Off The Record: మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డికి వింత కష్టం..!
- తీవ్ర గందరగోళంలో తోపుదుర్తి ప్రకాష్రెడ్డి..
- రాప్తాడు నియోజకవర్గంలో మొత్తం ఆరు మండలాలు..
- మూడు అనంతపురం, మరో మూడు శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో..
- మాజీ అయ్యాక పరిధి సమస్యలతో తోపుదుర్తి సతమతం..
- శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో కార్యక్రమాల నిర్వహణ..
- అనంతపురంలోని మూడు మండలాల సంగతేంటన్న ప్రశ్న..
- అనంతపురం పార్టీ ఆఫీస్లో ప్రెస్మీట్కు తోపుదుర్తి ప్రయత్నం..
- జిల్లా అధ్యక్షుడి పర్మిషన్ లేకుంటే నో అన్న ఆఫీస్ మేనేజర్..
- ధర్మవరంలో తన ఆఫీస్ పెట్టుకునేందుకు తోపుదుర్తి ప్రయత్నం..
- నా నియోజకవర్గంలో ఎలాగంటూ కేతిరెడ్డి అభ్యంతరం..
- పార్టీ నేతలే ప్లాన్ ప్రకారం ఒక ప్రాంతానికి పరిమితం చేస్తున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: నియోజకవర్గాల పునర్విభజన జరిగితే…. ఏ నాయకుడు ఎక్కడ ఉంటాడో, ఎవరి నియోజకవర్గం ఎలా మారుతుందో తెలియదుగానీ….అలాంటిదేం జరక్కుండానే… తన భవిష్యత్ ఏంటో అర్ధంగాక గందరగోళంలో ఉన్నారట రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి. ప్రస్తుతం తాను ఏజిల్లాలో ఉండాలో తేల్చుకోలేక సతమతం అవుతున్నారాయన. తాను మనసు పడ్డ చోట వైసీపీ నాయకులు నో ఎంట్రీ బోర్డ్ పెట్టేయడంతో ఏం బాధలురా… బాబూ…. అంటూ తల పట్టుకుంటున్నట్టు సమాచారం. భౌగోళికంగా రాప్తాడు నియోజకవర్గానిది విచిత్రమైన పరిస్థితి. ఇక్కడ మొత్తం ఆరు మండలాలు ఉంటే…. మూడు శ్రీ సత్యసాయి జిల్లాలో, మరో మూడు మండలాలు అనంతపురం జిల్లాలో ఉన్నాయి. సరిగ్గా ఇక్కడే సమస్య వచ్చి పడుతోందట తోపుదుర్తికి. అధికారంలో ఉన్నన్నాళ్ళు ఇదేమంత సమస్య అనిపించకున్నా… పవర్ పోయాక సహజంగానే పరిస్థితులు, ప్రయారిటీస్ మారతాయి కాబట్టి ప్రకాష్రెడ్డి కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలు, ఇతర వ్యవహారాలను ఏ జిల్లాకు ఆ జిల్లాలో విడివిడిగా చేసుకోవాల్సి వస్తోంది. ఇదంతా మాజీ ఎమ్మెల్యేకి ఇబ్బందికరంగా మారిందట. నియోజకవర్గ పరంగా తన కార్యకలాపాలను ఎక్కడి నుంచి నిర్వహించాలన్న కన్ఫ్యూజన్ వస్తోంది. వైసీపీ రాష్ట్ర కమిటీ ఏదైనా పిలుపునిస్తే శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో నిర్వహిస్తున్నారాయన.
