వినుకొండ టీడీపీ తమ్ముళ్లు బెస్ట్ చూసుకుంటున్నారా…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కడ రెండుసార్లు గెలిచిన మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన నేత ఉన్నారు. కానీ.. ఆయనతో వర్కవుట్ కాదని కేడర్ అంటోందట. మళ్లీ గెలవాలంటే.. నేతను మార్చాల్సిందే అంటున్నారట. కొత్త నేత ఎవరో కూడా కేడర్ డిసైడ్ చేసిందట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడ? కేడర్ వద్దనుకుంటున్న ఆ నాయకుడు ఎవరు?
కొత్త నేతను సెట్ చేసుకుంటోన్న టీడీపీ కేడర్?
Also Read
గుంటూరు జిల్లా వినుకొండ. టీడీపీకి ఒకప్పుడు కంచుకోట. వరసగా రికార్డు మెజారిటీతో గెలిచిన జీవీ ఆంజనేయులు మొన్నటి ఎన్నికల్లో అదే రికార్డుస్థాయి మెజారిటీతో ఓడిపోయారు. పార్టీకి మంచిపట్టు, ఆర్థికంగా దిట్టంగా ఉన్నా టీడీపీ ఓడిపోవడానికి కారణం ఆంజనేయులేనని కేడర్ అభిప్రాయపడుతోందట. పని ఏదైనా డబ్బులు వెదజల్లడం అలవాటుగా చేసుకున్న ఆంజనేయులు.. పార్టీపై పట్టు సాధించలేకపోయారట. ఆంజనేయులు ఉంటే ఇక వినుకొండలో టీడీపీ గెలుపు మర్చిపోవడమే అంటోందట ఓ వర్గం. అందుకే ఆంజనేయులు స్థానంలో కొత్త నేతను సెట్ చేసుకుంటోదట కేడర్. ఆయనతో రాయబేరాలు కూడా చేస్తున్నారట.
జీవీ కొత్త పలకరింపులపై టీడీపీలో ఓ వర్గం గుర్రు!
జీవీ ఆంజనేయులు శాసనసభ్యుడిగా ఎంత సక్సెస్ సాధించారో కానీ.. టీడీపీని ఒకతాటిపైకి తేవడంలో విఫలమైనట్టు పార్టీలో ఒకవర్గం అభిప్రాయం. ఉత్తుత్తి సభ్యత్వాలు నమోదు చేసి జబ్బలు చర్చుకోవడం కాదు.. కేడర్ను కాపాడుకోవాలని గతంలో అనేకసార్లు ఆయనకు చెప్పారట. అయినప్పటికీ ఆయన పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. అంతా అయిపోయాక.. మనం మనం బరంపురం అంటూ కొత్త పలకరింపులేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తోందట కేడర్. జీవీ ఆంజనేయులు నరసరావుపేట పార్లమెంట్ టీడీపీ ఇంచార్జ్గా ఉన్నారు. దీంతో వినుకొండలో ఆయన శకం ముగిసినట్టేనన్నది కొందరి చర్చ. నరసరావుపేట లోక్సభ పరిధిలోనే వినుకొండ ఉండటంతో.. ఆయన పోటీ చేస్తారని మరికొందరు అనుకుంటున్నారు.
మక్కెనను టీడీపీ అభ్యర్థిగా తీసుకురావాలని ప్రచారం!
ఈ సమయంలోనే వినుకొండ టీడీపీ కేడర్ పార్టీ నాయకుడిగా కొత్త పేరును ప్రచారంలోకి తెచ్చాయి. మాజీ ఎమ్మెల్యే.. ప్రస్తుతం వైసీపీలో ఉన్న మక్కెన మల్లికార్జున రావు టీడీపీ అభ్యర్థయితే రాబోయే రోజుల్లో పార్టీ విజయం నల్లేరుపై నడకలా ప్రచారం చేస్తున్నారట. ఇదే విషయాన్ని కొందరు మక్కెన దృష్టికి తీసుకెళ్లినట్టు చెబుతున్నారు. 2019 ఎన్నికల సమయంలో మక్కెన వైసీపీకి జైకొట్టినా.. ఆయనకు అక్కడ ఎలాంటి పదవి లేదు. నిరుత్సాహంగా ఉన్నారని టాక్. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు.. మాజీ ఎమ్మెల్యే మల్లికార్జునరావును పూర్తిగా పక్కన పెట్టేశారు. పార్టీలో ఆయన ఉనికి లేకుండా పోయింది. ఆర్థికంగా కూడా ఆయన ఇబ్బందుల్లో పడ్డారు. పదవిరాక, ప్రాధాన్యం లేక నిర్వేదంలో ఉన్న మక్కెనకు టీడీపీలో చోటు ఇస్తే పార్టీకి తిరుగు ఉండబోదని కొందరి అభిప్రాయం.
జీవీ వల్ల గతంలో ఇబ్బంది పడ్డవారు మద్దతిచ్చే అవకాశం లేదా?
వినుకొండ నియోజకవర్గంలోని గ్రామాల్లో తిరుగుతున్న జీవీ ఆంజనేయులుపై నమ్మకం లేదని ముఖం మీదే చెప్పేస్తోందట పార్టీలోని ఒక వర్గం. అధికారంలో ఉన్నప్పుడు ఆయన కేడర్ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించకపోగా పెదవి చేశారట. ప్రతి గ్రామంలో గ్రూపులు కట్టి తమను పురుగుల్లా చూసారని కొందరి ఆగ్రహం. గతంలో ఆయనవల్ల ఇబ్బందులు పడ్డవారు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారట.
ఎమ్మెల్యేను బొల్లాను ఢీకొట్టాలంటే మక్కెన బెటర్ అని ప్రచారం!
ప్రస్తుత ఎమ్మెల్యే బొల్లాను ఢీకొట్టాలంటే రాజకీయంగా పట్టున్న మక్కెన బెటర్ అని కొంతమంది అభిప్రాయం అట. జీవీ మాత్రం తాను వినుకొండను వదలను అంటున్నారట. నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీకి ఆయన సుముఖంగా లేరట. మరి కేడర్ కోరుకున్నది జరుగుతుందా? ఆంజనేయులు అనుకున్నది జరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Anna Lezhneva: జిమ్’లో వర్కౌట్స్ మొదలెట్టిన పవన్ భార్య
-
Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
-
Protein Rich Sattu Drink : ‘సత్తు డ్రింక్’ శరీరానికి పవర్ బూస్టర్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా.!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!