Off The Record: మాజీ ఎమ్మెల్యే వర్మ కోరి కొరివితో తల గోక్కుంటున్నారా..? అధిష్టానం క్లాస్ పీకిందా..?
- పిఠాపురం వర్మకు ఎమ్మెల్సీ ఇస్తామని ఎన్నికల టైంలో హామీ..
- నా వంతు ప్రయత్నం చేస్తానని పవన్ కళ్యాణ్ భరోసా..
- ఇప్పటికీ తనను పట్టించుకోవడంలేదని వర్మ అసహనం..
- తాజాగా ఎక్స్ మెసేజ్తో కలకలం..
- కష్టపడి సాధించే విజయానికే గౌరవం అంటూ మెసేజ్..
- రీ ట్వీట్స్తో మోత మోగించిన జన సైనికులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: పిఠాపురం టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మ…. గత ఎన్నికల్లో తాను పోటీ నుంచి తప్పుకుని కూటమి పొత్తులో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు మద్దతు తెలిపారు. ఇక ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచి తన సంగతి ఏంటని అడుగుతూనే ఉన్నారాయన. వర్మకు ఎమ్మెల్సీ ఇచ్చి ప్రమోట్ చేస్తామని ఎన్నికలకు ముందు స్వయంగా ప్రకటించారు చంద్రబాబు. అటు వర్మకు గౌరవప్రదమైన స్థానం ఇవ్వడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని పవన్ కూడా హామీ ఇచ్చేశారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 8నెలలవుతున్నా.. తనను పట్టించుకోలేదన్న అసహనంతో ఉన్నారట మాజీ ఎమ్మెల్యే. ఈ క్రమంలోనే తాజాగా ఆయన పెట్టిన ఎక్స్ మెసేజ్ హాట్ టాపిక్ అయింది. కష్టపడి సాధించే విజయానికే గౌరవం అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు వర్మ. అక్కడి వరకు ఓకే గానీ… ఆ పోస్ట్కి పిఠాపురం ఎన్నికల ప్రచారం వీడియోని జత చేయడంతో… తేడా కొట్టింది. బాగా హర్ట్ అయిన జన సైనికులు రీ ట్వీట్స్తో మోత మోగించేశారు. జనసేనను, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకునే… వర్మ సెటైరికల్గా ఆ మెసేజ్ పోస్ట్ చేశారన్నది జనసేన నాయకుల అనుమానం అట. దాంతో ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలు ఫైరైపోయారు. తమ అధినేతను కించపరిచారంటూ అభ్యంతరం తెలిపారు. పొత్తు ధర్మం అంటే ఇదేనా అని ప్రశ్నించారు కూడా.
టిడిపి నియోజకవర్గాల్లో జనసేన మద్దతు లేకుండా, కష్టపడకుండా గెలిచారా అన్నది వాళ్ళ క్వశ్చన్. దాంతో విషయం మరింత హీట్ ఎక్కింది. రియాక్షన్ తీవ్రతను గమనించి ఎక్కడో…. తేడా కొడుతోందని భయపడ్డ వర్మ… కొద్ది గంటల్లోనే తన ఎక్స్ అకౌంట్ నుంచి ఆ మెసేజ్ని డిలీట్ చేశారు. తన సోషల్ మీడియా అకౌంట్స్ని ఒక ప్రైవేట్ సంస్థ మూడేళ్ళ నుంచి ఆర్గనైజ్ చేస్తోందని, తనకు తెలియకుండానే ఆ మెసేజ్ పెట్టారంటూ వివరణ ఇచ్చుకున్నారు. అటు ఆ ప్రైవేట్ సంస్థ కూడా ఇదంతా తమ తప్పేనని క్లారిటీ ఇచ్చింది. అయినా సరే…. అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. గ్రౌండ్ లెవెల్లో రెండు పార్టీల క్యాడర్ మధ్య గ్యాప్ పెరిగిపోయిందని అంటున్నారు. ఇప్పటికే పిఠాపురంలో టిడిపి, జనసేనకు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనే పరిస్థితి ఉందట. రాష్ట్రమంతా ఒక లైన్లో ఉంటే… డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గంలో రెండు పార్టీల నేతలు కనీసం వేదిక పంచుకోవడానికి కూడా ఇష్టపడటం లేదని చెప్పుకుంటున్నారు. కార్యక్రమాలు కూడా ఎవరివి వాళ్లు సపరేట్ గా చేసుకుంటారు. ఇక ఈ తాజా సోషల్ మీడియా రచ్చతో వ్యవహారం మరింత ముదిరిందట. వర్మ అటెన్షన్ కోసమే ఆ మెసేజ్ పెట్టి ఉండవచ్చని, దాని ద్వారా తమను తక్కువ చేశారంటూ గుర్రుగా ఉన్నారట జన సైనికులు.
Also Read
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
మరోవైపు ఎన్నికల్లో కష్టపడ్డారు కాబట్టే… తమ నాయకుడు దానికి తగ్గ ప్రతిఫలం కోసం ఆ విధంగా పార్టీ పెద్దల దృష్టికి తీసుకు వెళ్లి ఉండవచ్చంటూ నియోజకవర్గ టీడీపీ నాయకులు వర్మకు కోరస్ వాయిస్తున్నట్టు సమాచారం. కానీ… కోరి కాంట్రవర్సీ తెచ్చారంటూ.. పార్టీ పెద్దలు ఆయన్ని కోప్పడ్డట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఏదన్నా ఉంటే… ఇంటర్నల్ గా మాట్లాడుకోవాలిగాని ఇలా… రచ్చకెక్కితే ఏం ప్రయోజనం అని క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. ఇలాంటివి పునరావృతం అయితే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని వార్నింగ్ కూడా ఇచ్చేసినట్టు జనసైనికులు పోస్టింగులు పెట్టేస్తున్నారు.. మరోవైపు ఈ విషయంపై మాత్రం జనసేన అధినాయకత్వం మాత్రం ఆచితూచి స్పందిస్తోంది. మొత్తానికి వర్మ చేసి, డిలీట్ చేసిన ఎక్స్ మెసేజ్తో పిఠాపురం పొలిటికల్ రచ్చ పీక్స్కు చేరింది. నన్ను గుర్తించండంటూ… ఆయన ఏదో చేయబోతే… చివరికి చిరిగి చేటైందని అంటున్నారు. ఇది ఇక్కడితో ఆగుతుందో, లేక మరిన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.
తాజావార్తలు
-
Virat Kohli: ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ సెంచరీ.. 105తో RCBని టాప్కి.. క్రిస్ గేల్ వరల్డ్ రికార్డ్ బ్రేక్
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!