గల్లీలో లొల్లి.. ఢిల్లీలో మేడంతో భేటీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్యే. పార్టీలో ఉన్నారో లేదో తెలియని సమయంలో.. బయటకు వెళ్లిపోతారని చర్చ జరుగుతున్న వేళ పార్టీలో చర్చగా మారారు. తెలంగాణ కాంగ్రెస్లో ఆయన అంటీముట్టనట్టు వ్యవహారం నడుపుతున్నారనే టాక్ ఉంది. సడెన్గా హస్తినకు వెళ్లి.. కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీతో సమావేశం అయ్యారు. ఇద్దరు కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ అధినేత్రితో భేటీ ఒక రహస్యమైతే.. ఇద్దరిపై ఫిర్యాదు చేశారన్న సమాచారం కాంగ్రెస్ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది.
ఠాగూర్, రేవంత్ల తీరును ప్రస్తావించిన రాజగోపాల్? మునుగోడు ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి.. ఇటీవల ఢిల్లీకి వెళ్లి మూడు నాలుగు రోజులు అక్కడే ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంతా అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కోసం హస్తిన వెళ్తే.. సోనియాగాంధీతో రాజగోపాల్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలపై చర్చ చేసినట్టు సమాచారం. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో AICC ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్.. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ప్రస్తావన వచ్చిందట. ఇంఛార్జ్ ఠాగూర్ అసలు ఎవరినీ పట్టించుకోవడం లేదని..! రేవంత్ ఏం చేస్తే దాన్ని సమర్దించడమే సరిపోతుందని సోనియాగాంధీతో చెప్పినట్టు తెలుస్తోంది. రాజగోపాల్ చెప్పే అంశాలను ఠాగూర్ను నోట్ చేసుకోవాలన్న సోనియా?
Also Read
- Botsa Satyanarayana : యుద్ధం సాకుతో ఇష్టారీతన ప్రజలపై భారంమోపుతున్నారు
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
పీసీసీ చీఫ్ అధ్యక్ష పదవిని రేవంత్కు ఇచ్చేటప్పుడు కాస్త సమాచారం తెచ్చుకుని ప్రకటన చేస్తే బాగుండేదని మేడమ్తో చెప్పారట రాజగోపాల్. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయడంతోపాటు.. త్యాగాలు చేసిన వాళ్లకు పీసీసీ చీఫ్ పదవి ఇస్తే బాగుండేదని సూచించారట. అప్పటికే అక్కడకు కాస్త దూరంగా ఉన్న ఇంఛార్జ్ ఠాగూర్ను పిలిచిన సోనియాగాంధీ.. ఎమ్మెల్యే రాజగోపాల్ చెప్పే అంశాలను నోట్ చేసుకోవాలని చెప్పారట. పార్టీ వ్యవహారాలపై తాను రాజగోపాల్రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడతానని ఠాగూర్ మేడమ్కు బదులిచ్చారట.
ఠాగూర్, రాజగోపాల్ మధ్య సయోధ్యకు ఒక సీనియర్ నేత యత్నం?ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. గతంలో ఇదే ఠాగూర్.. ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డిపై బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పార్టీ అధిష్ఠానానికి రిపోర్ట్ ఇచ్చారట. ఆ అంశంపై రాజగోపాల్రెడ్డితో ఠాగూర్ మాట్లాడినట్టు తెలుస్తోంది. అలాగే పార్టీ వ్యవహారాలు చూస్తున్న సీనియర్ నాయకుడు ఒకరు.. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే పనిలో ఉన్నట్టు సమాచారం. మూడు రోజుల పర్యటనకు హైదరాబాద్ వస్తున్న తరుణంలో ఒకరోజు రాజగోపాల్రెడ్డి ఇంటికి ఠాగూర్ను తీసుకెళ్లే పనిలో ఉన్నారట.గందరగోళానికి తెరదించేస్తారా?
ఇదే సమయంలో ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డిపై మరో ప్రచారం కూడా జరుగుతోంది. ఆయన పార్టీ మారతారని కొన్నాళ్లుగా నడుస్తున్న టాక్. అయితే కాంగ్రెస్లోనే ఉంటారని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. ఈ గందరగోళానికి రాజగోపాల్ కూడా వీలైనంత త్వరగా ముగింపు పలకాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. మరి.. ఢిల్లీలో సోనియాగాంధీతో జరిగిన రహస్య భేటీ రాజగోపాల్ రాజకీయ భవిష్యత్ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.
Watch Here : https://youtu.be/fdb0uM3xn-w
తాజావార్తలు
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Asim Munir: ఉద్రిక్తతల వేళ టెహ్రాన్లో అసిమ్ మునీర్ పర్యటన.. కీలక నేతలతో భేటీ
-
Bakrid Holiday Change: బక్రీద్ సెలవు మార్పు.. మే 28న జరగాల్సిన పరీక్షలు వాయిదా!
-
Elon Musk: మస్క్కు చైనా గూఢచారుల విందు?.. ట్రంప్ చైనా పర్యటనపై కొత్త వివాదం
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!