Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Mylavaram Ysrcp

Off The Record: మైలవరంలో తారాస్థాయికి వైసీపీ నేతల వర్గపోరు.. మంత్రి, ఎమ్మెల్యే వర్గాలు మళ్లీ ఢీ

Published Date :February 8, 2023 , 9:45 pm
By Sudhakar Ravula
Off The Record: మైలవరంలో తారాస్థాయికి వైసీపీ నేతల వర్గపోరు.. మంత్రి, ఎమ్మెల్యే వర్గాలు మళ్లీ ఢీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record:ఉమ్మడి కృష్ణాజిల్లాలోని మైలవరం నియోజకవర్గం వైసీపీలో ఆధిపత్య పోరు కొన్ని నెలలుగా తీవ్రస్థాయిలో సెగలు కక్కుతోంది. మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. పెడన ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ సొంత ఊరు మైలవరం నియోజకవర్గంలో ఉంది. 2014లో జోగి మైలవరంలో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వసంత కృష్ణప్రసాద్‌ నందిగామలో పోటీ చేసి గెలిచారు. ఇద్దరూ అధికారపార్టీ శాసనసభ్యులుగా ఉన్నా అస్సలు పడటం లేదు. మొన్నటి కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణలో మంత్రి అయ్యారు జోగి రమేష్‌. అప్పటి నుంచి మైలవరంలో చాపకింద నీరులా ఉన్న విభేదాలు ఇంకా పెరిగాయి. మైలవరం రాజకీయం మడత పేచీలా మారి అధిష్ఠానం దగ్గర పంచాయితీల వరకు వెళ్లింది.

Read Also: Off The Record: అధినేత దృష్టిలో పడేందుకే ప్రయారిటీ..! మంత్రిపై అధిష్టానికి ఫిర్యాదులు..

Also Read

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్
  • Off The Record : తెలంగాణ బీజేపీ నేతల తీరును ఎండగడుతున్న సొంత కేడర్
  • Off The Record : టీడీపీ అధిష్టానం మీద వత్తిడి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారా?

జోగి మంత్రయ్యాక మైలవరం విషయాల్లో వేలు పెడుతున్నారని ఎమ్మెల్యే వసంత పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి రెండు వర్గాలతో మాట్లాడారు. తర్వాత మైలవరంపై సీఎం జగన్‌ సమీక్ష చేశారు. ఆ సమీక్ష తర్వాత మైలవరం లెక్కలు మారుతున్నట్టు టాక్‌. సమీక్షల్లో అధినేత ఒకరి పేరు చెప్పి.. ఆ అభ్యర్థిని ఎన్నికల్లో గెలిపించుకుని రావాలని ఆదేశించేవారు. కానీ.. మైలవరం సమీక్షలో అలా జరగలేదట. వసంత పేరు చెప్పకుండా కేవలం వైసీపీని గెలిపించుకు రావాలని సీఎం అన్నట్టు ప్రచారం జరుగుతోంది. దాంతో వచ్చే ఎన్నికల్లో మైలవరంలో అభ్యర్థిని మార్చేస్తారా అనే చర్చ మొదలైంది. మైలవరంలో వసంతను కొనసాగిస్తారా? లేక జోగి రమేష్‌కు ఛాన్స్‌ ఇస్తారా అనే అనుమానాలు వైసీపీ కేడర్‌లో ఉన్నాయి. ఇప్పటికే సీటు ఎవరిదో డిసైడ్‌ కావడం వల్లే వసంత పేరును సమీక్షలో ప్రస్తావించలేదనే వాదన ఉంది. అయితే మైలవరంతోపాటు పెడనలోనూ సిట్టింగ్‌లకు ఇద్దరికీ ఎదురుగాలి వీస్తోందని అధిష్ఠానానికి ఫీడ్‌ బ్యాక్‌ వెళ్లిందట. ఇద్దరు నేతలు కలహించుకుని ఆ సీటును చేజార్చుకుంటారా అనే అనుమానం అధిష్ఠానంలో ఉందట.

Read Also: Off The Record: మాజీ ఎంపీ పొంగులేటి ఏ పార్టీలో చేరతారు? ఆ ప్రచారంలో నిజమెంత?

ఇటీవల ఇబ్రహీంపట్నంలో జరిగిన ఓ వివాహ వేడుకకు మంత్రి జోగి రమేష్ హాజరయ్యారు. ఆ సందర్భంగా వైసీపీ నేత నల్లమోతు మధుబాబు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారట. దానిపై వసంత అభిమానులు మధుబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న వసంత అండ్‌ కో మధుబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సజ్జల అపాయింట్‌మెంట్ కోరారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆ సమస్యను ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ దగ్గర పంచాయితీ పెట్టారు. మంత్రి జోగి వర్గం కూడా వసంతపై ఫిర్యాదు చేసింది. మధుబాబుపై చర్యలు తీసుకోకుంటే తామంతా పదవులకు రాజీనామా చేస్తామని వసంత వర్గం హెచ్చరించగా.. గతంలో జోగి రమేష్‌పై వ్యాఖ్యలు చేసిన వారి సంగతేంటని మంత్రి వర్గం నిలదీసిందట. దీంతో మైలవరం జగడం తారాస్థాయికి చేరినట్టు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సమస్యకు హైకమాండ్‌ సూచించే పరిష్కారంపై పార్టీవర్గల్లోనూ ఉత్కంఠ నెలకొంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Minister Jogi Ramesh
  • MLA Vasantha Krishna Prasad
  • Mylavaram
  • Off The Record about Mylavaram YSRCP
  • YSRCP

తాజావార్తలు

  • Bhoghi : ‘కందుల సులోచన రాణి’గా.. అనుపమ.. ఫస్ట్ లుక్ బాగుంది

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Jasprit Bumrah: సీన్ రివర్స్.. బ్యాటర్ల ముందు బెంబేలెత్తిపోతున్న బుమ్రా.. కెరీర్లోనే చెత్త ప్రదర్శన!

  • Dhruva Natchathiram : విక్రమ్ సినిమా వస్తోంది.. కానీ సూర్యతో పోటీ తప్పేలా లేదు

  • AP SSC Results 2026: ఏపీ టెన్త్‌ ఫలితాలు విడుదల.. పెరిగిన ఉత్తీర్ణత..

ట్రెండింగ్‌

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions