మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే మధ్య పంచాయతీ…!
తెలంగాణ కాంగ్రెస్లో పొలిటికల్ వార్ కామన్. ప్రతి నాయకుడు….తనకు కావలసింది సాధించుకోవడం కోసం వ్యూహాలు వేస్తుంటారు. ఇటు కోమటిరెడ్డి నుంచి మొదలుకుని…ప్రేమ్ సాగర్ వరకు…ఎవరి వ్యూహం వారికి ఉంది. మరి…అదిలాబాద్ పంచాయితీ వెనక అసలు వ్యూహం ఏంటి!?
అదిలాబాద్ జిల్లా కాంగ్రెస్లో ఏం జరుగుతుంది?మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్ రావు…మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మద్య పంచాయుతీనే రచ్చకు కారణం అవుతుందా?మహేశ్వర్ రెడ్డి…ఇంద్రవెల్లి సభ కంటే ముందు రచ్చ చేశారనే…ప్రేమ్సాగర్ వివాదం మొదలైందా?ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తెరమీదకొస్తున్నాయి. ప్రేమ్ సాగర్ రావు…మహేశ్వర్ రెడ్డి మధ్య సయోధ్య లేదు. ఇద్దరు ఒకరికి ఒకరు చెక్ పెట్టుకోడానికి ఇది ఎత్తుగడగా వాడుకుంటున్నారనే ప్రచారం పార్టీలో ఉంది. ప్రేమ్సాగర్ రావు…స్థానిక పార్టీ కమిటీల్లో పాత వారిని కాదని కొత్త వారికి అవకాశం ఇవ్వడం ఏంటనే వాదనలు ఉన్నాయి. రాయబారానికి వెళ్ళిన నాయకుల వద్ద ప్రేమ్సాగర్ రావు తీస్తున్న ప్రస్తావనలు ఏంటి?ఇలా ఒక్కొక్కరు…ఒక్కో వ్యూహంతో ఉంటే…పార్టీ నడవడం ఎలా అనేదే…అసలు ప్రశ్న.
Also Read
- Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
- Off The Record : తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు.. స్పాట్ లోనే అధికారులు సస్పెండ్..
- Off The Record : పార్టీతో పాటు శెట్టిబలిజ సామాజికవర్గంలో మంత్రి సుభాష్ ఒంటరి అయ్యారా?
- Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?
వాయిస్-తెలంగాణ కాంగ్రెస్లో కొందరు పిసిసిని టార్గెట్ చేస్తూ…మరికొందరు పార్టీ వ్యవహారంపై గుర్రుగా ఉన్నారు. పిసిసిలో ఇప్పటికే ఐదు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఉన్నాయి. కొత్తగా…పదవులు ఆశిస్తున్న వారిలో బలరాం నాయక్…ప్రేమ్సాగర్ రావులు ఉన్నారు. ప్రేమ్సాగర్ రావు మొదటి నుంచి…వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఆశిస్తున్నారు. లోకల్ నాయకుల పంచాయతీ ఒక ఎత్తయితే…వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై గతంలో పార్టీ పెద్దల వద్ద చర్చకు వచ్చినట్టు ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పటి వరకు కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులపై పార్టీలో అసలు చర్చ లేకుండా పోయింది. బుజ్జగింపులు కోసం వెళ్ళిన నాయకుల వద్ద పదవుల అంశం కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. ఇప్పటికే ఐదు వర్కింగ్ ప్రెసిడెంట్ అంశంలో నేతల మధ్య సయోధ్య లేదు. ఇప్పుడు మళ్లీ పంచాయతీ ఆ పదవి కోసమే అనే టాక్ మొదలైంది. సంప్రదింపులు చేస్తున్న నాయకుల వద్ద వచ్చిన ప్రస్తావన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ వద్దకు వెళ్లిందట. ఐతే…దీనిపై ఆయన సైలెంట్ అయ్యారట. మొత్తానికి కాంగ్రెస్లో పంచాయతీలు కంటిన్యు అవుతూనే ఉన్నాయి. అసలీ రచ్చ ఎటు వెళ్తుందనేది చూడాలి.
తాజావార్తలు
-
Central Minister: ఏపీ రాజధాని నిర్మాణంపై.. కేంద్ర మంత్రి పెమ్మసాని కీలక వ్యాఖ్యలు..
-
Annavaram Prasadam Recipe: అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం.. ఇలా చేస్తే టెంపుల్ టేస్ట్ ఉంటుంది..!
-
Lyricist Chandrabose’s Brother: చంద్రబోస్ సోదరుడు మృతిపై అనుమానాలు?
-
Amit Shah: బెంగాల్ సీఎం ఎంపిక బాధ్యతలు అమిత్ షాకు అప్పగింత.. రేసులో సువేందు!
-
Proddatur : ప్రొద్దుటూరు మహిళ మిస్టరీ డెత్ కేసును ఛేదించిన పోలీసులు
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!