Off The Record: అక్కడ అదే జరిగిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అదే జరిగిందా..? అందుకే అలా అయ్యిందా..? అధికారపార్టీ కోరుకుంటోందని… ఆ నేత చెప్పింది దాని గురించేనా..? ఇంతలో ఇంత మార్పునకు ఈ కలయికే కారణమా..?
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
ఉత్తరాంధ్రను గుప్పెట పట్టిన వైసీపీ అక్కడ ఉక్కిరి బిక్కిరి
ఏపీలో పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అంచనాలు లేకుండానే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సంచలనం సృష్టిస్తోంది. ఎక్కడో ఉంటుందని అధికార పార్టీ చెప్పిన టీడీపీ… మొదటి వరుసలోకి వచ్చింది. అధికారపార్టీ దీనిని ఊహించలేదా? మొత్తం ఉత్తరాంధ్రను గుప్పెటపట్టిన వైసీపీ అక్కడ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలతో కూడిన తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతో కూడిన పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలోనూ టీడీపీ-వైసీపీ మధ్య హోరాహోరీ పోరు నడిచింది.
టీడీపీ-జనసేన వ్యూహాలు మార్చేశాయా?
తొమ్మిది జిల్లాలు… దాదాపు 15 పార్లమెంట్ నియోజకవర్గాలు… 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు జరిగాయి. కర్నూలు నుంచి ప్రకాశం జిల్లా వరకు టీడీపీకి ఉన్న ఎమ్మెల్యేలు ఏడుగురే. అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు, నెల్లూరు, కడప వైసీపీ స్వీప్ చేసింది. ఉత్తరాంధ్రలోని 35 నియోజకవర్గాల్లో టీడీపీకి ఉంది ఎంపీ ఒకరైతే… ఎమ్మెల్యేల బలం ఆరే. అటువంటి చోట్ల ఇప్పుడు ఈ ఫలితాలు ఎలా సాధ్యం అయ్యాయనేదానిపై చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేశాయి. ఈ జిల్లాల్లో జనసేనకు ఒక్కటంటే ఒక్క సీటు రాకపోగా… పవన్ కల్యాణ్ గాజువాకలో ఓడిపోయారు. కానీ ఈసారి ఈ పార్టీలు వ్యూహం మార్చాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెబుతున్న పవన్ కల్యాణ్ తన బలగాలను టీడీపీ వైపు మళ్లించారట. అందుకే టీడీపీ ఆధిక్యంలోకి వచ్చిందట. పవన్ కల్యాణ్ కోరుకుంటోంది ఇదే. బీజేపీతో పొత్తులో ఉన్నా… టీడీపీతో కలిస్తేనే జగన్ ను ఓడించడం సాధ్యం అవుతుందనేది పవన్ లెక్క. దీనికి బీజేపీ ససేమిరా అంటోంది. అందుకే ఈ ఎన్నికల్లో బీజేపీ బరిలోఉన్నా… ఆ పార్టీకి మద్దతు ఇవ్వలేదు పవన్ కల్యాణ్. జనసేన-బీజేపీ కలయిక వల్ల ఒరిగేదీమీ లేకపోగా వైసీపీకి మేలు జరుగుతుందని పవన్ అంచనా వేశారట. అందుకే తమ పార్టీ వాళ్లకు వైసీపీని ఓడించాలని పిలుపు ఇచ్చారట. అది వర్కవుట్ కావడం వల్లే వైసీపీ వెనుకబడిందని లెక్కలు వేస్తున్నారు. జనసేన-టిడీపి కలిసి ఉంటే 2019 ఎన్నికల్లోనే గాజువాకలో పవన్ కల్యాణ్, విశాఖ ఎంపీ సీట్ లో టీడీపీ లేదా జనసేన గెలిచి ఉండేవని అప్పటి లెక్కలు చెబుతున్నాయి.
జనసేన వల్లే టీడీపీకి ఆధిక్యత వచ్చిందంటున్న నేతలు
ఈ కలయిక ఉండకూడదనే వైసీపీ కోరుకుంటోందని జనసేన భావిస్తోంది. మొన్న జరిగిన పార్టీ పదో ఆవిర్భావ సదస్సు చివరిలో ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. వైపీసీ కోరుకుంది జరగదు…. మీరేం కోరుకుంటున్నారో…. నేనూ అదే కోరుకుంటున్నాను అంటూ టీడీపీ-జనసేన కలయికపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు పవన్. జనసేన నేతలతోపాటు ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు కూడా జనసేన వల్లే టీడీపీ ఆధిక్యత సాధ్యం అయిందని బహిరంగంగానే చెబుతున్నారు. ఈ పార్టీల లెక్కల్లో ఎంత నిజం ఉందీ లేనిదీ…. సాధారణ ఎన్నికల్లో చూస్తే కానీ అర్ధం కాదు…
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!