Off The Record: ఏఐసీసీ కోటాలోకే తెలంగాణ రాజ్యసభ సీటు..?
- బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి కేకే..
- పార్టీ మారాక రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా..
- కాంగ్రెస్ కోటాలో ఎవరికి ఇస్తారన్న చర్చ..
- ఎదురు చూస్తున్న తెలంగాణ కాంగ్రెస్ సీనియర్స్..
- ఏఐసీసీ కోటాలో భర్తీ చేస్తారన్న టాక్..
- అభిషేక్ మనుసింఘ్విని రాజ్యసభకు పంపాలని డిసైడ్..
- తెలంగాణ కోటాలోనే సింఘ్విని పంపుతారా?..
Off The Record: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన సీనియర్ నాయకుడు కే కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. పార్టీ మారినందున నైతికతకి కట్టుబడి.. బీఆర్ఎస్ తరపున వచ్చిన రాజ్యసభ సీటుని కూడా వదులుకుంటున్నానని చెప్పేశారాయన. ఆ తర్వాత ఆయన్ని సలహాదారుగా నియమించింది కాంగ్రెస్ సర్కార్. అంతవరకు ఓకే.. ఎమ్మెల్యేల సంఖ్య దృష్ట్యా ప్రస్తుతం కాంగ్రెస్ కోటాలోకి వచ్చే ఆ సీటును ఇప్పుడు ఎవరికి ఇస్తారన్న చర్చ జోరుగా జరుగుతోంది గాంధీభవన్ వర్గాల్లో.. అసలు కేశవరావుతో రాజీనామా చేయించడం వెనక ఉద్దేశ్య ఏంటన్న ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ లో చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు. వి.హనుమంతరావు, కోదండ రెడ్డి లాంటి వారంతా రాజ్యసభ కోసం క్యూలో ఉన్నారు. కానీ… అక్కడే ఇంకో డౌట్ కొడుతోందట. రాష్ట్ర నాయకులు సీటు ఆశించడం వరకు ఓకేగానీ.. అదసలు స్టేట్ కోటాకు వస్తుందా? లేక ఏఐసీసీ కోటాలో భర్తీ చేస్తారా అన్న చర్చ మొదలైంది.
Read Also: Warangal: ఎంజీఎంలో దారుణం.. నాలుగు రోజుల పసికందును పీక్కుతిన్న కుక్కలు
Also Read
ఎక్కువ శాతం అది ఢిల్లీ కోటాకే వెళ్లవచ్చంటున్నాయి పార్టీ వర్గాలు. సీనియర్ లీడర్ అభిషేక్ మనుసింఘ్విని రాజ్యసభకి పంపాలని డిసైడైంది కాంగ్రెస్ హైకమాండ్. ఆయన్ని తెలంగాణ కోటాలోనే పంపవచ్చని అంటున్నారు. అదే నిజమైతే మరో రకమైన సమస్య మొదలు కావచ్చన్నది ఇక్కడి నేతల అభిప్రాయం. పార్టీ అధికారంలోకి వచ్చాక ఇప్పటికే రాష్ట్రంలో వివిధ పదవుల కోసం ఆశావహుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో… తెలంగాణకి వచ్చే రాజ్యసభ సీటును ఇక్కడి వారికి కాకుండా ఢిల్లీ కోటాకు అప్పగిస్తే.. తప్పుడు సంకేతాలు వెళ్ళవచ్చన్న భయం కూడా ఉందట. తెలంగాణ నేతల అవకాశాలను దెబ్బతీశారన్న అపవాదును సైతం భరించాల్సి వస్తుందన్న భయం ఉన్నట్టు తెలిసింది.
Read Also: MLC Duvvada Srinivas House: ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి దగ్గర మళ్లీ టెన్షన్..
దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ అధిష్టానం ఇక్కడి సీనియర్ నేతలుగానీ, ఎన్నికల్లో కష్టపడిన వారి పేర్లను కానీ పరిశీలిస్తుందా.. లేక వాళ్ళ నిర్ణయమే ఫైనల్ అవుతుందా అన్నది చూడాలంటున్నారు పార్టీ నేతలు. రాష్ట్ర కోటాలో ఇతర రాష్ట్రాల నాయకులకు ఛాన్స్ ఇస్తే… ప్రతిపక్షాలకు అస్త్రం దొరికినట్టు అవుతుందన్న చర్చ కూడా నడుస్తోందట కాంగ్రెస్ వర్గాల్లో. ఇలాంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలని నాన్ లోకల్కి అవకాశం ఇస్తే… ఇప్పటికిప్పుడు కాకున్నా… సందరర్భం వచ్చినప్పుడు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వస్తుందని వాదించేవారు సైతం లేకపోలేదు టి కాంగ్రెస్లో. దీంతో ఇప్పుడు కేకే కోటా సీట్లో ఎవర్ని పెద్దల సభకు పంపుతారన్నది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?