎవరు చేయిస్తున్నారో తెలుసుకోవచ్చు. కానీ.. సీఎమ్కు లేఖలు రాస్తుండటంతో ఉలిక్కి పడుతున్నారట ఎమ్మెల్యే. ఆయనెవరో.. ఆ సమస్యేంటో ఈ స్టోరీలో చూద్దాం..!
సమస్యలపై నేరుగా సీఎమ్కే నిరసనకారుల లేఖలు?
Also Read
- Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
- Off The Record : మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయంగా ఎందుకు యాక్టివ్ అవ్వలేదు ?
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
రాథోడ్ బాపురావ్. ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే. ఇంతకాలం నియోజకవర్గంలో హ్యాపీగా సాగిపోయినా.. ఇటీవల ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా చేపడతున్న నిరసనలు చర్చగా మారుతున్నాయి. ఏదైనా సమస్య పరిష్కారం కావాలంటే ధర్నాలు సహజం. చివరకు అధికారులకో.. ఎమ్మెల్యే దగ్గరకో వెళ్లి వినతి పత్రాలు ఇస్తుంటారు. బోథ్లో మాత్రం.. వీరెవరి వల్లా కాదని అనుకున్నారో లేక ఎమ్మెల్యేను ఇరుకున పెట్టాలని అనుకుంటున్నారో కానీ.. నేరుగా తమ సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖలు రాస్తున్నారట. ఈ లేఖాస్త్రాల సంగతి తెలిసినప్పటి నుంచి ఎమ్మెల్యేకు గుబులు పట్టుకున్నట్టు టాక్.
ఎమ్మెల్యేపై దళిత సంఘాలు గుర్రు!
ఆ మధ్య తలమడుగులో ఎస్సీ కమ్యూనిటీ హాల్ కోసం ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. ఆ గొడవ ఏకంగా లాఠీఛార్జ్ వరకు వెళ్లింది. ఎమ్మెల్యేను అడ్డుకుంటే పోలీసులతో కొట్టిస్తారా అని ప్రశ్నిస్తూ.. ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి దళిత సంఘాలు. పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేశారు. జొన్నల కొనుగోళ్లు సరిగ్గా చేపట్టడం లేదని ఎమ్మెల్యేపై మండిపడుతూ రైతులు జలదీక్ష చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాజులతండా వాసుల కష్టాలు ప్రముఖంగా నిలుస్తుండటంతో ఎమ్మెల్యేతోపాటు అధికార పార్టీ నేతలను ఇబ్బంది పెడుతోందట.
వరస నిరసనల వెనక ఉన్నది ఎవరు?
బేల మండలంలో ఓ భూ వివాదంలో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పెద్ద రగడే జరిగింది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా దీక్షకు దిగిన ఆదివాసీలకు నచ్చజెప్పడానికి ITDA పీవో, పోలీసుల తలప్రాణం తోకకు వచ్చినంత పనైందట. ఇక బోథ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఎమ్మెల్యే అనుచరులు, బంధువులపై ఆరోపణలు వస్తున్నాయి. ఇలా ఒకదాని వెనక ఒకటిగా రాథోడ్ బాపురావ్ లక్ష్యంగా విమర్శలు, ఆరోపణలు వస్తుండటంతో ఎమ్మెల్యే శిబిరం ఆలోచనలో పడిందట. ఇదంతా ప్రజలు, నిరసనకారులే చేస్తున్నారా లేక వారి వెనక ఎవరైనా ఉన్నారా అని ఆరా తీస్తున్నట్టు సమాచారం.
ప్రయోజనం పొందాలని చూస్తున్నది ఎవరు?
బోథ్ టీఆర్ఎస్లో రాథోడ్ బాపురావ్ వ్యతిరేక వర్గంపై ఎమ్మెల్యే అనుచరులు ఓ కన్నేసినట్టు టాక్. ఇన్నాళ్లూ కామ్గా ఉన్నవారు.. ఇప్పుడెందుకు జూలు విదిలిస్తున్నారు? వారి లక్ష్యం ఏంటి? ఎమ్మెల్యేను ఇబ్బంది పెట్టడం ద్వారా ఎవరికి ప్రయోజనం చేకూర్చాలని చూస్తున్నారు అనే అంశాలపై జవాబులు వెతికే పనిలో పడింది రాథోడ్ బాపురావ్ వర్గం. మరి.. ఈ ఆకస్మిక కష్టాలు.. ఉక్కిరి బిక్కిరి అంశాల నుంచి ఎమ్మెల్యే ఎలా బయట పడతారో చూడాలి.
తాజావార్తలు
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
-
YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
-
OPPO Find X9s: ఒప్పో ఫైండ్ X9s వచ్చేసింది.. 50MP కెమెరా, 7025mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Workers Salary Hike: తెలంగాణ కార్మికులకు భారీ శుభవార్త.. కనీస వేతనాల పెంపుపై కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!