Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
- ఉమ్మడి ప.గో. జిల్లాలో బీజేపీ మోస్ట్ సీనియర్ లీడర్ పాకా సత్యనారాయణ
- రాజ్యసభ పదవితో పాకాను గుర్తించిన పార్టీ అధిష్టానం
- మొదట్లో అధికారిక కార్యక్రమాల్లో హడావుడి చేసినా ఇప్పడు సైలెంట్
- బీజేపీ విజయోత్సవాల్లో కనిపించని ఎంపీ పాకా సత్యనారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కష్టానికి తగిన గుర్తింపు దక్కినా.. ఇమేజ్ పెంచుకునే విషయంలో ఆ ఎంపీ ఎందుకో వెనకబడ్డారా? కార్యకర్త స్థాయి నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎదిగినా.. ఆయన అసంతృప్తి రాగం ఆలపిస్తున్నారా? తాజా ఎన్నికల్లో గెలిచి దేశమంతా కమలం పార్టీ సంబరాల్లో చేసుకుంటుంటే…ఆయన మాత్రం ఇంటికే పరిమితం కావడంలో అర్థమేంటి? ఆ ఎంపీ వ్యవహారం ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు అనడానికి ఉదాహరణగా కనిపిస్తోందా? ఇంతకీ ఆ మరో కత్తి ఎవరు? ఆ ఎంపీ ఎవరు?
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో బిజెపి తరఫున ద మోస్ట్ సీనియర్ లీడర్ కం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు పాకా సత్యనారాయణ. 1976 నుంచి RSSతో అనుబంధం. 2018-2021 వరకు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, పార్టీ క్రమశిక్షణా సంఘం ఛైర్మన్గా పనిచేశారు పాకా. అలాంటి సీనియర్ లీడర్ చేసిన సేవలను గుర్తించి రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించింది బిజెపి. అయితే పదవి వచ్చిన మొదట్లో భీమవరంలో జరిగిన అన్ని కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్న ఎంపీ పాకా…ఇప్పుడు ఎందుకో వెనుకబడ్డారు అనే విమర్శలు వినిపిస్తున్నాయట.
Also Read
- OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ... బీఆర్ఎస్ భారీ స్కెచ్?
- Off The Record: చేవెళ్ల కాంగ్రెస్లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
మోస్ట్ సీనియర్ లీడర్ , ఎంపీ వెనుకబడ్డారు అనే విమర్శలు రావడానికి కారణం ఇటీవల భీమవరంలో జరిగిన పలు పార్టీ కార్యక్రమాల్లో ఆయన హాజరు కాకపోవడమే అనేది పార్టీ లోకల్ నాయకుల టాక్. పశ్చిమ బెంగాల్లో పార్టీ విజయం సాధించి భీమవరంలో జరిగిన ఎన్నికల విజయోత్సవ ర్యాలీలు, పాలాభిషేకం కార్యక్రమాల్లో ఎంపీ పాకా హాజరు కాలేదు. ఆయన అటెండ్ కాకపోవడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కార్యక్రమాలకు పిలిచినా రాలేదనేది పార్టీ నాయకుల మాటయితే ఆహ్వానం అందలేదనేది ఆయన వాదనగా తెలుస్తోంది. దీంతో గ్యాప్ ఎక్కడ వచ్చిందో అర్థం కాక అక్కడి పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారని సమాచారం. భీమవరంలో జరిగే కార్యక్రమాల విషయం పక్కనపెడితే నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకు వంటి నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాలకు మాత్రం ఆయన అటెండ్ అవుతూ వస్తున్నారట.
అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా ఒకే ప్రాంతం నుంచి అదికూడా భీమవరం నుంచి ఇద్దరు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న వేళ…అక్కడ పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన సమయంలో రాజ్యసభ సభ్యులు పాక ఎందుకు దూకుడు పెంచడం లేదని చర్చ హాట్ టాపిక్ గా నడుస్తుందట. 2024 ఎన్నికల్లో నరసాపురం తరపున బిజెపి ఎంపీగా గెలిచి కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీనివాస వర్మ ఓవైపు తన కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతుంటే, ఆయా కార్యక్రమాలకు మరో ఎంపీ పాక హాజరు కాకపోవడం వెనుక ఏదైనా గ్యాప్ ఉందా అనే చర్చకు భీమవరంలో తెరలేసింది. పార్టీలో సుదీర్ఘకాలం పాటు పనిచేసి ఎంపీలుగా అవకాశం దక్కించుకున్న నేతలు ఎడమొహం పెడముఖంగా ఉంటున్నారా అనే అనుమానాలు తెరపైకొస్తున్నాయట.. ఇలా చేయడం వల్ల కష్టానికి తగ్గ ఫలితం దక్కినా.. పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లే విషయంలో వెనకబడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయట..
ఇద్దరు ఎంపీలు కలిసి పనిచేసే విషయంలో సమన్వయ లోపం ఉందా లేక సమాచార లోపం ఉందో తెలియదు గానీ…దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకే చోట నుంచి ఇద్దరు ఎంపీల ప్రాతినిధ్యం ఉన్న ప్రాంతంలో ఆ పార్టీకి ఆశించిన మైలేజ్ రావడంలేదని టాక్ మాత్రం నడుస్తుందట. గతంలో క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర చైర్మన్ గా పని చేసిన ఎంపీ పాకాలో ఉన్న అసంతృప్తిని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తారా లేక భవిష్యత్తులో తప్పులు జరగకుండా , సమన్వయ లోపం లేకుండా ఉండే విధంగా క్యాడర్ తో కలిసి చర్చిస్తారా.. లేక ఇదే తంతు కొనసాగిస్తారో….కాలమే సమాధానం చెప్పాలంటున్నారు కార్యకర్తలు.
- Tags
- MP Paka Satyanarayana
- ntv
- OTR
తాజావార్తలు
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?