Off The Record: తాడేపల్లిగూడెంలో సెంటిమెంట్పై జనసేన గురి.. పొత్తు కుదిరితే పోటీ చేసేది ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: విలక్షణ తీర్పులకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే నియోజకవర్గం తాడేపల్లిగూడెంలో రాజకీయం ఆసక్తిగా మారుతోంది. పొత్తు ఉంటుందో లేదో తేలక టీడీపీ, జనసేన ఆశావహుల మధ్య కోల్డ్వార్ పీక్స్కు చేరింది. పొత్తు పొడిస్తే పోటీలో ఉండేది ఎవరు? పొత్తు లేకుండా గెలిచేది ఎవరనే లెక్కలేస్తున్నారు. తాడేపల్లిగూడెంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఐదు పార్టీలు గెలిచాయి. టీడీపీ నాలుగుసార్లు.. కాంగ్రెస్, ప్రజారాజ్యం, బీజేపీ, వైసీపీలో ఒక్కోసారి ఈ సీటును తమ ఖాతాలో వేసుకున్నాయి. 1999 నుంచి వరుసగా టిడిపి, కాంగ్రెస్, ప్రజారాజ్యం, బీజేపీ, వైసీపీ గెలుస్తూ వచ్చాయి. ఇదే సెంటిమెంటు వచ్చే ఎన్నికల్లోనూ రిపీట్ అవుతుందని భావిస్తోంది జనసేన. గత ఎన్నికల్లో 36 వేల ఓట్లు సాధించిన జనసేన అభ్యర్ధి బొలిశెట్టి శ్రీనివాస్ మూడో స్థానంలో నిలిచారు. టిడిపి నుంచి పోటీ చేసిన ఈలి నానికి 54వేల ఓట్లు వచ్చాయి. ఆ ఓటమి తర్వాత ఈలి నాని పార్టీ కార్యక్రమాలకు దూరం కావడంతో వలవల బాబ్జి టీడీపీ కన్వీనర్గా ఉన్నారు. గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన టిడిపి, జనసేనలు వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేస్తే అవకాశం దక్కేది ఎవరికని రెండు పార్టీల్లో స్థానికంగా చర్చ జరుగుతోంది.
Read Also: Off The Record: కలెక్టర్లపై గురి పెట్టిన బండి సంజయ్.. కొందరు ఐఏఎస్లు టచ్లో ఉన్నారా?
Also Read
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
- OTR : కష్టాలు మావి, క్రెడిట్ వాళ్లదా.. భోగాపురం వేడుకలో టీడీపీ నేతల అసంతృప్తి
- OTR: జాగ్రత్త.. మీరు, మీ భర్త జాగ్రత్తగా మెలగండి..
- Off The Record: ఇంటి దొంగలే దుష్ప్రచారం చేస్తున్నారా?.. మంచిర్యాల కాంగ్రెస్లో కొత్త మంటలు!
2014లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి బరిలో దిగడంతో బీజేపీ అభ్యర్థి పైడికొండల మాణిక్యాలరావు గెలిచారు. వచ్చే ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేయకపోతే వైసీపీని ఓడించడం కష్టమనేది ఇక్కడ రెండు పార్టీ నేతల మాట. అయితే జనసేన నుంచి బొలిశెట్టి, టీడీపీ నుంచి వలవల బాబ్జి ఇద్దరూ పోటీ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. వీరిలో ఎవరికి బరిలో ఉండే అవకాశం దక్కినా రెండోవారు సహకరిస్తారా అనేది అనుమానమే. గత ఎన్నికల్లో ఓడిపోవడంతో బొలిశెట్టికి సెంటిమెంట్ కలిసి వస్తుందని జనసేన వర్గాలు భావిస్తున్నాయట. టీడీపీ కంటే స్పీడ్గా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపడుతున్నారనే వాదన జనసేన వర్గాల్లో ఉందట. పొత్తు పొడిస్తే ఎవరు పోటీ చేస్తారు.. ఎవరు త్యాగం చేస్తారన్నది కూడా ప్రశ్నే. దీనిపైనే తాడేపల్లిగూడెంలో చర్చ సాగుతోంది. తాడేపల్లిగూడెంను రెవిన్యూ డివిజన్గా, పోలిస్ సబ్ డివిజన్గా ఏర్పాటు చేయించడం.. ఫార్మసీ కాలేజీని ప్రారంభించి ఎడ్యుకేషనల్ హబ్గా తయారు చేయడానికి అధికారపార్టీ చూస్తోంది. ఇక్కడ వైసీపీ నుంచి గెలిచిన కొట్టు సత్యనారాయణ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు. వైసీపీ కూడా తాడేపల్లిగూడెంలో పట్టుబిగిస్తోంది. అందుకే వచ్చే ఎన్నికలు టీడీపీ, జనసేన ఏం చేస్తాయనే ఉత్కంఠ నెలకొంది.
తాజావార్తలు
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
-
Ishan Kishan: బ్యాంక్ ఉద్యోగం, క్రికెట్ సరిపోలేదా?.. పార్ట్ టైమ్ టీ కొట్టు ఎప్పుడు పెట్టావ్ ఇషాన్ కిషాన్ భాయ్?
-
E3 Tryon: E3 ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. 165KM రేంజ్, AI ఫీచర్లు.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!