Off The Record: మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డికి వింత కష్టం..!
- తీవ్ర గందరగోళంలో తోపుదుర్తి ప్రకాష్రెడ్డి..
- రాప్తాడు నియోజకవర్గంలో మొత్తం ఆరు మండలాలు..
- మూడు అనంతపురం, మరో మూడు శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో..
- మాజీ అయ్యాక పరిధి సమస్యలతో తోపుదుర్తి సతమతం..
- శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో కార్యక్రమాల నిర్వహణ..
- అనంతపురంలోని మూడు మండలాల సంగతేంటన్న ప్రశ్న..
- అనంతపురం పార్టీ ఆఫీస్లో ప్రెస్మీట్కు తోపుదుర్తి ప్రయత్నం..
- జిల్లా అధ్యక్షుడి పర్మిషన్ లేకుంటే నో అన్న ఆఫీస్ మేనేజర్..
- ధర్మవరంలో తన ఆఫీస్ పెట్టుకునేందుకు తోపుదుర్తి ప్రయత్నం..
- నా నియోజకవర్గంలో ఎలాగంటూ కేతిరెడ్డి అభ్యంతరం..
- పార్టీ నేతలే ప్లాన్ ప్రకారం ఒక ప్రాంతానికి పరిమితం చేస్తున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: నియోజకవర్గాల పునర్విభజన జరిగితే…. ఏ నాయకుడు ఎక్కడ ఉంటాడో, ఎవరి నియోజకవర్గం ఎలా మారుతుందో తెలియదుగానీ….అలాంటిదేం జరక్కుండానే… తన భవిష్యత్ ఏంటో అర్ధంగాక గందరగోళంలో ఉన్నారట రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి. ప్రస్తుతం తాను ఏజిల్లాలో ఉండాలో తేల్చుకోలేక సతమతం అవుతున్నారాయన. తాను మనసు పడ్డ చోట వైసీపీ నాయకులు నో ఎంట్రీ బోర్డ్ పెట్టేయడంతో ఏం బాధలురా… బాబూ…. అంటూ తల పట్టుకుంటున్నట్టు సమాచారం. భౌగోళికంగా రాప్తాడు నియోజకవర్గానిది విచిత్రమైన పరిస్థితి. ఇక్కడ మొత్తం ఆరు మండలాలు ఉంటే…. మూడు శ్రీ సత్యసాయి జిల్లాలో, మరో మూడు మండలాలు అనంతపురం జిల్లాలో ఉన్నాయి. సరిగ్గా ఇక్కడే సమస్య వచ్చి పడుతోందట తోపుదుర్తికి. అధికారంలో ఉన్నన్నాళ్ళు ఇదేమంత సమస్య అనిపించకున్నా… పవర్ పోయాక సహజంగానే పరిస్థితులు, ప్రయారిటీస్ మారతాయి కాబట్టి ప్రకాష్రెడ్డి కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలు, ఇతర వ్యవహారాలను ఏ జిల్లాకు ఆ జిల్లాలో విడివిడిగా చేసుకోవాల్సి వస్తోంది. ఇదంతా మాజీ ఎమ్మెల్యేకి ఇబ్బందికరంగా మారిందట. నియోజకవర్గ పరంగా తన కార్యకలాపాలను ఎక్కడి నుంచి నిర్వహించాలన్న కన్ఫ్యూజన్ వస్తోంది. వైసీపీ రాష్ట్ర కమిటీ ఏదైనా పిలుపునిస్తే శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో నిర్వహిస్తున్నారాయన.
అదే సమయంలో అనంతపురం పరిధిలోని మూడు మండలాల సంగతేంటన్న ప్రశ్న వస్తోంది. వాస్తవానికి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి నియోజకవర్గ స్థాయి కార్యాలయం ఎక్కడా లేదు. ఇక మండల కేంద్రాల సంగతి చెప్పే పనేలేదు. దీంతో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఏ సమావేశం నిర్వహించాల్సి వచ్చినా.. తన ఇంటినో, లేదా ఏదైనా ఫంక్షన్ హాల్నో ఎంచుకునేవారు. ఇక అప్పట్లో అధికారికంగా పార్టీ కార్యక్రమాలు ఏమైనా నిర్వహించాలంటే అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయానికి వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కనీసం ప్రెస్మీట్ పెట్టుకునేందుకు కూడా అవకాశం లేకుండా పోయిందట. ఇటీవల తాను ప్రెస్మీట్ పెట్టాలని చూడగా… అక్కడ ఉన్న ఒక మేనేజర్ జిల్లా అధ్యక్షుడి అనుమతి తీసుకోవాలని సూచించినట్టు సమాచారం. దీంతో… పార్టీ ఆఫీస్ ప్రతిపాదన విరమించుకుని తన ఇంట్లోనే కార్యక్రమం ముగించేశారాయన. అనంతపురం సంగతి అలా ఉంటే… ఇటు శ్రీ సత్యసాయి జిల్లాలో కూడా అవే సమస్యలు వస్తున్నాయట. అసలు ఇక్కడ జిల్లా పార్టీ కార్యాలయం ఇప్పటివరకు ఏర్పాటవలేదు. ఇటు పార్టీ ఆఫీస్ లేక, అటు నియోజకవర్గ కార్యాలయం లేక ఎక్కడికి వెళ్లాలన్నది అర్థంకాని పరిస్థితి తోపుదుర్తిది. చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి, రామగిరి మండలాల్లో నాయకులకు టచ్లో ఉండాలంటే అనంతపురంలోని తన నివాసమే కేంద్రంగా మారిపోయింది.
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
దీంతో ఈ సమస్యను అధిగమించడానికి ఆయన ఇటీవల ధర్మవరంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తానన్న ప్రతిపాదన తెర పైకి తీసుకొచ్చారు. కానీ…అది ఇంకో వివాదానికి దారితీసింది. ధర్మవరానికి రామగిరి, చెన్నే కొత్తపల్లి, కనగానపల్లి మండలాలు చాలా దగ్గరగా ఉంటాయి. అక్కడి ప్రజలు కూడా ఆర్డీఓ కార్యాలయం కోసం అక్కడికే వస్తుంటారు.. దీంతో తనకు కూడా ధర్మవరం అయితే సుఖంగా ఉంటుందని భావించారట ప్రకాష్రెడ్డి. కానీ… ఆ ప్రతిపాదనపై అక్కడి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నా నియోజకవర్గంలో మరో నేత ఆఫీస్ ఏంటన్నది ఆయన అభ్యంతరం. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న సర్పంచ్ల సన్మాన సభలో సొంత పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. ఇటీవల అనంతపురం జిల్లాలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి… కీలక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలకు వైసీపీ నాయకులు హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి ప్రకాష్ రెడ్డిని ఆహ్వానించలేదన్న ప్రచారం జరుగుతోంది. అనంతపురం జిల్లా పరిధిలో రాప్తాడు నియోజకవర్గం మండలాలు మూడు ఉన్నా…ఆ నియోజకవర్గ సమన్వయకర్త ప్రకాష్ రెడ్డిని మాత్రం ఆహ్వానించలేదు. దీన్నిబట్టి చూస్తుంటే…. జిల్లా వైసీపీ నాయకులే తోపుదుర్తిని పథకం ప్రకారం ఒక ప్రాంతానికే పరిమితం చేస్తున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయంటున్నారు పరిశీలకులు.
తాజావార్తలు
-
Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
-
ZIM vs IND: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. 19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ!
-
Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
-
Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
-
Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?