అదే సమయంలో అనంతపురం పరిధిలోని మూడు మండలాల సంగతేంటన్న ప్రశ్న వస్తోంది. వాస్తవానికి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి నియోజకవర్గ స్థాయి కార్యాలయం ఎక్కడా లేదు. ఇక మండల కేంద్రాల సంగతి చెప్పే పనేలేదు. దీంతో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఏ సమావేశం నిర్వహించాల్సి వచ్చినా.. తన ఇంటినో, లేదా ఏదైనా ఫంక్షన్ హాల్నో ఎంచుకునేవారు. ఇక అప్పట్లో అధికారికంగా పార్టీ కార్యక్రమాలు ఏమైనా నిర్వహించాలంటే అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయానికి వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కనీసం ప్రెస్మీట్ పెట్టుకునేందుకు కూడా అవకాశం లేకుండా పోయిందట. ఇటీవల తాను ప్రెస్మీట్ పెట్టాలని చూడగా… అక్కడ ఉన్న ఒక మేనేజర్ జిల్లా అధ్యక్షుడి అనుమతి తీసుకోవాలని సూచించినట్టు సమాచారం. దీంతో… పార్టీ ఆఫీస్ ప్రతిపాదన విరమించుకుని తన ఇంట్లోనే కార్యక్రమం ముగించేశారాయన. అనంతపురం సంగతి అలా ఉంటే… ఇటు శ్రీ సత్యసాయి జిల్లాలో కూడా అవే సమస్యలు వస్తున్నాయట. అసలు ఇక్కడ జిల్లా పార్టీ కార్యాలయం ఇప్పటివరకు ఏర్పాటవలేదు. ఇటు పార్టీ ఆఫీస్ లేక, అటు నియోజకవర్గ కార్యాలయం లేక ఎక్కడికి వెళ్లాలన్నది అర్థంకాని పరిస్థితి తోపుదుర్తిది. చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి, రామగిరి మండలాల్లో నాయకులకు టచ్లో ఉండాలంటే అనంతపురంలోని తన నివాసమే కేంద్రంగా మారిపోయింది.
Also Read
- Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
- Off The Record: ఖమ్మంలో కలకలం.. గాయత్రి రవి కంపెనీలపై వరుస దాడులు ఎందుకు?
- Off The Record: నల్గొండ కాంగ్రెస్లో ఓపెన్ వార్.. ఫ్లెక్సీల చించివేతతో రచ్చ రచ్చ!
- Off The Record: మళ్లీ యాక్టివ్ అయిన చెవిరెడ్డి.. జగన్ కొత్త వ్యూహమా?
దీంతో ఈ సమస్యను అధిగమించడానికి ఆయన ఇటీవల ధర్మవరంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తానన్న ప్రతిపాదన తెర పైకి తీసుకొచ్చారు. కానీ…అది ఇంకో వివాదానికి దారితీసింది. ధర్మవరానికి రామగిరి, చెన్నే కొత్తపల్లి, కనగానపల్లి మండలాలు చాలా దగ్గరగా ఉంటాయి. అక్కడి ప్రజలు కూడా ఆర్డీఓ కార్యాలయం కోసం అక్కడికే వస్తుంటారు.. దీంతో తనకు కూడా ధర్మవరం అయితే సుఖంగా ఉంటుందని భావించారట ప్రకాష్రెడ్డి. కానీ… ఆ ప్రతిపాదనపై అక్కడి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నా నియోజకవర్గంలో మరో నేత ఆఫీస్ ఏంటన్నది ఆయన అభ్యంతరం. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న సర్పంచ్ల సన్మాన సభలో సొంత పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. ఇటీవల అనంతపురం జిల్లాలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి… కీలక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలకు వైసీపీ నాయకులు హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి ప్రకాష్ రెడ్డిని ఆహ్వానించలేదన్న ప్రచారం జరుగుతోంది. అనంతపురం జిల్లా పరిధిలో రాప్తాడు నియోజకవర్గం మండలాలు మూడు ఉన్నా…ఆ నియోజకవర్గ సమన్వయకర్త ప్రకాష్ రెడ్డిని మాత్రం ఆహ్వానించలేదు. దీన్నిబట్టి చూస్తుంటే…. జిల్లా వైసీపీ నాయకులే తోపుదుర్తిని పథకం ప్రకారం ఒక ప్రాంతానికే పరిమితం చేస్తున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయంటున్నారు పరిశీలకులు.
తాజావార్తలు
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
JR NTR : ఎన్టీఆర్ లైనప్లో ఊహించని ట్విస్ట్.. స్టార్ డైరెక్టర్తో సినిమా రెండేళ్లు పోస్ట్పోన్
-
Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
-
Anantapur Murder: 20 రూపాయల కోసం గొడవ.. సర్ది చెప్పేందుకు వెళ్లిన వ్యక్తిని కొట్టి చంపిన మామా-అల్లుడు!
-
RaviTeja : ఒకటి కాదు రెండు.. థియేటర్ దద్దరిల్లిపోద్ది
ట్రెండింగ్
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!