Off The Record : శృంగవరపు కోటలో అవినీతి అధికారుల లీలలు.. ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కయి అక్రమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నియోజకవర్గంలో రాజకీయంగా భారీ వివాదం రేగుతోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు… స్థానిక ఎమ్మెల్యే అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. భూముల వ్యవహారాలు… లంచాల కేసులు… విదేశీ టూర్లు… ఇలా వరుస ఆరోపణలు వెలుగులోకి వస్తుండటంతో రాజకీయంగా హీట్ పెరిగింది. ఇంతకీ ఎవ్వరా ఎమ్మెల్యే.. ఎవ్వరా అధికారి.
విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం అవినీతి ఆరోపణలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పై తాజాగా తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మండలస్థాయిలో జరుగుతున్న అధికారుల అవినీతి వెనక ఎవరు ఉన్నారని ఆరా తీస్తే….చివరికి కొందరు ప్రజాప్రతినిధుల ఉన్నారని తెలుస్తోంది. ప్రత్యేకంగా వేపాడ మండలంలో పరిస్థితి మరింత వివాదాస్పదంగా మారింది. ఓ తహశీల్దారుతో కలిసి గుడివాడ ప్రాంతంలో 17 ఎకరాల భూమి వ్యవహారంలో పెద్దలు జోక్యం చేసుకుని భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు రైతుల నుంచే వస్తున్నాయి. మా భూమిని బలవంతంగా తీసుకోవాలని చూస్తున్నారు…మాకు న్యాయం కావాలి అని రైతులు ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు.
Also Read
ఇటీవల సింగరాయి వద్ద జరిగిన ఘటనలో ఒక వీఆర్వో లక్ష రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడిన విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఆ వీఆర్వో ఓ ప్రజాప్రతినిధికి బినామీగా పనిచేస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది. ఇంతటితో ఆగకుండా, ఒక ఎమ్మార్వో, ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. తప్పుడు సమాచారం ఇచ్చి లీవ్ తీసుకుని విదేశాలకు వెళ్లడం నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ అంశంపై కలెక్టర్కు అధికారులు నివేదిక సమర్పించినప్పటికీ, నేతల ఒత్తిడి కారణంగా ఎమ్మెల్యే ఒత్తిడి కారణంగా చర్యలు నిలిచిపోయాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, అవినీతి అధికారులను కఠినంగా ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి స్థాయిలో సూచనలు ఉన్నప్పటికీ స్థానికంగా మాత్రం భిన్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెబుతున్న సమయంలో స్థానికంగా ప్రజాప్రతినిధులే వారిని కాపాడుతున్నారన్న ఆరోపణలు రావడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. అంతేకాకుండా ఈ వ్యవహారాల వెనుక అక్రమార్జనలో వాటాలు ఉన్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే శృంగవరపుకోటలో అవినీతి ఆరోపణలు, రాజకీయ ఒత్తిళ్లు, అధికారుల వ్యవహారం అన్నీ కలిసిపోయి పెద్ద వివాదంగా మారాయి. ఈ ఆరోపణల్లో నిజానిజాలు ఏంటి…ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
- Tags
- mla kolal lalitha
- ntv
- OTR
తాజావార్తలు
-
Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
-
DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
-
INDIA alliance: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. జూన్ 8 సమావేశం బాయ్కాట్..
-
CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
-
Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!