Off The Record: ఖమ్మంలో కలకలం.. గాయత్రి రవి కంపెనీలపై వరుస దాడులు ఎందుకు?
- గాయత్రి రవి కంపెనీల మీద వరుసగా విజిలెన్స్ దాడులు..
- నిజంగానే అక్రమాలా? లేక రాజకీయ కక్ష సాధింపులా?..
- మొదట కాంగ్రెస్లోనే రవి, 2018లో ఎమ్మెల్యే టిక్కెట్, ఓటమి..
- 2018 తర్వాత బీఆర్ఎస్లోకి, రాజ్యసభ సీటు..
- 2024లో ఖమ్మం ఎంపీగా పోటీ చేయమని కోరిన కాంగ్రెస్..
- కాదన్నందుకే ఇప్పుడిలా అంటూ కొందరి విశ్లేషణలు..
- ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని గ్రానైట్ క్వారీల్లో తనిఖీలు..
- ఖమ్మం జిల్లా బీఆర్ఎస్లో కీలకంగా మారిన గాయత్రి రవి..
- ప్రస్తుత మంత్రి ఒకరికి అప్పట్లో రైట్ హ్యాండ్లా వద్దిరాజు..
- దాడుల గురించి మంత్రికి చెప్పినా నావల్ల కాదని చేతులెత్తేశారా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఖమ్మం జిల్లాలో విజిలెన్స్ దాడులు కలకలం రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా… బీఆర్ఎస్కు చెందిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అలియాస్ గాయత్రి రవికి చెందిన కంపెనీల మీదే వరుసబెట్టి జరుగుతుండటం పొలిటికల్ హాట్ అవుతోంది. ఇదంతా నిజంగానే అక్రమాల వెలికితీత కోసం జరుగుతోందా…? లేక రాజకీయ కక్ష సాధింపులో భాగమా అన్న అనుమానాలు అన్ని వర్గాల్లో పెరుగుతున్నాయట. వరంగల్ జిల్లాకు చెందిన వద్దిరాజు… ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో గ్రానైట్ వ్యాపారం ఉంది. బీసీ కాపు సామాజిక వర్గానికి చెందిన రవి… మొదట్లో కాంగ్రెస్ అభిమానిగానే ఉన్నారు. 2018లో ఆ పార్టీ వరంగల్ తూర్పు అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చిందిగానీ… విజయం సాధించలేదు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరాక రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారు కేసీఆర్. ఆ పదవీకాలం రెండేళ్ళే కావడం, ముగిసిపోవడంతో… తిరిగి ఆయనకే రెన్యువల్ చేశారు. ఈ పరిస్థితుల్లో… 2024 లోక్సభ ఎన్నికల్లో వద్దిరాజును తమ పార్టీ తరపున ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించాలని అనుకున్నారట కాంగ్రెస్లోని కొందరు. అందుకు ఆయన ఒప్పుకోకపోగా… బీఆర్ఎస్కు అండగా ఉంటున్నారన్న కోపంతో అధికార పార్టీ ఇప్పుడు టార్గెట్ చేసిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్లో. కేసీఆర్, హరీష్రావు లాంటి అగ్ర నాయకులకు దగ్గరగా ఉండే గాయత్రి రవిని బీఆర్ఎస్కు దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆ క్రమంలోనే…. కొద్ది రోజులుగా ఆయనకు చెందిన గ్రానైట్ కంపెనీల్లో విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయన్న ప్రచారం నడుస్తోంది.
ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని గ్రానైట్ క్వారీల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అయితే… ఇవి ఎక్కడా బయటికి ఎక్స్పోజ్ అవకుండా జాగ్రత్త పడ్డారట అధికారులు. మరోవైపు కొంతకాలంగా… ఖమ్మం జిల్లా కారును గాయత్రి రవి, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు కందాల, సండ్ర వెంకటవీరయ్య కలిసి నడిపిస్తున్నారు. ఇందులో కీలకంగా ఉన్నందునే గాయత్రి రవి టార్గెట్ అయ్యారా… అన్న అనుమానాలు కూడా చాలామందికి ఉన్నాయట. జిల్లాలో ఉన్న ముఖ్యమైన ప్రతిపక్ష నాయకులు ఒక్కొక్కరిని టార్గెట్ చేసేలా అధికార పార్టీ పావులు కదుపుతోందన్నది బీఆర్ఎస్ అభిప్రాయం. అటు గతంలో కాంగ్రెస్ నేతలకు అత్యంత ఆప్తుడిగా ఉండేవారు రవి. ప్రస్తుతం రాష్ట్రంలో కీలక మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న ఒక మినిస్టర్కు అప్పట్లో రైట్ హ్యాండ్లా ఉండేవారాయన. ఇప్పుడు తనకు ఎదురవుతున్న సమస్యలు, వేధింపుల గురించి వద్దిరాజు రవిచంద్ర సదరు మంత్రికి చెప్పుకున్నా… నా చేతిలో ఏమీ లేదని ఆయన అన్నట్టు తెలిసింది. మరోవైపు వచ్చే అసెంబ్లీ… ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యే సీట్లో రవి పోటీ చేస్తారన్న ప్రచారం సైతం ఉంది. ఇక ఆయన గ్రానైట్ క్వారీలతో పాటు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ బంధువులు నిర్వహిస్తున్న దుకాణ సముదాయానికి కూడా అధికారులు నోటీసులు ఇచ్చారట. వాటి వెనుక సైతం అధికార పార్టీ నేతల వత్తిడి ఉందని ఆఫ్ ద రికార్డ్లో అజయ్ అంటున్నారట. అయితే దాన్ని ఇష్యూ చేయడం వల్ల వచ్చే ప్రయోజనం కూడా ఏమీ ఉండదన్నది ఆయన అభిప్రాయం. అయితే… గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జిల్లా పాలిటిక్స్లో అజయ్ వర్సెస్ గాయత్రి రవి అన్నట్టుగా కూడా వ్యవహారాలు నడిచాయి. ఆ సంగతి ఎలా ఉన్నా… ప్రస్తుతం నడుస్తున్న విజిలెన్స్ వ్యవహారాలను గాయత్రి రవి ఎలా ఎదుర్కొంటారోనని చూస్తున్నాయి రాజకీయవర్గాలు.
Also Read
తాజావార్తలు
-
China: డ్రాగన్ కొత్త ఎత్తుగడ.. భారత్ సరిహద్దులో కొత్త కారిడార్కు ప్రణాళిక
-
Nandini Reddy: “అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?” రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Ponnam Prabhakar : ఆడలేక మద్దెల ఓడన్నట్లుంది బీఆర్ఎస్ వ్యవహారం
-
Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!