Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Kaleshwaram

Off The Record : కాళేశ్వరం నివేదికపై తెలంగాణ సర్కార్ నిర్ణయం ఎలా ఉండబోతుంది?

Published Date :August 28, 2025 , 9:59 pm
By Gogikar Sai Krishna
  • ఈనెల 30న అసెంబ్లీ ముందుకు కాళేశ్వరం కమిషన్‌ రిపోర్ట్‌
  • నివేదికపై ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతోంది?
  • నాటి అధికారులు, మంత్రుల తప్పులు, ఆర్థిక అవకతవకల ప్రస్తావన
  • ఏసీబీకి అప్పగించే అవకాశం ఉందా?
  • ఇప్పటికే ఏసీబీ దగ్గర ఫార్ములా ఈ కేసు
  • రెండు కేసుల్ని దర్యాప్తు చేసేంత సిబ్బంది ఉన్నారా?
Off The Record : కాళేశ్వరం నివేదికపై తెలంగాణ సర్కార్ నిర్ణయం ఎలా ఉండబోతుంది?
  • Follow Us :
  • google news
  • dailyhunt

కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై తెలంగాణ సర్కార్‌ నిర్ణయం ఎలా ఉండబోతోంది? అసెంబ్లీలో చర్చించాక తదుపరి చర్యల మాటేంటి? ఏ తరహా ఎంక్వైరీ వేయబోతోంది? దర్యాప్తు అధికారాన్ని తన పరిధిలోనే ఉంచుకుంటుందా? లేక బీజేపీ డిమాండ్‌ చేస్తున్నట్టు సీబీఐకి అప్పగిస్తుందా? కాళేశ్వరం రిపోర్ట్ చుట్టూ వస్తున్న కొత్త డౌట్స్‌ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కుంగుబాటు పై.. తెలంగాణ ప్రభుత్వం విచారణ కమిషన్ వేసింది. ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తల్లో ఇదే విషయమై… అసెంబ్లీలో హాట్‌ హాట్‌ చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం మీద తప్పుడు ప్రచారం చేస్తోందన్న మాజీ మంత్రి హరీష్‌రావు కామెంట్స్‌కు స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి అప్పుడే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించారు. అలా వేసిన కమిషన్… అన్ని రకాల విచారణలు పూర్తిచేసి… ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దాని మీద కేబినెట్‌లో చర్చ జరిగింది.

కమిషన్‌ ఇచ్చిన పూర్తి నివేదికను సభలో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది సర్కార్‌. ఈ క్రమంలో…ఈ నెల 30న శాసనసభ సమావేశాలు మొదలవబోతున్నాయి. తొలి రోజునే… కమిషన్ నివేదికను సభ్యుల ముందుంచాలని డిసైడైంది ప్రభుత్వం. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో ప్రవేశపెడతారు. ఇంత వరకు బాగానే ఉన్నా… అసలు కమిషన్ నివేదికపై ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు బిగ్‌ క్వశ్చన్‌. కమిషన్ సూచించిన చర్యలను ఎలా అమలు చేయాలనుకుంటోందన్న చర్చ మొదలైంది. సభలో వివిధ పార్టీల నుంచి వచ్చిన అభిప్రాయాల ప్రకారం ముందడుగు వేయాలని నిర్ణయించినా… ఆ అడుగు ఎలా ఉండబోతోంది? ఇప్పుడు ప్రభుత్వ పెద్దల ఆలోచన ఎలా ఉందని మాట్లాడుకుంటున్నాయి రాజకీయవర్గాలు. సర్కార్‌కు అందిన నివేదికలో నాటి అధికారులు, మంత్రుల పొరపాట్లు… నిధుల దుర్వినియోగం..లాంటి ప్రధాన అంశాలు ఉన్నాయి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని.. ఏసీబీ విచారణకి ఆదేశించే అవకాశం ఉందన్నది ఒక వెర్షన్‌. ఇప్పటికే తెలంగాణ ACB దగ్గర ఫార్ములా ఈ రేస్‌ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన విచారణ నడుస్తోంది.

ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసును కూడా అప్పగిస్తే…రెండు పెద్ద కేసుల్ని దర్యాప్తు చేసేంత మంది సిబ్బంది ఆ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నారా అన్నది ప్రశ్నార్థకమే. ఇక రెండో ఆప్షన్.. అన్ని విభాగాల అధికారులతో కలిపి స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ను ఏర్పాటు చేయడం. కమిషన్ నివేదికపై సిట్‌ దర్యాప్తు చేయించే అవకాశం కూడా ఉందంటున్నారు. ఐతే…. ఒక ప్రతిపక్షం బీజేపీ మాత్రం సీబీఐ దర్యాప్తు కోసం పట్టుబడుతోంది. ఆ విషయంలో కొన్ని రాజకీయ అనుమానాలు ఉన్నాయట. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒకటేనని ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో.. ఇప్పుడు ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగిస్తే… పరిణామాలు ఎలా ఉంటాయోనన్న అనుమానం కాంగ్రెస్‌ ముఖ్యులకు ఉందట. ఆ విషయంలో తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం. కాంగ్రెస్‌లోనే కొందరు నేతలు కమిషన్ నివేదికపై… సీబీఐ దర్యాప్తు చేయిస్తేనే బెటర్ అని అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ సీబీఐ దర్యాప్తులో తేడా వస్తే….. బీజేపీ.. BRS మైత్రి ఇంకా బలపడుతుందని, ప్రజలకు కూడా ఇదే అంశంపై మరింత క్లారిటీ వచ్చినట్టవుతుందన్న చర్చ సైతం నడుస్తోంది పొలిటికల్‌ సర్కిల్స్‌లో. కేసును సీబీఐకి అప్పగిస్తే… బీజేపీ రంగు కూడా బయటపడుతుందన్నది కాంగ్రెస్‌లోని ఓ వర్గం వాదన. ఇలా రకరకాల వాదనలు నడుస్తున్న క్రమంలో… ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా… కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్యలన్నది మాత్రం రేవంత్ సర్కార్‌కి సవాలేనంటున్నారు రాజకీయ పరిశీలకులు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kaleshwaram
  • NTV Telugu
  • OTR

తాజావార్తలు

  • Trump: పశ్చిమాసియా యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఇరాన్ కౌంటర్ ఎటాక్

  • Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!

  • BrahMos Deal: భారత్ ‘బ్రహ్మోస్‌’పై ఇండోనేషియా దృష్టి.. త్వరలో కొనుగోలు ఒప్పందం.!

  • Kavitha Arrest: కవిత నిరాహార దీక్ష భగ్నం.. మరో 33 మందిపై కేసు.!

  • Off The Record: నూజివీడు నియోజకవర్గంలో మంత్రి పార్థసారథికి తలనొప్పులు

ట్రెండింగ్‌

  • Deep Sleep Tips : చిటికెలో గాఢ నిద్రలోకి జారుకోవాలంటే.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు..!

  • Kidney Stones in Children : తల్లిదండ్రులు ఈ తప్పు చేస్తే.. చిన్న పిల్లల్లోనూ కిడ్నీ రాళ్లు.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే.!

  • Late Night Hunger : అర్ధరాత్రి ఆకలి వేస్తుందా..? కారణం ఇదే అంటున్న డాక్టర్లు..!

  • Black Hair Tips : ఇక రంగు వేయాల్సిన పనిలేదు.. ఈ చిన్న విషయం తెలుసుకుంటే చాలు…!

  • IP54 రేటింగ్‌, 8.2mm మందంతో మార్చి 17న ‘Samsung Galaxy M17e 5G’ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions