Off The Record : అధ్యక్షుని పర్యటన పేరుతో భారీగా వసూళ్లు!
పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులై జిల్లాల పర్యటనకు రావడమే వారికి కాసులు కురిపించిందా…గతంలో ఎన్నడూ లేని సంప్రదాయానికి ఆ జిల్లాలో తెర తీసారా….అధ్యక్షుని పర్యటన పేరుతో భారీగా వసూళ్లు చేసారా….ఈ వ్యవహారం ఆ పార్టీలో హాట్ టాపిక్ అయిందా…. బీజేపీ కొత్త అధ్యక్షుడు మాధవ్…జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ శాఖ సమావేశం, చాయ్ పే చర్చ, బీజేపీ శ్రేణులతో ర్యాలీ, సమావేశం, వ్యాపార వర్గాలు, మేధావులతో సమావేశం…ఇలా కొత్తరకంగా మాధవ్ పర్యటన షెడ్యూల్ సాగింది. అయితే మాధవ్ పర్యటన విజయవంతం చేసేందుకు…ఆ పార్టీ నాయకులు బాగానే కసరత్తు చేశారట. గ్రామ స్థాయి నాయకులు మొదలు, మండల, నియోజకవర్గ, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు ప్రత్యేక శ్రద్ధ చూపారు. రాష్ట్ర అధ్యక్షునిగా మాధవ్ పర్యటన సక్సెస్ అయిందని బీజేపీ శ్రేణులు ఆనందపడుతున్నాయి.
నంద్యాల జిల్లాలో మాధవ్ పర్యటన పేరుతో కీలక నేత ఒకరు భారీ ఎత్తున వసూళ్లకు శ్రీకారం చుట్టారట. గతంలో ఎప్పుడూ లేని సంప్రదాయనికి తెర తీసారని జిల్లాలో ప్రచారం సాగుతోంది. పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండడం, రాష్ట్రంలో కూడా అధికార భాగస్వామి కావడంతో…నంద్యాల జిల్లాలో బీజేపీ నేత భారీగా వసూళ్లు చేశారట. బీజేపీలో సాధారణంగా విరాళాలు లేదా ఇతర రూపంలో వసూళ్ళ సంప్రదాయం లేదనే టాక్ ఉంది. ముఖ్య నేతలు పర్యటనకు వస్తే ఏర్పాట్లకు, కార్యక్రమాల నిర్వహణకు, ఫ్లెక్సీలకు, సమావేశం ఫంక్షన్ హాల్ , భోజనాలు వంటి వాటికి రాష్ట్ర పార్టీ ఖర్చులు భరిస్తుంది. అయితే నంద్యాల జిల్లాలో రాష్ట్ర అధ్యక్షుని పర్యటన పేరు చెప్పి వసూళ్లు చేయడం చర్చనీయాంశంగా మారింది. నంద్యాలలో ప్రత్యక్షంగా వసూళ్లు చేయగా మండలాలు, నియోజకవర్గాల్లో వసూళ్లకు కొందరికి ఏకంగా పుస్తకాలు ముద్రించి ఇచ్చారట.
Also Read
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పర్యటనకు వాస్తవంగా పెద్దగా ఖర్చు కాలేదు. చాలా సింపుల్ గానే పర్యటన ప్లాన్ చేశారు. పర్యటనలో ప్రధానంగా సమావేశానికి ఫంక్షన్ హాల్, కార్యకర్తలకు భోజనాలు, ఫ్లెక్సిలు, బీజేపీ శ్రేణుల రాకపోకలకు ట్రాన్స్పోర్టు ఖర్చుకు మాత్రమే ఖర్చులు అయ్యాయి. ఇందులో సమావేశానికి ఫంక్షన్ హాల్, భోజనాలు ఓ విద్యాసంస్థ యాజమాన్యమే ఖర్చు పెట్టిందట. ఇక కార్యకర్తల రవాణా, ఫ్లెక్సీలు ఆయా ప్రాంతాల నేతలు ఎవరికి వాళ్లే పెట్టుకున్నారనే చర్చ నడుస్తోంది. నంద్యాలలో ఫ్లెక్సీలు, ఇతర వాటికి చిల్లర ఖర్చులు అయ్యాయి. అయితే విద్యాసంస్థల నుంచి భారీగా వసూలు చేశారట. విరాళాల వసూలుకు రాష్ట్ర పార్టీ అనుమతి లేకుండా ముద్రించి నియోజకవర్గ నాయకులకు ఇచ్చారట. వ్యాపార వర్గాల నుంచి కూడా బాగానే పిండుకున్నారనే ప్రచారం సాగుతోంది. ఇందులో చెప్పుకోదగ్గది బీజేపీ కార్యక్రమానికి వైసీపీకి చెందిన ఓ మాజీ ఎంపీని విరాళాల కోసం ఒత్తిడి చేశారట. కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ కార్యక్రమానికి తామెందుకు డబ్బులు ఇస్తామని ఆ మాజీ ఎంపీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సదరు వైసీపీ నేత డబ్బులు ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేసారట. అయినా వెంటబడి ఆ మాజీ ఎంపీ నుంచి లక్ష రూపాయలు వసూలు చేశారట. బీజేపీ ప్రోగ్రాంలకు ఇలా విరాళాలు సేకరించడం ఎప్పుడూ జరగలేదని పార్టీ సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందుత్వవాదులైన ప్రముఖుల నుంచి విరాళాల సేకరణ చేస్తారని…అది కూడా చాలా పద్ధతిగా ఉంటుందని సొంత పార్టీ నేతలు చెబుతున్నారు. నంద్యాలలో మాత్రం నిబంధనలకు గాలికొదిలేసారనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి సమున్నత లక్ష్యంతో మాధవ్ పర్యటన చేపడితే…ఆయన పర్యటన పేరుతో డబ్బులు వసూలు చేయడం ఏంటనే టాక్ పార్టీలో ఉందట. మొత్తమ్మీద నంద్యాలలో బీజేపీ వసూళ్లు హాట్ టాపిక్గా మారాయి.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో