మళ్లీ వేడెక్కిన మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ రాజకీయాలు!
ఇటీవల ఫామ్లోకి వచ్చిన ఆ మంత్రికి సొంతపార్టీ నేతలే చుక్కలు చూపిస్తున్నారా? జిల్లాస్థాయి కీలక పదవిలో ఉన్న నేత రాజీనామాకు సిద్ధపడ్డారా? ప్రతిపక్ష పార్టీల విషయంలో చేయాల్సిన రాజకీయాలు సొంతపార్టీలో చేసి అధిష్ఠానాన్ని ఇరుకున పెడుతున్నారా?
కమిటీల కూర్పుతో మరోసారి భగ్గుమన్న విభేదాలు!
Also Read
టీఆర్ఎస్ సంస్థాగత కమిటీల కూర్పు.. ప్రకటనలు కొన్నిచోట్ల ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏకంగా నేతల రాజీనామాల వరకు వివాదాలు వెళ్తున్నాయి. దీనికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఘట్కేసర్ మండల కమిటీ ఒక ఉదాహరణ. కమిటీ కూర్పు.. మంత్రి మల్లారెడ్డి, జడ్పీ ఛైర్మర్ శరత్చంద్రారెడ్డి మధ్య చిచ్చుపెట్టింది. చాలా రోజులుగా కొనసాగుతున్న విభేదాలు ఈ విధంగా భగ్గుమన్నాయి.
మంత్రి మల్లారెడ్డి తీరుపై జడ్పీ ఛైర్మన్ గుర్రు!
మండల కమిటీ ఏర్పాటుపై శరత్చంద్రారెడ్డి మనస్తాపం చెందారట. పార్టీ పెద్దల ఆదేశాలతో కొంతమంది టీఆర్ఎస్ నాయకులు జడ్పీ చైర్మన్ వద్దకు మంత్రి తరఫున వెళ్లి మంతనాలు జరిపారట. ఆ తర్వాత శరత్ చంద్రారెడ్డి చల్లబడినట్టు సమాచారం. మంత్రి మల్లారెడ్డి ఒంటెద్దు పోకడలు పోతున్నారని జడ్పీ ఛైర్మన్ వర్గం గుర్రుగా ఉంది. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. ప్రస్తుతం గ్రామ, మండల స్థాయిలో టీఆర్ఎస్ కమిటీలు వేస్తున్నారు. నియోజకవర్గానికి చెందిన నాయకులకు తెలియకుండా, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా మంత్రి కమిటీల నియామకం చేపడుతున్నట్టు సొంత పార్టీ నేతల ఆరోపణ. అదే అసంతృప్తి రూపంలో భగ్గుమంటోంది.
మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డిని మంత్రి పక్కన పెట్టేశారా?
అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి సహకారం తీసుకుంటానని చెప్పిన మల్లారెడ్డి.. ఇప్పుడు ఆయన్ని పూర్తిగా పక్కన పెట్టేశారట. మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి తనయుడే శరత్ చంద్రారెడ్డి. పార్టీ కమిటీ ఏర్పాటులో తమ సొంత మండలంలో తమకు తెలియకుండా టీఆర్ఎస్ కమిటీ వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పైగా సుధీర్రెడ్డి వ్యతిరేకులను మంత్రి చేరదీస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పైగా ఘట్కేసర్ మండలంలో జడ్పీచైర్మన్ వర్గానికి పార్టీ, ప్రభుత్వ పరంగా సహకరించడం లేదట. ఇప్పుడు టీఆర్ఎస్ కమిటీల కూర్పులోనూ జడ్పీ ఛైర్మన్ అనుచరులకు చోటు కల్పించకపోవడంతో విభేదాలకు మరింతగా ఆజ్యం పోసినట్టు అయింది.
రాజీనామాకు సిద్ధపడ్డ శరత్ చంద్రారెడ్డి?
టీఆర్ఎస్ కమిటీలతో విభేదాలు ముదురుపాకాన పడటంతో త్వరలోనే అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారట జడ్పీ ఛైర్మన్. మంత్రి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని చెబుతూ పదవికి రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నారట. ఈ విషయం తెలుసుకున్న పార్టీ పెద్దలు తమకు రెండు రోజులు సమయం ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కోరినట్టు సమాచారం. దాంతో ఆయన డైలమాలో పడ్డారట. ప్రస్తుతం మేడ్చల్ టీఆర్ఎస్లో ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. మరి.. ఈ ఎపిసోడ్కు ఎలాంటి ఎండ్ కార్డ్ పడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Tamilnadu Elections Exit Poll 2026: తమిళనాడులో స్టాలిన్ హవా.. చతికిలపడిన అన్నాడీఎంకే, టీవీకే..
-
Peddi: ‘టాక్సిక్’ అవుట్.. లైన్లోకి రామ్ చరణ్ ‘పెద్ది’!
-
Kerala Election Exit poll 2026: కేరళలో హస్తం హవా.. పినరయికి గుడ్ బై..
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Anand Deverakonda: ఈ కథ చెప్పినప్పుడు.. నా కథ నాకే చెప్పాడా అనిపించింది!
ట్రెండింగ్
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!