Off the Record about Narayankhed Congress: రాజీ చేసినా కలవని నేతలు.. నారాయణఖేడ్ కాంగ్రెస్లో రగడ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాల గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచింది. ఇక్కడ మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, పీసీసీ నేత సంజీవ్రెడ్డి మధ్య ఒక్క క్షణం పడటం లేదు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నారాయణఖేడ్లో కాంగ్రెస్ టికెట్ కోసం ఇద్దరూ తీవ్రంగా పోటీ పడుతున్నారు. తండ్రుల వారసత్వంతో రాజకీయం చేస్తూ.. దానిని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. 2016లో అప్పటి ఎమ్మెల్యే కిష్టారెడ్డి చనిపోవడంతో.. ఇక్కడ కాంగ్రెస్లో మొదలైన జగడం ఆరని చిచ్చులా రగులుతూనే ఉంది. ఆనాటి ఉపఎన్నికలో నారాయణఖేడ్ గెలిచే సీటు అని పార్టీ భావించినా.. ఇద్దరు నేతల మధ్య ఉన్న గ్యాప్తో చేజారిపోయింది. తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే రిపీటైంది. కాంగ్రెస్ టికెట్ సురేష్ షెట్కార్కు ఇవ్వడంతో అలిగి బీజేపీలోకి వెళ్లారు కిష్టారెడ్డి కుమారుడు సంజీవ్రెడ్డి. ఆ తర్వాత సంజీవ్రెడ్డి కాంగ్రెస్లోకి రీఎంట్రీ ఇచ్చారు. మళ్లీ వర్గపోరు షురూ. పార్టీ తరఫున ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ఇద్దరూ ఎడముఖం పెడముఖమే. కలిసి సాగిన సందర్భాలు లేవంటాయి పార్టీ వర్గాలు.
Also Read
చివరకు రాహుల్గాంధీ భారత్ జోడో యాత్ర సమయంలోనూ సురేష్ షెట్కార్, సంజీవ్రెడ్డి మధ్య విభేదాలు ముదురుపాకాన పడటంతో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ రాజీ చేశారు. అయినా మాట వింటేనా.. రాహుల్ పాదయాత్రలోనూ వీధి పోరాటానికి దిగారు. రాహుల్ ఎదుటే పోటాపోటీగా నినాదాలు చేసుకున్నాయి రెండు వర్గాలు. తాజాగా ధరణి సమస్యలపై నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలకు పిలుపిచ్చింది టీపీసీసీ. అందులోనూ ఎవరి కుంపటి వాళ్లదే. ఒకటే కార్యక్రమం అయినా.. వేర్వేరుగా ఆందోళనలు నిర్వహించారు. ఆర్డీవోకు వినతిపత్రాలు ఇచ్చేందుకు కూడా వేర్వేరు మార్గాలనే ఎంచుకున్నారు. ఎవరి అనుచరులను వాళ్లు తీసుకెళ్లి వినతిపత్రాలు అందజేశారు. ఒకటే నియోజకవర్గం.. ఒకటే కార్యక్రమం అయినప్పటికీ.. పార్టీ నుంచి రెండు వినతిపత్రాలు ఆర్డీవోకు ఇవ్వడం నారాయణఖేడ్ కాంగ్రెస్కే చెల్లింది. కాంగ్రెస్ పెద్దలు.. సన్నిహితులు చెప్పినా.. సురేష్, సంజీవ్రెడ్డి మధ్య వర్గపోరు సెగలు చల్లారడం లేదు. వచ్చే ఎన్నికల్లో టికెటే లక్ష్యంగా ఎత్తుగడలు వేస్తున్నారు. మరి.. అధిష్ఠానం వీరిని బుజ్జగిస్తుందా.. లేక నాన్చి నాన్చి చేతులు కాల్చుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
-
Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
-
OTR: పశ్చిమ గోదావరి వైసపీలో నిస్తేజం.. పదవులు అనుభవిస్తున్నా గళం వినిపించని లీడర్లు!
-
Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
-
Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..