OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ అధిష్టానం పార్టీలో అత్యంత కీలకమైన ఆ వింగ్ని విస్మరించిందా? ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతున్న టైంలో… మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఆ విభాగం నారాజ్ అవుతోందా? అసలు మా ప్రమేయం లేకుండా పార్టీకి పోరాటాలు సాధ్యమేనా అంటున్న ఆ విభాగం ఏది? అంతలా ఫ్రస్ట్రేట్ అయిపోవడానికి కారణాలేంటి? తెలంగాణలో బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు అయ్యింది. దీంతో… ఇక రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజా పోరాటాలకు సిద్ధమవుతోంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, డిక్లరేషన్లను అమలు చేయాల్సిందేనంటూ పోరుబాట పట్టబోతోంది. ఇప్పటికే…. రైతు డిక్లరేషన్ అమలు డిమాండ్తో నిర్వహించిన సభ సక్సెస్ అయిందని భావిస్తున్న పార్టీ అధిష్టానం తాజాగా మరో అంశాన్ని ముందుకు తీసుకు వస్తోంది. ఎన్నికలకు ముందు రంగారెడ్డి జిల్లా సరూర్నగర్లో కాంగ్రెస్ పార్టీ చేసిన యూత్ డిక్లరేషన్ను వెంటనే అమలు చేయాలంటూ….దానిపై పోరాటానికి సిద్ధమవుతోంది ప్రతిపక్షం. వరంగల్లో లాగానే చలో సరూర్ నగర్ పేరుతో పెద్ద బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. యూత్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను మోసం చేసిందని, విద్యార్థులకు ఫీజు రీ ఇంబర్స్మెంట్ కూడా అమలు చేయలేదని విమర్శిస్తోంది బీఆర్ఎస్. ఇదే విషయాన్ని బహిరంగ సభ వేదిక ద్వారా చెబుతామని ప్రకటించారు పాత జీహెచ్ఎంసీ పరిధిలోని గులాబీ ఎమ్మెల్యేలు. అంత వరకు బాగానే ఉన్నా… అసలు సమస్య అక్కడే మొదలైంది. యూత్ డిక్లరేషన్ అమలుకోసం ప్రభుత్వం మీద చేయబోయే పోరాటంలో… యువతగా మా స్థానం ఎక్కడ అని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్ విద్యార్థి విభాగం.
ఆ పోరాటానికి సంబంధించిన సన్నాహక సమావేశం తాము లేకుండానే జరిగిపోయిందంటూ అసంతృప్తిగా ఉన్నారట బీఆర్ఎస్వీ నేతలు. యూత్ డిక్లరేషన్ పోరాటంలో ప్రధానంగా విద్యార్థులకు సంబంధించిన సమస్యలపైనే మాట్లాడాలి. అలాంటిది పార్టీకి సంబంధించిన విద్యార్థి సంఘం నేతలు లేకుండా ఎమ్మెల్యేలు సన్నాహక సమావేశం నిర్వహించడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. తెలంగాణ భవన్లో రెండు రోజుల క్రితం ఏర్పాటుచేసిన సమావేశంలో కేవలం సిటీ ఎమ్మెల్యేలు మాత్రమే పాల్గొన్నారు. తీసుకున్న నిర్ణయాలను ఆ తర్వాత మీడియా ముందు ప్రకటించారు. ఇక్కడే తమను ఎందుకు విస్మరించారని ప్రశ్నిస్తున్నారట బీఆర్ఎస్వీ నాయకులు. మెయిన్ మీటింగ్కు పిలవకున్నా… కనీసం మీడియా సమావేశానికైనా తమని పిలిస్తే బాగుండేదన్నది వాళ్ళ అభిప్రాయం. పార్టీకి సంబంధించి ఏ యాక్టివిటీ చేసినా… అందరికంటే ముందు ఉండేది విద్యార్థి విభాగమేనని, ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న విద్యార్థి నేతల మీద ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు కూడా నమోదయ్యాయని గుర్తు చేస్తున్నారు. అలా కేసులకు, పోరాటాలకు మమ్మల్ని పంపించి పార్టీ తీసుకునే కీలక నిర్ణయాల్లో మాత్రం భాగస్వామ్యం లేకుండా చేస్తారా అని మండిపడుతున్నట్టు సమాచారం. అయితే ఇది యూత్ డిక్లరేషన్కు సంబంధించిన అంశం కాబట్టి పార్టీ యూత్ వింగ్నే పిలిచామని, విద్యార్థి విభాగానికి సంబంధించిన కొందరు నేతలకు ఫోన్ చేసినప్పటికీ అందుబాటులో లేరని చెబుతున్నారు శాసనసభ్యులు. అయితే….ఇదే అంశంపై ఈనెల 30న కేటీఆర్ సమక్షంలో జరిగే సన్నాహక సమావేశానికి మమ్మల్ని కచ్చితంగా పిలవాల్సిందేనని డిమాండ్ చేస్తోంది విద్యార్థి విభాగం. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటంలో పార్టీ నుంచి స్టూడెంట్స్ వింగే ముందుంటుందని, అలాంటిది తమకు తెలియకుండా కార్యక్రమం జరగడం బాధగా ఉందని అంటున్నారు విద్యార్థి నాయకులు.
Also Read
- OTR : సంగారెడ్డి బీజేపీలో పెరుగుతున్న గ్రూప్ వార్.. చినికి చినికి గాలి వానలా మారుతున్నా వివాదాలు
- OTR : అక్కడ టిడిపి గట్టిగా మైండ్ గేమ్ ఆడిందా.. వైసీపీ లీడర్స్ కూడా ఆ ట్రాప్ లో పడిపోయారా?
- Off The Record : కామారెడ్డి మున్సిపాలిటీలో రచ్చ రంబోలా.. ఎమ్మెల్యే vs చైర్ పర్సన్ వివాదం
- OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
- Tags
- BRS
- NTV Telugu
- off the record
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
-
Sun Risers Hyderabad: పెవిలియన్కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. కుప్పకూలిన టాప్ ఆర్డర్స్..
-
CM Vijay: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో విజయ్ భేటీ.. తమిళనాడు అంశాలపై చర్చ
-
Ragi Ponganalu: మహిళలకు అమృతం లాంటిది.. ఐరన్, క్యాల్షియం కావాలంటే వారంలో రెండుసార్లు ఇవి తినండి!
-
Vaibhav Sooryavanshi: సెంచరీ మిస్పై సంచలన కామెంట్స్ చేసిన వైభవ్ సూర్యవంశీ.. నా మైండ్లో ఉన్నది అదే అంటూ..
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!