నందికొట్కూరు వైసీపీలో ఆగని ఆధిపత్యపోరు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందికొట్కూరు వైసీపీ గురించి చెబితే.. అక్కడి నాయకుల కంటే.. వారి మధ్య ఆధిపత్యపోరే ఎక్కువ హైలెట్. ఎమ్మెల్యే ఆర్థర్, పార్టీ ఇంఛార్జ్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఉప్పు నిప్పులా ఉంటారు. వారే కాదు.. వారి అనుచరులు కూడా అంతే. ఇప్పుడు కొత్త గొడవ ఆ నియోజకవర్గంలో హాట్ టాపిక్. అదేంటో లెట్స్ వాచ్..!
ఆధిపత్యపోరులో దాడులు.. హత్యాయత్నాలు..!
Also Read
- Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
- OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
- Off The Record: వనపర్తి కాంగ్రెస్లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
- OTR: నెల్లూరు వైసీపీలో మొదలైన అసంతృప్తి రగడ.. అధిష్టానం తీరుపై నేతల గుస్సా..
కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ నియోజకవర్గ ఇంచార్జి, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఎమ్మెల్యే ఆర్థర్ మధ్య 2019 ఎన్నికలు ముగిసినప్పటి నుంచి అస్సలు పడటం లేదు. అనేకసార్లు అధిష్ఠానం ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. నియోజకవర్గంలో ఇరువురి మధ్య అధిపత్యపోరు ముదిరి ఒకవర్గంపై మరోవర్గం దాడులు.. హత్యాయత్నంల వరకు దారితీశాయి. పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో ఒకవర్గంపై మరోవర్గం పోటీ చేసి పార్టీ అభ్యర్థులు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి.
పరస్పరం కేసులు పెట్టుకునే పరిస్థితి..!
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఆర్థర్ మధ్య వర్గపోరును నివారించేందుకు వైసీపీ జిల్లా ఇంచార్జి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి చాలా ప్రయత్నించారు. అయినప్పటికీ ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. వారి మధ్య సయోధ్య సాధ్యం కాకపోగా తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేనంతగా నందికొట్కూరు వైసీపీలో సమస్యలు రచ్చ రచ్చగా మారి చర్చకు దారితీస్తున్నాయి. పరస్పరం కేసులు పెట్టుకోవడం పోలీస్ వర్గాలకు కూడా ఇబ్బందిగా మారుతున్న పరిస్థితి. అభివృద్ధి పనుల్లోనూ అధికారులు రెండువర్గాలను సమన్వయం చేయలేక సతమతం అవుతున్నారట.
మరింత గ్యాప్ తీసుకొచ్చిన వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం..!
శాప్ చైర్మన్ హోదాలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నందికొట్కూరు మున్సిపాలిటీలో వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం చేశారు. ఎమ్మెల్యే ఆర్థర్కు ఆహ్వానం లేదు. చివరకు ఎమ్మెల్యే పేరు కూడా శిలాఫలకంపై లేకపోవడం చర్చకు దారితీసింది. అదే శిలాఫలకంలో మున్సిపల్ అధికారులు పేర్లు ఉన్నాయట. ఈ అంశంపై ఆర్థర్ వర్గీయులు నిలదీశారు. దీంతో అధికారుల పేర్లు కనించకుండా ఇటుకలు పెట్టి మూసివేశారు. అంతేకాదు.. ఈ గొడవ తమకెందుకని ట్యాంక్ ప్రారంభోత్సవానికి దూరంగా ఉండిపోయారు అధికారులు. మరోవైపు ప్రొటోకాల్ ఉల్లంఘించి.. అవమానించారని ప్రివిలేజ్ కమిటీకి, ఎస్సీ.. ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేయాలని ఎమ్మెల్యే ఆర్థర్పై ఆయన వర్గీయులు ఒత్తిడి తెచ్చారట. ఎమ్మెల్యే మాత్రం ఈ అంశాన్ని వైసీపీ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లారట.
సహించలేరు.. రాజీ పడరు..!
ఎంత చెప్పినా ఇద్దరూ వినకపోవడంతో హైకమాండ్ నిస్తేజంగా మారిపోయిందట. సిద్ధార్థరెడ్డి మొదటి నుంచి వైసీపీలో ఉన్నారు. ఆర్థర్ పోలీస్ అధికారిగా రిటైర్ అయి వైసీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. నందికొట్కూరు ఎస్సీ రిజర్డ్వ్ నియోజకవర్గం కావడంతో సిద్ధార్థరెడ్డికి ఛాన్స్ లేదు. ఆర్థర్ మాత్రం మాత్రం ఎమ్మెల్యేగా తన పని తాను చేసుకుపోతాను అంటున్నా.. అది సిద్ధార్థరెడ్డి సహించలేకపోవడం.. ఆర్థర్ రాజీ పడకపోవడంతోనే సమస్యలు శ్రుతి మించుతున్నాయట. ఇది ఎవరికి చేటు తెస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
January 12 Vidudala: జనవరి 12 విడుదల.. రావిపూడి టైటిల్ అదిరిందిగా
-
Maharashtra: బిడ్డను బయటకు తీసి కడుపులో గ్లోవ్స్ మరిచారు..
-
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Toxic Ticket Prices: డబ్బింగ్ మూవీకి ఇంత రేటా? ‘టాక్సిక్’ టికెట్ ధరలపై సినీ లవర్స్ ఫైర్!
-
Trump: ట్రంప్తో ఫొటో దిగాలని ముచ్చటపడుతున్నారా? ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!