Off The Record : తెలంగాణ బీజేపీలో కట్టు తప్పుతున్న క్రమశిక్షణ
- తెలంగాణ బీజేపీలో కట్టు తప్పుతున్న క్రమశిక్షణ
- వికారాబాద్ అధ్యక్షుడి విషయంలో వివాదం
- చివరికి జిల్లా అధ్యక్షుడిని తప్పించిన రాష్ట్ర నాయకత్వం
- పంతం నెగ్గించుకున్న ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రమశిక్షణకు కేరాఫ్ అని ఢంకా బజాయించే బీజేపీలో ఆ పరిస్థితులు మారిపోతున్నాయా? కీచులాటలకు కేరాఫ్ అవుతోందా? ఎక్కడికక్కడ జిల్లాల్లో లొల్లి పెరిగిపోతోందా? తాజాగా జరుగుతున్న పరిణామాలు ఏం చెబుతున్నాయి? పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణ బీజేపీలో పరిస్థితులు మారిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు, బలం, జనంలోకి వెళ్లే సంగతులు ఎలాఉన్నా… క్రమశిక్షణ విషయంలో మాత్రం కట్టు తప్పలేదన్న అభిప్రాయం ఉండేది. కానీ… తాజాగా జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆ పరిస్థితుల్ని మార్చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా పంచాయతీ కొంత కాలంగా నడుస్తోంది. జిల్లా అధ్యక్షుడి ఎంపిక విషయంలో నేతల మధ్య కోల్డ్ వార్ నడిచింది. జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డిపై ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి బహిరంగంగానే కామెంట్ చేశారు. ఆయన్ని తీసేయాలని పట్టుబట్టారు.
ఆ పంచాయితీని తీర్చేందుకు రాష్ర్ట పార్టీ ఓ కమిటీ వేసింది. జిల్లా పార్టీ నేతలతో మాట్లాడిన కమిటీ రాష్ర్ట అధ్యక్షుడికి రిపోర్ట్ ఇచ్చింది. దాని ఆధారంగా.. జిల్లా అధ్యక్షుడిని రాజీనామా చేయాలని స్టేట్ ప్రెసిడెంట్ రామచందర్రావు ఆదేశించారని, ఆ ప్రకారమే రాజీనామా లేఖను సమర్పించినట్టు సమాచారం. మొత్తం మీద ఆ ఎపిసోడ్లో తన పంతం నెగ్గించుకున్నారు కొండా విశ్వేశ్వర్రెడ్డి. ఇలాంటి పరిస్థితి ఇంకా ఆరు జిల్లాల్లో ఉన్నట్టు చెప్పుకుంటున్నాయి తెలంగాణ బీజేపీ వర్గాలు. ఆ ఆరు చోట్ల అధ్యక్షుల పరిస్థితి చివరికి వచ్చిందని, వాళ్ళ మెడల మీద కత్తులు వేలాడుతున్నాయన్నది పార్టీ వర్గాల ఇంటర్నల్ టాక్. మరోవైపు మంచిర్యాలలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ నేతలు గొడవపడ్డారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ముందే తిట్టుకున్నారు. పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత, గత ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన గోమాస శ్రీనివాస్ మధ్య పంచాయితీ తీవ్ర స్థాయికి చేరింది.
Also Read
వాళ్ళిద్దరికీ రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీ షో కాజ్ నోటీసు ఇచ్చింది. ప్రస్తుతం వాళ్ళు పార్టీలో కలిసి కొనసాగే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. పార్టీ పెద్దలు చర్యలకు సిద్ధమవుతున్న క్రమంసో… వాళ్ళు ఉంటారా గుడ్ బై కొడతారా అన్న చర్చ జరుగుతోంది. పెద్దలు మాత్రం లైన్ దాటితే కఠినంగానే ఉండాలని డిసైడ్ అయ్యారట. గతంలో ఈ పార్లమెంట్ పరిధిలో పెద్దపల్లి లో నేతలు లొల్లి పెట్టుకున్నారు .. అప్పుడు కూడా పార్టీ అధ్యక్షుడి ముందే జరిగింది…. చాలా జిల్లాలో ఇలాగే అంతర్గత క్రమశిక్షణారాహిత్యం ఉందన్న అభిప్రాయం బలపడుతోంది బీజేపీ సర్కిల్స్లో. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాది ఇంకో వివాదం. ఇక్కడ ఉన్న బలమే అంతంత మాత్రం, అందులో కూడా గొడవలే. ఆ వివాదాల్ని సెట్ చేయడానికి రాష్ర్ట పార్టీ ఒక కమిటీని నియమించింది. రిపోర్ట్ వచ్చాక అక్కడ కూడా చర్యలు ఉంటాయని అంటున్నారు. మొత్తానికి కమలంలో క్రమ శిక్షణ కట్టు తప్పుతోంది… పార్టీ లెటర్ లు, షో కా జ్ నోటీసులు ఏ మేరకు పనిచేస్తాయో మరి.
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!