Off The Record : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ గట్టి కసరత్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్కెచ్ సిద్ధం చేస్తోందా? దానికి సంబంధించి ఇప్పటికే క్షేత్ర స్థాయిలో యాక్టివిటీ మొదలైపోయిందా? షెడ్యూల్ కంటే ముందే… బ్యాటింగ్ మొదలుపెట్టాలని కాంగ్రెస్ పెద్దలు గట్టిగా ఫిక్స్ అయ్యారా? ఇంతకీ అక్కడ అధికార పార్టీ ప్లాన్ ఏంటి? ఎలా అమలు చేయాలనుకుంటోంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ…. ఆల్రెడీ యుద్ధానికి అవసరమైన అస్త్ర శస్త్రాలన్నిటినీ సిద్ధం చేసుకుంటోందట. ప్రస్తుతం ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటుకాగా… దాన్ని సొంతం చేసుకోవడం… అధికార పార్టీగా అత్యంత ముఖ్యమని భావిస్తున్నారట కాంగ్రెస్ పెద్దలు. జాతీయ అధ్యక్షుడు ఖర్గే కూడా ఇటీవల జరిగిన సమావేశంలో ఇదే విషయం చెప్పినట్టు తెలిసింది. పార్టీ, ప్రభుత్వం ఈ ఉప ఎన్నికను సవాల్గా తీసుకోవాలని ఆయన సూచించినట్టు సమాచారం.
అందుకే ఫుల్ ఫోకస్ పెట్టిన రాష్ట్ర పెద్దలు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఉప ఎన్నికకు పార్టీ ఇన్ఛార్జ్గా మంత్రి వివేక్ను ఇటీవలే ప్రకటించారు. అభ్యర్థి ఎవరైనా సరే… గెలిపించుకుని వచ్చే బాధ్యత అంతా… వివేక్దేనని క్లారిటీ ఇచ్చేసింది పీసీసీ. ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ కూడా జూబ్లీహిల్స్లో ఎన్నికల పనులు మొదలుపెట్టారు. సెప్టెంబర్లో ఎలక్షన్ ఉండవచ్చన్నది కాంగ్రెస్ పెద్దల అంచనా. అందుకోసం ఇప్పట్నుంచే కసరత్తు మొదలైంది. పరిధి పరంగా జూబ్లీహిల్స్ పెద్ద నియోజక వర్గం. దీంతో పార్టీ ఇచ్చిన సవాల్లో సత్తా చూపాలని భావిస్తున్నారట మంత్రులు. అందుకే నోటిఫికేషన్ రావడానికి ముందే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారట.
Also Read
సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బస్తీల్లో ఇతరత్రా డెవలప్మెంట్ యాక్టివిటీతో దూసుకుపోవాలనుకుంటున్నట్టు తెలిసింది. ఆ దిశలో ఇప్పటికే తొలి అడుగు పడగా… మంత్రులు వివేక్, పొన్నంతో పాటు తుమ్మల నాగేశ్వరరావు కూడా యాక్టివ్ పార్ట్ తీసుకుంటున్నారు. తాజాగా వెంగళరావు నగర్ గురుద్వార్ కమాన్ దగ్గర సీసీ రోడ్ల నిర్మాణం మొదలైంది. షేక్ పేట ఫ్లై ఓవర్ పిల్లర్ నంబర్ 4 దగ్గర క్రీడా ప్రాంగణం, కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన, పలు ప్రధాన రహదారులకు ఫుట్ పాత్ నిర్మాణాలకు శంకుస్థాపన లాంటి కార్యక్రమాలు జరిగాయి. ఇలా… మొత్తంగా ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చే నాటికి గ్రౌండ్లో పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మలుచుకునే పనిలో పడింది కాంగ్రెస్. ఇప్పటికే రేషన్ కార్డులు.. సన్నబియ్యం లాంటి పథకాలు జనంలోకి వెళ్లాయి. అటు పార్టీ నేతలకు పని విభజన చేసి డివిజన్స్ వారీగా బాధ్యతలు అప్పగించడం ద్వారా జనంలోకి వెళ్ళి జూబ్లీహిల్స్లో పాగా వేయాలన్నది కాంగ్రెస్ ప్లాన్గా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?