Off The Record: పోతుల సునీత టీడీపీ ఎంట్రీ టఫ్గా ఉందా?
- పోతుల సునీత టీడీపీ ఎంట్రీ టఫ్గా ఉందా?..
- వైసీపీకి.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా..
- చీరాల నుంచి 2014లో టీడీపీ తరపున పోటీ.. ఓటమి..
- 2017లో ఎమ్మెల్సీ ఛాన్స్ ఇచ్చిన చంద్రబాబు..
- 2019 తర్వాత మూడేళ్ళ పదవి ఉండగానే వైసీపీలోకి..
- గతంలో చంద్రబాబు మీదికి మాటల తూటాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఇటీవలే వైసీపీకి బైబై చెప్పిన ఎమ్మెల్సీ పోతుల సునీతకు టీడీపీ ఎంట్రీ అంత ఈజీ కాదన్న టాక్ నడుస్తోంది ఉమ్మడి ప్రకాశం పొలిటికల్ సర్కిల్స్లో. ఆమె రాకను తమ్ముళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. వైసీపీ ప్రాధమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు సునీత. అదింకా ఆమోదం పొందాల్సి ఉంది. ఈ క్రమంలో టీడీపీలో చేరేందుకు పోతుల పావులు కదుపుతున్నా.. రానీయవద్దంటూ చీరాలలో టీడీపీ నేతలు రోడ్డెక్కుతున్న పరిస్థితి. గతంలో టీడీపీ నుంచి వైసీపీకి మారిన పోతుల సునీత ఆ పార్టీ మౌత్ పీస్గా పనిచేశారు. పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా పదవితో పాటు రెండు సార్లు ఎమ్మెల్సీ ఛాన్స్ ఇచ్చారు జగన్. అయితే… రాష్ట్రంలో అధికారం మారాక అనూహ్యంగా పార్టీ సభ్యత్వంతో పాటు, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి ట్విస్ట్ ఇచ్చారు సునీత. త్వరలోనే తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పినా అడుగులు టీడీపీవైపేనన్నది అనుచరుల మాట.
పరిటాల రవి అనుచరులు అయిన పోతుల సునీత, ఆమె భర్త పోతుల సురేష్ మావోయిస్టు రాజకీయాల నుంచి టిడిపిలో చేరారు. చీరాల నియోజకవర్గం నుంచి 2014లో పోటీ చేసి ఓడిన సునీతకు 2017లో ఎమ్మెల్సీ ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. అయితే 2019 ఎన్నికల తర్వాత టీడీపీ అధికారం కోల్పోవటంతో మరో మూడేళ్ల పదవీకాలం ఉండగానే… తన పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారామె. ఆ తర్వాత ఆమెకు ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది వైసీపీ. ఆ పదవీకాలం 2023 మార్చితో ముగియగా… మరోసారి ఛాన్స్ ఇచ్చారు జగన్. వైసీపీలో చేరిన నాటి నుంచి…. అవసరం ఉన్నా లేకపోయినా గట్టిగానే కౌంటర్ ఇస్తూ వచ్చారామె.. ఈ పరిస్థితుల్లో తాజాగా మరోసారి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు ఎమ్మెల్సీ. తాను ఏ పార్టీలో చేరేది డైరెక్ట్ గా ఇంత వరకూ చెప్పలేదు సునీత. కానీ…. కచ్చితంగా టీడీపీలో చేరుతారనే ఊహాగానాలతో అలర్ట్ అయ్యారట చీరాల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు. ఆమెను పార్టీలోకి చేర్చుకోవద్దంటూ స్థానిక గడియార స్తంభం సెంటర్లో టీడీపీ, జనసేన నేతలు ఆందోళనకు దిగటం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
Also Read
అంతటితో ఆగని తమ్ముళ్లు పోతుల సునీత ఫ్లెక్సీని చెప్పులతో కొట్టి దహనం చేసి ఆమెకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేయటం హాట్ టాపిక్ అయింది. దీంతో ఆమె టీడీపీలో చేరడం అంత తేలిక కాదన్న చర్చ మొదలైంది. ఇప్పటికే చీరాలలో జరుగుతున్న పరిణామాలను పార్టీ అధినేత దృష్టికి తీసుకు వెళ్ళారట స్థానిక టీడీపీ నేతలు.. మరి తమ్ముళ్ళ ఫిర్యాదులపై అధిష్టానం ఎలా స్పందిస్తుంది? ఆమె ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేక తమ్ముళ్ళ మాట ప్రకారం రెడ్ కార్డ్ చూపిస్తారా? అన్న చర్చ మొదలైంది. ఒకవేళ రెడ్ కార్డ్ పడితే సునీత తదుపరి అడుగులు ఎటువైపు అన్నది కూడా సస్పెన్స్గానే ఉంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
-
TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
-
Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
-
Peddi vs Drishyam : మోహన్ లాల్కు “పెద్ది” దెబ్బ…. విదేశాల్లోనూ షాకే!
-
Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!