Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Heavy Deamd For Ysrcp Tickets

Off The Record: వైసీపీలో ఆ టికెట్ దక్కేది ఎవరికి?

Published Date :February 15, 2023 , 8:44 pm
By NTV WebDesk
Off The Record: వైసీపీలో ఆ టికెట్ దక్కేది ఎవరికి?
  • Follow Us :
  • google news
  • dailyhunt

టికెట్‌ తెచ్చుకుంటే చాలు.. పోటీ చేసి గెలిచి ఈజీగానే చట్ట సభలో అడుగు పెట్టేయొచ్చు. లెక్కలు పక్కాగా ఉండటంతో అక్కడ నేతల ఆశలు కూడా బలంగానే ఉన్నాయి. కాకపోతే సామాజిక సమీకరణాలే అధికారపార్టీలో ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. అదెక్కడో ఈ స్టోరీలో చూద్దాం.

కుల సమీకరణాలే అభ్యర్థుల ఎంపికలో కీలకం
ఉమ్మడి శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లోని అధికార వైసీపీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు చర్చగా మారుతున్నాయి. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు ప్లేస్‌లో శ్రీకాకుళంలోనూ.. మరో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు స్థానంలో తూర్పుగోదావరి జిల్లాలోనూ MLC ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రెండు సీట్లు తాజా ఎన్నికల్లో వైసీపీ ఖాతాలో పడబోతున్నాయి. అందుకే టికెట్‌ దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు వైసీపీలోని ఆశావహ నేతలు. అయితే సామాజిక సమీకరణాలు కీలకం కాబోతున్నాయనే చర్చలో ఎవరు నిలుస్తారు.. ఎవరు గెలుస్తారు అనేది ఉత్కంఠగా మారింది.

శ్రీకాకుళం జిల్లాలో తూర్పుకాపులకు ప్రాధాన్యం?
శ్రీకాకుళం జిల్లాలో లీడింగ్‌ కమ్యూనిటీలు కాలింగ, వెలమ, తూర్పుకాపు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కాలింగులకే ప్రాధాన్యం దక్కింది. స్పీకర్‌ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, జడ్పీ ఛైర్మన్‌ పిరియా విజయలక్ష్మిలు కాలింగ సామాజికవర్గమే. మంత్రి ధర్మాన ప్రసాదరావు వెలమ సామాజికవర్గం. డీసీసీబీ ఛైర్మన్‌ రాజేశ్వరరావు తూర్పుకాపు. దీంతో సామాజిక కోణంలో ఎమ్మెల్సీ టికెట్‌ తూర్పు కాపులకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ బీసీలకే టికెట్‌ ఇవ్వాలని అనుకుంటే.. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ నర్తు రామారావు, తదితరుల పేర్లు పరిశీలించొచ్చని చెబుతున్నారు. ఉత్తరాంధ్రలో వెలమ, తూర్పు కాపు కులాలు బలమైన సామాజికవర్గాలు కావడంతో.. రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకునే అభ్యర్థి ఎంపిక ఉంటుందని సమాచారం.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమకు ఎమ్మెల్సీ సీటు?
ఇక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి ఆల్‌రెడీ వైసీపీ ఖాతాలో ఉంది. అనంత ఉదయబాబు శాసనమండలి సభ్యుడు. టీడీపీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు పదవీకాలం ఈ ఏడాది మే వరకు ఉంది. ఖాళీ కాబోతున్న చిక్కాల ప్లేస్‌లోనే ఇప్పుడు ఎన్నిక ఉండనుంది. ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల MLC కోటాలో మొత్తం ఓటర్లు దాదాపు రెండు వేల వరకు ఉన్నారు. ఈ దఫా కోనసీమ ప్రాంతానికి చెందిన వారికి ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది.

శెట్టిబలిజలను ప్రసన్నం చేసుకునే ఎత్తుగడ..?
శెట్టిబలిజలకు ఎమ్మెల్సీ ఆఫర్‌ చేస్తారని ప్రచారం జరుగుతోంది. శెట్టిబలిజ సంఘం నేత కుడుపూడి సూర్యనారాయణరావు, ఇదే సంఘానికి చెందిన యువ నేత వాసంశెట్టి సుభాష్‌తోపాటు MRPS నాయకుడు బొమ్మి ఇజ్రాయెల్‌ పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తోందట. అమలాపురం అల్లర్ల తర్వాత శెట్టిబలిజ యువకులపై కేసులు పెట్టడంతో వాళ్లంతా గుర్రుగా ఉన్నారు. దాంతో ఆ వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు కుడుపూడి లేదా వాసంశెట్టిలకు ఛాన్స్‌ ఇస్తారని సమాచారం. వాసంశెట్టి కోసం ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే మంత్రులు విశ్వరూప్‌, వేణుగోపాలకృష్ణ వ్యతిరేకిస్తున్నారట. అమలాపురం అల్లర్ల తర్వాత కాపులు, శెట్టిబలిజల్లో ఐక్యత వచ్చి కొత్త సమీకరణాలకు తెరలేచింది. రానున్న ఎన్నికల్లో SC రిజర్డ్వ్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాదిగ సామాజికవర్గానికి చెందిన వాళ్లకు మద్దతు తెలియజేయాలని కాపు, శెట్టిబలిజలు నిర్ణయించాయి. దాంతో మాదిగలను దగ్గర చేసుకునేందుకు ఇజ్రాయెల్‌ను ఎంపిక చేస్తారనే వాదనా ఉంది. మొత్తానికి రెండు జిల్లాల్లోనూ కుల సమీకరణాలే అభ్యర్థుల ఎంపికలో కీలకం కాబోతున్నాయి.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • cm jagan
  • east godavari
  • off the record
  • YSRCP

తాజావార్తలు

  • Arjun Tendulkar Wedding: పెళ్లితో ఒక్కటైన అర్జున్-సానియా జంట.. హాజరైన ప్రముఖులు

  • KTR: అలా చేసినట్లయితే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా!

  • Bihar: బీహార్ సీఎంగా బీజేపీ వ్యక్తి.. జేడీయూకు రెండు డిప్యూటీ సీఎం పోస్ట్‌లు!

  • Karthik Dandu : చైతూకి కెరీర్ హిట్ ఇస్తా..అక్కినేని ఫ్యాన్స్‌కు డైరెక్టర్ కార్తీక్ ప్రామిస్..

  • Rajya Sabha Nominations: రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్‌ మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు

ట్రెండింగ్‌

  • Summer Alert : శరీరంలో నీరు తగ్గిందని తెలిపే ‘రెడ్ ఫ్లాగ్’ లక్షణాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే డేంజరే..!

  • Karnataka Special Carrot Palya : నిమిషాల్లో తయారయ్యే హెల్తీ రెసిపీ.. టేస్ట్ అదిరిపోతుంది.!

  • Panakam Recipe: తక్షణ శక్తి కోసం శ్రీరామ నవమి పానకం.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

  • Stomach Pain After Eating: తిన్న వెంటనే కడుపు నొప్పా..? ఈ 5 కారణాలు తెలిస్తే షాక్ అవుతారు!

  • Stock Market: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. బిక్కుబిక్కుమంటున్న మదుపరులు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions