వినుకొండ టీడీపీ తమ్ముళ్లు బెస్ట్ చూసుకుంటున్నారా…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కడ రెండుసార్లు గెలిచిన మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన నేత ఉన్నారు. కానీ.. ఆయనతో వర్కవుట్ కాదని కేడర్ అంటోందట. మళ్లీ గెలవాలంటే.. నేతను మార్చాల్సిందే అంటున్నారట. కొత్త నేత ఎవరో కూడా కేడర్ డిసైడ్ చేసిందట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడ? కేడర్ వద్దనుకుంటున్న ఆ నాయకుడు ఎవరు?
కొత్త నేతను సెట్ చేసుకుంటోన్న టీడీపీ కేడర్?
Also Read
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Off The Record: మీనాక్షి నటరాజన్ అవకాశానికి గండి కొట్టింది ఎవరు? రాష్ట్ర నేతలు ఎవరైనా లీకులు ఇచ్చారా?
- Off The Record: దువ్వాడకు వైసీపీలోకి నో రీ ఎంట్రీ?.. రీల్స్ రాజా పొలిటికల్ కెరీర్ ఖతం అయినట్టేనా..?
- OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
గుంటూరు జిల్లా వినుకొండ. టీడీపీకి ఒకప్పుడు కంచుకోట. వరసగా రికార్డు మెజారిటీతో గెలిచిన జీవీ ఆంజనేయులు మొన్నటి ఎన్నికల్లో అదే రికార్డుస్థాయి మెజారిటీతో ఓడిపోయారు. పార్టీకి మంచిపట్టు, ఆర్థికంగా దిట్టంగా ఉన్నా టీడీపీ ఓడిపోవడానికి కారణం ఆంజనేయులేనని కేడర్ అభిప్రాయపడుతోందట. పని ఏదైనా డబ్బులు వెదజల్లడం అలవాటుగా చేసుకున్న ఆంజనేయులు.. పార్టీపై పట్టు సాధించలేకపోయారట. ఆంజనేయులు ఉంటే ఇక వినుకొండలో టీడీపీ గెలుపు మర్చిపోవడమే అంటోందట ఓ వర్గం. అందుకే ఆంజనేయులు స్థానంలో కొత్త నేతను సెట్ చేసుకుంటోదట కేడర్. ఆయనతో రాయబేరాలు కూడా చేస్తున్నారట.
జీవీ కొత్త పలకరింపులపై టీడీపీలో ఓ వర్గం గుర్రు!
జీవీ ఆంజనేయులు శాసనసభ్యుడిగా ఎంత సక్సెస్ సాధించారో కానీ.. టీడీపీని ఒకతాటిపైకి తేవడంలో విఫలమైనట్టు పార్టీలో ఒకవర్గం అభిప్రాయం. ఉత్తుత్తి సభ్యత్వాలు నమోదు చేసి జబ్బలు చర్చుకోవడం కాదు.. కేడర్ను కాపాడుకోవాలని గతంలో అనేకసార్లు ఆయనకు చెప్పారట. అయినప్పటికీ ఆయన పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. అంతా అయిపోయాక.. మనం మనం బరంపురం అంటూ కొత్త పలకరింపులేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తోందట కేడర్. జీవీ ఆంజనేయులు నరసరావుపేట పార్లమెంట్ టీడీపీ ఇంచార్జ్గా ఉన్నారు. దీంతో వినుకొండలో ఆయన శకం ముగిసినట్టేనన్నది కొందరి చర్చ. నరసరావుపేట లోక్సభ పరిధిలోనే వినుకొండ ఉండటంతో.. ఆయన పోటీ చేస్తారని మరికొందరు అనుకుంటున్నారు.
మక్కెనను టీడీపీ అభ్యర్థిగా తీసుకురావాలని ప్రచారం!
ఈ సమయంలోనే వినుకొండ టీడీపీ కేడర్ పార్టీ నాయకుడిగా కొత్త పేరును ప్రచారంలోకి తెచ్చాయి. మాజీ ఎమ్మెల్యే.. ప్రస్తుతం వైసీపీలో ఉన్న మక్కెన మల్లికార్జున రావు టీడీపీ అభ్యర్థయితే రాబోయే రోజుల్లో పార్టీ విజయం నల్లేరుపై నడకలా ప్రచారం చేస్తున్నారట. ఇదే విషయాన్ని కొందరు మక్కెన దృష్టికి తీసుకెళ్లినట్టు చెబుతున్నారు. 2019 ఎన్నికల సమయంలో మక్కెన వైసీపీకి జైకొట్టినా.. ఆయనకు అక్కడ ఎలాంటి పదవి లేదు. నిరుత్సాహంగా ఉన్నారని టాక్. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు.. మాజీ ఎమ్మెల్యే మల్లికార్జునరావును పూర్తిగా పక్కన పెట్టేశారు. పార్టీలో ఆయన ఉనికి లేకుండా పోయింది. ఆర్థికంగా కూడా ఆయన ఇబ్బందుల్లో పడ్డారు. పదవిరాక, ప్రాధాన్యం లేక నిర్వేదంలో ఉన్న మక్కెనకు టీడీపీలో చోటు ఇస్తే పార్టీకి తిరుగు ఉండబోదని కొందరి అభిప్రాయం.
జీవీ వల్ల గతంలో ఇబ్బంది పడ్డవారు మద్దతిచ్చే అవకాశం లేదా?
వినుకొండ నియోజకవర్గంలోని గ్రామాల్లో తిరుగుతున్న జీవీ ఆంజనేయులుపై నమ్మకం లేదని ముఖం మీదే చెప్పేస్తోందట పార్టీలోని ఒక వర్గం. అధికారంలో ఉన్నప్పుడు ఆయన కేడర్ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించకపోగా పెదవి చేశారట. ప్రతి గ్రామంలో గ్రూపులు కట్టి తమను పురుగుల్లా చూసారని కొందరి ఆగ్రహం. గతంలో ఆయనవల్ల ఇబ్బందులు పడ్డవారు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారట.
ఎమ్మెల్యేను బొల్లాను ఢీకొట్టాలంటే మక్కెన బెటర్ అని ప్రచారం!
ప్రస్తుత ఎమ్మెల్యే బొల్లాను ఢీకొట్టాలంటే రాజకీయంగా పట్టున్న మక్కెన బెటర్ అని కొంతమంది అభిప్రాయం అట. జీవీ మాత్రం తాను వినుకొండను వదలను అంటున్నారట. నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీకి ఆయన సుముఖంగా లేరట. మరి కేడర్ కోరుకున్నది జరుగుతుందా? ఆంజనేయులు అనుకున్నది జరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!