Off The Record: అలకలు అగ్గి రాజేస్తాయా..? మిగిలిన మూడు మంత్రి పదవుల కోసం కుస్తీలు తప్పవా..?
- విస్తరణ తర్వాత ఆశావహుల్లో పెరుగుతున్న అసంతృప్తి..
- పెండింగ్లో ఇంకో మూడు పదవుల భర్తీ..
- వివేక్కి చోటుతో అలకబూనిన ప్రేమ్సాగర్రావు..
- పార్టీ మారి వస్తేనే పదవులా అంటూ నిష్టూరాలు..
- సుదర్శన్రెడ్డిది కూడా అలకల బాటే..
- ఇచ్చిన హామీ సంగతేంటంటున్న రాజగోపాల్రెడ్డి..
- ఆశావహుల్లో ఎక్కువ మంది రెడ్లే..
- ప్రస్తుతం కొనసాగుతున్న బుజ్జగింపుల పర్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: మంత్రివర్గ విస్తరణ తెలంగాణ కాంగ్రెస్లో అసంతృప్తిని తగ్గించకపోగా… సెగలు పొగలు మరింత పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడంతో.. ఆశావహుల్లో అసంతృప్తి ఎక్కువ అవుతోందట. రాష్ట్ర మంత్రివర్గంలో మొత్తం ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో మూడు మంత్రి పదవులు భర్తీ అయ్యాయి. ఇంకో మూడు పెండింగ్లో ఉన్నాయి. ఆదివారం నాటి కేబినెట్ విస్తరణలో వివేక్కి చోటు కల్పించడంపై… అక్కడి నుంచే ఆశలు పెట్టుకున్న ప్రేమ్ సాగర్ రావు అలకబూనారట. పార్టీ కోసం పని చేసిన వారిని కాకుండా… మారి వచ్చిన వారికి పదవులు ఇవ్వడం అంటే.. సొంతోళ్ళని అవమానించడమేనని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్… మీనాక్షి నటరాజన్ ముందే చెప్పేశారాయన. ఇక కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగినా… బెర్త్ ఖాయం అనుకున్న సుదర్శన్ రెడ్డిది కూడా సేమ్ సీన్. వివేక్తో పాటు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరినప్పుడే మంత్రి పదవి హామీ ఇచ్చారట. ఇద్దరికీ ఒకే రకమైన హామీలు ఇచ్చారు.
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
ఇప్పుడు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటూ పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇక మల్రెడ్డి రంగారెడ్డి డిమాండ్ ఉండనే ఉంది. ఐతే… కేబినెట్ లో ప్రాతినిధ్యం లేని నిజామాబాద్, రంగారెడ్డితోపాటు నల్గొండ.. జిల్లా నుండి పదవులు ఆశిస్తున్న వాళ్లంతా రెడ్డి సామాజిక వర్గం నేతలే అవడంతో… హైకమాండ్ కూడా ఎవరికి బెర్తులు ఇవ్వాలో అర్ధంగాక డైలమాలో పడ్డట్టు సమాచారం. మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ వారిని ప్రస్తుతం అధిష్టానం బుజ్జగిస్తోంది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో ఏఐసీసీ ముఖ్యుడు కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఆయన ఇంటికి వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ పరిస్థితుల్లో మిగతా మూడు పోస్ట్లను ఎప్పుడు భర్తీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మిగతా మూడింటిని భర్తీ చేయవచ్చంటున్నారు. అప్పుడు కూడా … ఆశావహుల చిట్టా చూస్తే ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. పార్టీ అధిష్టానం మాత్రం సామాజిక న్యాయం అంటోంది. దీంతో మిగతా మూడు పదవులు ఎవరికి వెళ్తాయన్న ఉత్కంఠ మాత్రం అలాగే ఉంది కాంగ్రెస్ వర్గాల్లో. ఇప్పటికైతే ఆశావహులు కొంత నెమ్మదించినా…మిగిలి ఉన్న మూడు ఖాళీల మీద భారీగా ఆశలు పెట్టుకున్నారు. అప్పుడైనా కేబినెట్లో ఇంత మందిని ఎలా అడ్జెస్ట్ చేస్తారన్నది ప్రశ్నార్ధకమే. కేబినెట్ లోకి మిగిలిన ఆ ముగ్గురు ఎవరు? విప్లు, చీఫ్ విప్లు ఎవరు? అధిష్టానం ఎలా ఫఐనల్ చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!