Off The Record: ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలేం జరుగుతుంది..? కేసు ఎటుపోతోంది..?
- ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుపై సిట్కు అనుమానాలున్నాయా?..
- వరుసబెట్టి బాధితుల్ని పిలవడం వెనక రీజన్స్ ఉన్నాయా?..
- ఆధారాలు వీక్గా ఉండటం వల్లే అదనపు వాంగ్మూలాలా?..
- సిట్ బృందం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటోందా?..
- కేసు దర్యాప్తులో హార్డ్ డిస్క్లు కీలకం..
- హార్డ్ డిస్క్లు కట్ చేసి మూసీలో వేసిన నిందితులు..
- రికవర్ చేసినా నిలబడుతుందా అన్న డౌట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో ఎప్పటికప్పడు కొత్త కొత్త ట్విస్ట్లు పెరుగుతూనే ఉన్నాయి. అందుకు తగ్గట్టు సిట్ కూడా కానూన్ కే హాత్ బహుత్ లంబే హోతేహై… అన్నట్టుగా ఎప్పటికప్పుడు సెట్ చేసుకుంటూనే ఉంది. కానీ… తాజాగా జరుగుతున్న పరిణామాలు మాత్రం సిట్ బృందానికి కూడా ఎక్కడో డౌట్ ఉందా అన్న అనుమానాల్ని పెంచుతున్నాయట. ఎందుకంటే… వరుసబెట్టి బాధితులందర్నీ పిలిచి విచారిస్తున్నారు అధికారులు. మామూలుగా అయితే… అంత సీన్ అవసరం లేదన్నది నిపుణుల అభిప్రాయం. కానీ… ఈ కేసులో ఆధారాలు వీక్గా ఉండటం వల్లే… అదనపు బలం కోసం ఇలా బాధితుల వాంగ్మూలాలను భారీ ఎత్తున తీసుకుంటున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయట. గత ఎన్నికల సమయంలో ఒక్క నవంబర్లోనే 618 మంది ఫోన్స్ను ట్యాప్ చేసిందట ప్రభాకర్ రావు అండ్ గ్యాంగ్. ఇప్పుడు వాళ్ళందర్నీ పిలిచి ఎందుకు స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారంటే.. ఎక్స్ట్రా కేర్ అన్న సమాధానం వస్తోందట దర్యాప్తు బృందం నుంచి. ఈ కేసులో సిట్ దర్యాప్తునకు ప్రధాన ఆధారం హార్డ్ డిస్క్లు. వాటన్నిటినీ ప్రణీత్రావు కట్ చేసి మూసీలో పడేశారన్న అభియోగాలున్నాయి. మూసీ నుంచి అధికారులు వాటిని రికవరీ చేసుకున్నారు కూడా.
Read Also: CEIR Portal: ఫోన్ పోయిందా నో టెన్షన్..? జస్ట్ ఈ పోర్టల్లో వివరాలు నమోదు చేయండి..
Also Read
కానీ… హార్డ్ డిస్క్ల్లోని సమాచారం పూర్తిగా ఉందా? ఒకవేళ ఉన్నా…ఈ పరిస్థితుల్లో అది కోర్ట్లో నిలబడుతుందా అన్న అనుమానాలు పెరుగుతున్నాయట. ఒకవేళ నిలబడకుంటే… కేసు వీక్ అవకుండా ముందు జాగ్రత్త కోసమే బాధితుల వాంగ్మూలాలను రికార్డ్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ కేసులో ఇప్పటికి ముగ్గురు పోలీస్ అధికారులను అరెస్ట్ చేశారు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఎంతవరకు నిలుస్తాయన్న ప్రశ్నలు సైతం ఉన్నాయి. ఇన్ని అనుమానాల మధ్య కేసు వీగిపోకుండా… పకడ్బందీగా దోషులకు శిక్ష పడాలంటే… అదనపు బలం అవసరమని భావిస్తున్న దర్యాప్తు అధికారులు బాధితుల్ని పిలుస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. రేపటి రోజున మిగతావన్నీ వీగిపోయినా… వీళ్ళే ప్రధాన సాక్షులు అవుతారని నమ్ముతున్నారట అధికారులు. పొలోమని వందల మందిని ఎందుకు పిలుస్తున్నారయ్యా… అంటే… అందుకూ ఓ రీజన్ ఉందట. మొత్తం 618 మందిని పిలిస్తే… కోర్టు టయల్కు కొందరు హాజరవకున్నా… మిగతా వాళ్ళు సరిపోతారని అనుకుంటున్నట్టు సమాచారం. వాళ్ళందరిలో కనీసం పదిమంది అనుకూలంగా సాక్ష్యం చెప్పినా కేసు నిలబడుతుందన్నది సిట్ భావనగా తెలుస్తోంది. ముందు ముందు ఎలాంటి ట్విస్ట్లు ఉంటాయో చూడాలి మరి.
తాజావార్తలు
-
NEET Exam: రేపే నీట్ ఎగ్జామ్.. ఈసారైనా పగడ్బందీగా జరిగేనా?
-
Rohit Sharma: హిట్మ్యాన్ హిస్టరీ.. సెహ్వాగ్ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. చరిత్రలో ఒకే ఒక్కడిగా..
-
APL 2026: మంగళగిరిలో ఏపీఎల్ జోష్.. సెమీస్, ఫైనల్కు భారీ ఏర్పాట్లు
-
Israel-Lebanon: శాంతి ఒప్పందానికి తూట్లు.. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు
-
Ex-Terrorist: ఉగ్రవాదుల జేబుల్లో కండోమ్, ప్రేమ లేఖలు..ధురంధర్లో చూపించి నిజమే: మాజీ ఉగ్రవాది..
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!